చైనాలోని వుహాన్ ల్యాబ్ సిబ్బంది కరోనా వ్యాప్తికి ముందే జబ్బుపడ్డారు: అమెరికా రహస్య నివేదిక

ఫొటో సోర్స్, Getty Images
కరోనావైరస్ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించడానికి ముందే వుహాన్ ల్యాబ్లో పనిచేసే కొందరు పరిశోధకులు జబ్బు పడ్డారని అమెరికా నిఘా నివేదిక పేర్కొంది.
వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీలో పనిచేసే ముగ్గురు పరిశోధకులు 2019 నవంబర్లో అనారోగ్యానికి గురయ్యారని, తమకు ఆస్పత్రిలో చికిత్స అందించాలని వారు కోరారని అమెరికా పత్రిక వాల్స్ట్రీట్ జర్నల్ ఒక రిపోర్ట్ ప్రచురించింది.
వుహాన్ ల్యాబ్లో జబ్బు పడిన పరిశోధకుల సంఖ్య, వారు అనారోగ్యానికి గురైన సమయం, ఆస్పత్రిలో వారు పొందిన చికిత్సకు సంబంధించిన విషయాలను ఈ నిఘా రిపోర్టులో వివరించారు.
వుహాన్ ల్యాబ్ నుంచే కరోనావైరస్ వ్యాపించిందని వస్తున్న ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఈ నిఘా రిపోర్టులోని సమాచారం బలమైన ఆధారంగా నిలుస్తుందని భావిస్తున్నారు.
కరోనావైరస్ మూలాలకు సంబంధించి తదుపరి విచారణపై చర్చించడానికి డబ్ల్యుహెచ్ఓ సమావేశం కానుంది. దానికి ఒక్క రోజు ముందు ఈ రిపోర్ట్ వెల్లడైంది.

ఫొటో సోర్స్, Getty Images
దర్యాప్తుపై సీరియస్గా బైడెన్ ప్రభుత్వం
వాల్స్ట్రీట్ జర్నల్ ప్రచురించిన కథనంపై అమెరికా సెక్యూరిటీ కౌన్సిల్ ప్రతినిధి ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. కానీ కరోనావైరస్ మూలాల దర్యాప్తుపై బైడెన్ ప్రభుత్వం సీరియస్గా ఉందని ఆయన చెప్పారు.
ఇంతకు ముందు ప్రపంచ ఆరోగ్య సంస్థకు చెందిన ఒక టీమ్ మహమ్మారికి సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు వుహాన్ వెళ్లింది.
కరోనా వైరస్ వుహాన్ ల్యాబ్ నుంచే వ్యాపించిందనడానికి తగిన ఆధారాలు లేవని తర్వాత డబ్ల్యుహెచ్ఓ చెప్పింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్ కరోనా వైరస్ను 'చైనా వైరస్', 'వుహాన్ వైరస్' అనేవారు. చైనా దానిపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది.
ఈ దర్యాప్తులో ప్రపంచ ఆరోగ్య సంస్థ బృందానికి చైనా పూర్తిగా సహకరించలేదని, వుహాన్ ల్యాబ్కు సంబంధించిన సమాచారం దాచిపెట్టిందని ఆరోపణలు కూడా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- ఇజ్రాయెల్-గాజా హింస: ఇజ్రాయెల్ దాడిలో మీడియా కార్యాలయాలున్న భారీ భవనం కూలిపోయింది
- సింధు నాగరికత ప్రజలు గొడ్డు మాంసం తినేవారా? వారు వాడిన మట్టి కుండలు చెప్తున్న రహస్యాలేమిటి?
- భారత్కు వ్యాక్సీన్ తెచ్చిన తొలి శాస్త్రవేత్త... కలరా, ప్లేగ్ టీకాల సృష్టికర్త వాల్డెమర్ హఫ్కిన్
- లాక్ డౌన్ చరిత్ర ఏంటి... 400 ఏళ్ల కిందట రోమ్లో ఎందుకు విధించారు?
- జెరూసలేంపై అమెరికాకు జోర్డాన్ హెచ్చరిక
- ఆస్ట్రేలియా వార్నింగ్: భారత్ నుంచి వస్తే అయిదేళ్ల జైలు, భారీ జరిమానా
- ఈజిప్ట్లో బయటపడిన 3000 ఏళ్ల నాటి పురాతన ‘బంగారు నగరం’
- గంగానది ఒడ్డున ఇసుకలో బయటపడుతున్న మృతదేహాలు... యూపీ, బిహార్లలో ఏం జరుగుతోంది?
- భారత్లో కోవిడ్ వ్యాక్సీన్ కొరత, రిజిస్ట్రేషన్ ప్రక్రియలో గందరగోళం... ఈ పరిస్థితికి కారణమేంటి?
- జెరూసలెం వివాదం: ఇజ్రాయెల్ కాల్పుల్లో 58 మంది పాలస్తీనీయుల మృతి
- సినోఫార్మ్: చైనా వ్యాక్సీన్ ఎమర్జెన్సీ వినియోగానికి డబ్ల్యూహెచ్వో ఆమోదం
- కోవిడ్-19: వ్యాక్సీన్లలో పంది మాంసం ఉంటుందా.. వ్యాక్సీన్ వేసుకుంటే నపుంసకులు అయిపోతారా
- పదకొండేళ్ల పర్యావరణ ఉద్యమకారుడిని చంపేస్తామంటూ బెదిరింపులు
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









