మహారాష్ట్ర: ప్రభుత్వ ఏర్పాటుకు శివసేనను ఆహ్వానించిన గవర్నర్.. బీజేపీ విముఖతతో ఈ నిర్ణయం

ఫొటో సోర్స్, Getty Images
మహారాష్ట్ర రాజకీయం ఆదివారం కీలక మలుపులు తిరిగింది.
తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోవడం లేదని ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ప్రకటించగా, ఆ తర్వాత కొన్ని గంటలకు రెండో అతిపెద్ద పార్టీ అయిన శివసేనను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆహ్వానించారు.
ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధతను, సంఖ్యా బలాన్ని తెలియజేయాలని శివసేన శాసనసభాపక్ష నేత ఏక్నాథ్ షిండేకు గవర్నర్ సూచించినట్లు గవర్నర్ కార్యాలయం తెలిపింది.
గవర్నర్ శనివారం బీజేపీని ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించారు. బీజేపీ మహారాష్ట్ర అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ముంబయిలో గవర్నర్ను కలిసి, ప్రభుత్వ ఏర్పాటుకు శివసేన తమతో కలసి రావడం లేదని, తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోమని స్పష్టం చేశారు.

ఫొటో సోర్స్, HANDOUT
గవర్నర్తో సమావేశం తర్వాత చంద్రకాంత్ పాటిల్ మీడియాతో మాట్లాడుతూ- బీజేపీ, శివసేన కలిసి పనిచేయాలని ప్రజలు తీర్పు ఇచ్చారని, ఇప్పుడు శివసేన ప్రజాతీర్పును అగౌరవపరిచి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ)తో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకొంటే చేసుకోవచ్చని, వారికి తమ శుభాకాంక్షలు చెబుతున్నామని వ్యాఖ్యానించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
మా పార్టీ నుంచే సీఎం: శివసేన
బీజేపీ నిర్ణయం వెలువడిన తర్వాత శివసేన ఎంపీ సంజయ్ రౌత్ మీడియాతో మాట్లాడుతూ- ముఖ్యమంత్రి శివసేన నుంచే ఉంటారని పార్టీ అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు (ఆదివారం) చెప్పారని, ఆయన అలా చెప్పారంటే ఏది ఏమైనా సీఎం శివసేన నుంచే ఉంటారని అర్థమని పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
సీఎం పీఠంపై పీటముడి
అక్టోబరు 24న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో శివసేన-బీజేపీ కూటమి స్పష్టమైన మెజారిటీ సాధించింది. అయితే ముఖ్యమంత్రి పీఠంపై బీజేపీ, శివసేన మధ్య ప్రతిష్టంభన ఏర్పడింది.
ముఖ్యమంత్రి పదవిని శివసేన, బీజేపీ తలా రెండున్నరేళ్ల చొప్పున చేపట్టాలని ఫలితాలు వెలువడిన తర్వాత శివసేన ప్రతిపాదించింది. దీనికి బీజేపీ ఒప్పుకోవడం లేదు.
అసెంబ్లీలో మొత్తం స్థానాల సంఖ్య 288. ప్రభుత్వం ఏర్పాటుకు 145 సీట్ల బలం ఉండాలి.
నాలుగు ప్రధాన పార్టీలకు వచ్చిన సీట్లు
బీజేపీ - 105
శివసేన - 56
ఎన్సీపీ - 54
కాంగ్రెస్ - 44
మా మద్దతు కావాలంటే...: ఎన్సీపీ
తమ ఎమ్మెల్యేలతో ఈ నెల 12న మంగళవారం సమావేశం నిర్వహిస్తున్నట్లు ఎన్సీపీ నాయకుడు నవాబ్ మాలిక్ తెలిపారు.
శివసేన తమ మద్దతు కావాలనుకొంటే, బీజేపీతో ఎలాంటి సంబంధాలూ లేవని శివసేన ప్రకటించాలని, బీజేపీ నాయకత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్డీఏ) నుంచి బయటకు రావాలని ఎన్సీపీ స్పష్టం చేసింది. కేంద్ర మంత్రిమండలి నుంచి శివసేన మంత్రులు వైదొలగాలని చెప్పింది.
ఇవి కూడా చదవండి:
- మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మహారాష్ట్ర బీజేపీకి.. హరియాణాలో హంగ్
- ఏఐఎంఐఎం: భాగ్యనగరం నుంచి బిహార్ వరకు ఎగిరిన ‘గాలిపటం’
- మహారాష్ట్రలో ‘పెద్దన్న’ ఎవరు? శివసేన కోరికను బీజేపీ అంగీకరిస్తుందా?
- అయోధ్య తీర్పు: సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనంలోని న్యాయమూర్తులు వీరే
- అయోధ్య- రామజన్మభూమి - బాబ్రీ మసీదు వివాదం పూర్తి చరిత్ర
- అయోధ్య తీర్పు: సుప్రీంకోర్టు తీర్పులో ఐదు ముఖ్యాంశాలు
- అయోధ్య తీర్పు: బాబ్రీ మసీదు కూల్చివేత కేసులు ఇప్పుడు ఏమవుతాయి...
- కర్తార్పూర్ కారిడార్ ప్రారంభం.. ఇమ్రాన్ఖాన్కు థ్యాంక్స్ చెప్పిన మోదీ
- వారానికి నాలుగు రోజులే పని.. 40 శాతం పెరిగిన మైక్రోసాఫ్ట్ అమ్మకాలు
- ప్రొఫెసర్ బ్యాగులో దొరికిన మాజీ విద్యార్థిని చేతులు
- వెయ్యేళ్ల నాటి ఈ అస్థిపంజరం కోసం నాజీలు, సోవియట్లు ఎందుకు పోరాడారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








