తుర్కియే: 'కనీసం మా పిల్లల అస్థికలైనా తెచ్చివ్వండి'

వీడియో క్యాప్షన్, తుర్కియే భూకంపంలో కనిపించని వారి కోసం బంధువుల గాలింపు
తుర్కియే: 'కనీసం మా పిల్లల అస్థికలైనా తెచ్చివ్వండి'

తుర్కియే, సిరియాలలో ఇటీవల సంభవించిన భారీ భూకంపంతో 50 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. లక్షల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు.

ఒక్క తుర్కీయేలోనే 15 లక్షల మంది ప్రజలు ఎటూ వెళ్లలేక భూకంప ప్రభావిత ప్రాంతాల్లో తలదాచుకుంటున్నారని యునైటెడ్ నేషన్స్ డెవలప్‌మెంట్ ప్రోగ్రాం (యూఎన్‌డీపీ) అంచనా వేస్తోంది.

తుర్కియే

ఫొటో సోర్స్, Getty Images

భూకంపం సంభవించి ఆరు వారాలు దాటినా ఇప్పటికీ ఎంతో మంది ఆచూకీ తెలియడం లేదు.

తమ కుటుంబీకులు ఏమైపోయారంటూ అధికారులను అక్కడి జనం ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ చనిపోతే వారి అస్థికలైనా ఇవ్వాలంటూ వేడుకుంటున్నారు. దీనిపై బీబీసీ అందిస్తున్న కథనం...

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)