జో బైడెన్ 10 గంటల పాటు రహస్యంగా రైలులో ప్రయాణం.. ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచారు?

వీడియో క్యాప్షన్, అమెరికా అధ్యక్షుడి 10 గంటల రహస్య రైలు ప్రయాణం ఎలా సాగింది?
జో బైడెన్ 10 గంటల పాటు రహస్యంగా రైలులో ప్రయాణం.. ఇంత సీక్రెట్‌గా ఎలా ఉంచారు?

ఇది ఒక సంచలన పర్యటన. అమెరికా అధ్యక్షుడు ఒకరు ఇలాంటి పర్యటన చేస్తారని దాదాపు ఎవరూ విని ఉండరు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సోమవారం అకస్మాత్తుగా యుక్రెయిన్ రాజధాని కీయెవ్‌లో ప్రత్యక్షమయ్యారు.

ఈ ఆకస్మిక పర్యటనను ‘‘ఆధునిక కాలంలో అపూర్వమైనది’’గా వైట్ హౌస్ అధికారులు వర్ణించారు.

కీయెవ్‌కు చేరుకోవడానికి బైడెన్ పది గంటల పాటు రైలులో రహస్యంగా ప్రయాణించారు.

ఈ సమయంలో యుక్రెయిన్‌లోని వేరే ప్రాంతాలకు విమానంలో అయితే ఆయన సులభంగా చేరి ఉండేవారు.

కానీ, కష్టమైనప్పటికీ కీయెవ్‌కు వెళ్లాలనే ఆయన నిర్ణయించుకున్నారు. ఈ పర్యటనను ప్రతిష్టాత్మకం చేయాలని అనుకున్నారు.

బైడెన్, ఈ పర్యటన ద్వారా యుక్రెయిన్‌కు సహాయం చేస్తుంటామనే సంకేతాన్ని రష్యాకు పంపించారు.

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్

ఫొటో సోర్స్, EPA

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)