ముంబయి వరదలు: మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్‌లో చిక్కుకుపోయిన 1050 మంది సురక్షితం

మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్

ఫొటో సోర్స్, SpokespersonNavy/Twitter

ఫొటో క్యాప్షన్, వరదలో చిక్కుకుపోయిన మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ వద్ద సహాయ చర్యలు

దేశ ఆర్థిక రాజధాని ముంబయిని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి.

24 గంటల్లో 150 సెంటీమీటర్లకు పైగా వర్షం కురవడంతో ముంబయి నగరంతో పాటు పరిసర ప్రాంతాలన్నీ నీట మునిగాయి.

కొల్హాపూర్ నుంచి వస్తున్న మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం రాత్రి ముంబయికి సమీపంలో వంగణి పట్టణం వద్ద ఇక ముందుకు సాగలేక పట్టాలుపైనే నిలిచిపోయింది.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 1

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 1

ఆ రైలులో ఉన్న సుమారు వందలాది మంది ప్రయాణికులు 15 గంటల పాటు అందులో చిక్కుకుపోయారు.

రైలు లోపల కూడా నీరు చేరడంతో ఎటూ కదలలేకపోయారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ప్రయాణికులందరినీ రైలులోనే ఉండాలని అధికారులు సూచించడంతో అందులోనే గడిపారు. తాగడానికి నీరు, తినడానికి భోజనం లేక ఇక్కట్లు పడ్డారు.

రైలులో చిక్కుకుపోయినవారిని రక్షించడానికి ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలతో పాటు హెలికాప్టర్లు, బోట్లను కూడా పంపించారు.

దీంతో రైలులో చిక్కుకున్న ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు.

మొత్తం 1050 మంది ప్రయాణికులను రక్షించినట్లు సెంట్రల్ రైల్వే పీఆర్వో సునీల్ ఉదాసీ ప్రకటించారు.

ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది

ఫొటో సోర్స్, AFP

ఫొటో క్యాప్షన్, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడిన రైలు ప్రయాణికుల్లో 9 మంది గర్భిణులు ఉన్నారు

మహాలక్ష్మి ఎక్స్‌ప్రెస్ నుంచి కాపాడిన 700 మంది ప్రయాణికుల కోసం సమీపంలోనే ఒక శిబిరం ఏర్పాటుచేసి భోజనం, మందులు సరఫరా చేశారు.

ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తీసుకొస్తున్న ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది

ఫొటో సోర్స్, Ndrf

ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది సురక్షితంగా కాపాడినవారిలో తొమ్మిది మంది గర్భిణులు కూడా ఉన్నారు.

వారికి అవసరమైన మందులు సమకూర్చడంతో పాటు వైద్యసహాయం కూడా అధికారులు అందించారు.

బాధిత ప్రయాణికులు తమ గమ్యస్థానాలు చేరుకోవడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నారు.

బదలాపూర్‌లో నీట మునిగిన కార్లు

మహారాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నదులు పొంగడంతో ముంబయి నగరంతో పాటు బద్లాపూర్, వంగణి, ఉల్లాస్‌నగర్ పట్టణాలూ నీట మునిగాయి.

11 విమానాలు, అనేక రైళ్లు రద్దయ్యాయి. పలు ఇతర రైళ్లను దారి మళ్లించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

ముంబయి, చుట్టుపక్కల లోకల్ ట్రైన్లు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయి ప్రయాణికులు చిక్కుకుపోయారు.

స్థానిక పోలీసులు, ఎన్డీఆర్‌ఎఫ్ సిబ్బంది శుక్రవారం రాత్రి వారికి సహాయ సహకారాలు అందించారు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి, 2

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది, 2

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)