భారత్ Vs దక్షిణాఫ్రికా: మయాంక్ అగర్వాల్ సెంచరీ.. పుజారా, కోహ్లీ అర్ధ శతకాలు..

మయాంక్ అగర్వాల్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మయాంక్ అగర్వాల్

దక్షిణాఫ్రికాతో పుణెలో జరుగుతున్న రెండో టెస్ట్‌లో మొదటి రోజు భారత్ మూడు వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది.

తొలి టెస్ట్‌లో డబుల్ సెంచరీతో చెలరేగిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్, ఈ రోజు సెంచరీ కొట్టాడు. చతేశ్వర్ పుజారా, కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ శతకాలతో రాణించారు.

మయాంక్ 183 బంతుల్లో 16 ఫోర్లు, రెండు సిక్సర్లతో సెంచరీ పూర్తిచేశాడు. 108 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద రబడ బౌలింగ్‌లో డుప్లెసిస్‌కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. అప్పుడు భారత్ స్కోరు 198 పరుగులు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది

మూడు మ్యాచుల టెస్ట్ సిరీస్‌లో భాగంగా విశాఖపట్నంలో జరిగిన మొదటి టెస్టులో సాధించిన విజయంతో టీమిండియా పుణెలో గురువారం ఉత్సాహంగా బరిలోకి దిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది.

చతేశ్వర్ పుజారా

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అర్ధ సెంచరీ చేసిన పుజారా

మొదటి టెస్టులో రెండు సెంచరీలతో 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచిన మరో ఓపెనర్ రోహిత్ శర్మ, ఈ రోజు 14 పరుగులకే వెనుదిరిగాడు.

రోహిత్ గత మ్యాచ్లో అసాధారణ ప్రదర్శనతో, 144 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఓపెనర్‌గా దిగిన మొదటి టెస్టులోనే రెండు ఇన్నింగ్సుల్లో సెంచరీ కొట్టిన మొట్టమొదటి ఆటగాడిగా నిలిచాడు.

రోహిత్ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన చతేశ్వర్ పుజారా అర్ధ సెంచరీ సాధించాడు. అతడు 112 బంతుల్లో తొమ్మిది ఫోర్లు, ఒక సిక్సర్‌తో 58 పరుగులు చేసి, నిష్క్రమించాడు.

మయాంక్, పుజారా, రోహిత్ ముగ్గురూ రబడ బౌలింగ్‌లోనే ఔట్ అయ్యారు.

విరాట్ కోహ్లీ 63 పరుగుల(పది ఫోర్లు)తో, అజింక్య రహానే 18 పరుగుల(మూడు ఫోర్లు)తో నాటౌట్‌గా ఉన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)