వైఎస్ షర్మిల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

వీడియో క్యాప్షన్, వైఎస్ షర్మిల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం?
వైఎస్ షర్మిల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం?

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెల్లెలు షర్మిల ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడం అక్కడి రాజకీయాలను ఎంత వరకు ప్రభావితం చేయగలదు?

పూర్తిగా నిస్తేజంగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌లో ఆమె తిరిగి పునరుత్తేజం నింపగలరా?

ఇంతకూ షర్మిల వల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం? అధికార వైసీపీకా, ప్రతిపక్ష టీడీపీకా? ఆమె చీల్చగలిగే ఓట్లు ఎవరివి? ఇవీ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం వినిపించే ప్రశ్నలు.

వీక్లీ షో విత్ జీఎస్

మరికొన్ని నెలల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికలకు ముందు ఏపీలో పలు పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.

ఆంధ్ర రాజకీయాల్లోకి షర్మిల ప్రవేశించడంతో, రాజకీయ సమీకరణాల మార్పు గురించి ఇప్పటికే పెద్ద చర్చ మొదలైంది.

పూర్తిగా నిస్తేజంగా మారిపోయిన కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడం అనేంత పెద్ద పని ఇప్పటికిప్పుడు సాధ్యం కాకపోవచ్చు. కానీ, పూర్తిగా అయిపోయిందన్న కాంగ్రెస్‌లో ఆమె కొంతైనా కదలిక తీసుకురాగలరు.

ఈ అంశాల గురించి బీబీసీ తెలుగు ఎడిటర్ జీఎస్ రామ్మోహన్ విశ్లేషణ ఈ వీడియోలో చూడండి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)