You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కరోనావైరస్: ఇటలీలో పెరుగుతున్న భయాలు... దక్షిణ ప్రాంతాలపై కోవిడ్-19 విరుచుకుపడితే పరిస్థితి ఏంటి...
ఇటలీలో కరోనావైరస్ విజృంభించిన ఉత్తర ప్రాంతంలో కొత్త ఇన్ఫెక్షన్లు, మరణాల సంఖ్య ఒక్కసారిగా తగ్గింది. కానీ, ఇప్పుడు దేశ దక్షిణ ప్రాంతాల్లో వైరస్ చెలరేగొచ్చన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
ఉత్తర ప్రాంతమైన లాంబార్డీ ఆ దేశంలో కరోనావైరస్కు కేంద్రంగా ఉంది. ఇప్పుడు అక్కడ నమోదవుతున్న గణాంకాలు కాస్త ఊరటనిస్తున్నాయి.
కానీ, దక్షిణ ప్రాంతాల్లో మరణాల సంఖ్య పెరుగుతోంది. వైద్య వసతుల కొరత రావొచ్చని ఇక్కడి వాళ్లు భయపడుతున్నారు. ఈ ప్రాంతాల్లో పేదరికం ఎక్కువ.
ఇటలీలో 74వేలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, 7,500కు పైగా మంది మరణించారు.
బుధవారం దేశంలో కొత్త ఇన్ఫెక్షన్లు 7.5 శాతం పెరిగాయి. ఇక్కడ కరోనావైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి పెరుగుదల రేటు ఇంత తక్కువగా నమోదవ్వడం ఇదే తొలిసారి.
యూరప్లోని దేశాల్లోకెల్లా ఇటలీపై కరోనావైరస్ ప్రభావం తీవ్రంగా ఉంది. రెండు వారాలుగా ఈ దేశం లాక్డౌన్లో ఉంది. జనం ఇళ్లకే పరిమితం కావాలని ప్రభుత్వం సూచించింది.
ప్రస్తుత గణాంకాలు ‘ప్రోత్సాహకరంగా’ ఉన్నాయని, కానీ దుర్దశ ఇప్పుడే ముగిసిందనుకోవడం తొందరపాటు అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) యూరప్ రీజనల్ డైరెక్టర్ హన్స్ క్లూగ్ అన్నారు.
దక్షిణ ప్రాంతంలో ఏం జరుగుతోంది?
వ్యాధి వ్యాప్తి, మరణాలు తక్కువగానే ఉన్నాయి.
కానీ, నాప్లెస్ నగరం ఉన్న కాంపానియా, రోమ్ నగరం ఉన్న లాజియో ప్రాంతాల్లోని పరిస్థితులు భయపెడుతున్నాయి. ఉత్తర ప్రాంతంతో పోలిస్తే ఇక్కడ వైద్య వసతులు చాలా తక్కువ. ఇప్పటివరకూ కాంపానియాలో 74 మంది, లాజియోలో 95 మంది చనిపోయారు.
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటిలేటర్లను, ప్రాణాలు కాపాడేందుకు అవసరమైన ఇతర సామగ్రిని అందించలేదని ఫిర్యాదు చేస్తూ కాంపానియా ప్రాంత అధ్యక్షుడు విన్సెంజో డీ లుకా ప్రధాని గియుసెప్పే కోంటెకు బహిరంగ లేఖ రాశారు.
‘‘లాంబార్డీ విషాదం ఇప్పుడు దక్షిణాది విషాదంగా మారే అవకాశాలు చాలా ఉన్నాయి. ఇన్ఫెక్షన్లు భారీగా విజృంభించే దశలో మనం ఉన్నాం. దాన్ని మనం తట్టుకోలేకపోవచ్చు’’ అని ఆయన అన్నారు.
గురువారం కోంటె ఇటలీ సెనేట్లో ప్రసంగింంచారు. కరోనావైరస్ అత్యవసర పరిస్థితి తర్వాత యూరప్ పెద్ద ఆర్థిక సంక్షోభం ఎదుర్కోవాల్సి రావొచ్చని, దాన్ని ఎదుర్కొనేందుకు అసాధారణ, భారీ చర్యలు అవసరమని వ్యాఖ్యానించారు.
ఈ చర్యలతో ఇటలీ ఈ తరంలోనే అతిపెద్ద ఆర్థిక సంక్షోభంలోకి వెళ్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కోంటె సుమారు రూ.2లక్షల కోట్ల విలువైన రెండో ఉద్దీపన ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు.
- కరోనావైరస్ లైవ్ పేజీ: అంతర్జాతీయ, జాతీయ, స్థానిక సమాచారం
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్: వస్తువులు, ఇతర ఉపరితలాల మీద, గాలిలో ఈ వైరస్ ఎంత కాలం సజీవంగా ఉంటుంది?
- కరోనావైరస్: ఈ మహమ్మారి ఎప్పుడు ఆగుతుంది? జనజీవనం మళ్లీ మామూలుగా ఎప్పుడు మారుతుంది?
- కరోనావైరస్ మన శరీరం మీద ఎలా దాడి చేస్తుంది? ఇది సోకిన వారిలో కొందరు చనిపోవడానికి కారణం ఏమిటి
- కరోనావైరస్: చైనా వస్తువులు ముట్టుకుంటే ఈ వైరస్ సోకుతుందా
- కరోనావైరస్ సోకిన తొలి వ్యక్తి ఎవరు... జీరో పేషెంట్ అంటే ఏంటి?
- కరోనావైరస్: రైళ్లు, బస్సుల్లో ప్రయాణిస్తే ప్రమాదమా?
- మాస్క్లు వైరస్ల వ్యాప్తిని అడ్డుకోగలవా
- కరోనావైరస్: ఇంక్యుబేషన్ పీరియడ్ ఏమిటి? వైరస్ - ఫ్లూ మధ్య తేడా ఏమిటి?
- సెక్స్ ద్వారా కరోనావైరస్ సోకుతుందా? కీలకమైన 8 ప్రశ్నలు, సమాధానాలు
యూరప్లోని మిగతా దేశాల్లో...
యూరప్లో ఇటలీ తర్వాత కరోనావైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్న స్పెయిన్లో ఈ వారంలో తొలిసారి మరణాల సంఖ్య తగ్గినట్లు ఆ దేశ ఆరోగ్యశాఖ ప్రకటించింది. దేశంలో కరోనావైరస్ కారణంగా మరణించినవారి సంఖ్య 4,089కు చేరుకుందని, ఇందులో గడిచిన 24 గంటల్లో మరణించినవారు 655 మంది అని గురువారం తెలిపింది.
బుధవారం నాటికి ఆ దేశం కరోనావైరస్ మరణాల సంఖ్యలో చైనాను దాటేసింది. మరోవైపు రోజువారీ కొత్త ఇన్ఫెక్షన్ల సంఖ్య గురువారం అత్యధికంగా 8,500 మార్కును దాటింది. దేశవ్యాప్తంగా మొత్తం ఇన్ఫెక్షన్ల సంఖ్య 56 వేలను దాటింది.
వృద్ధులుండే నర్సింగ్ హోమ్లపై కరోనావైరస్ ప్రభావం ఎక్కువగా ఉంది. ఇలాంటి నర్సింగ్ హోమ్ల్లో 397కిపైగా మరణాలు నమోదయ్యాయని క్యాడెన్ సెర్ రేడియో నెట్వర్క్ తెలిపింది.
దేశంలో ప్రజల కదలికలపై విధించిన ఆంక్షలను ఏప్రిల్ 12 వరకు కొనసాగిస్తూ స్పెయిన్ పార్లమెంటు గురువారం ఉదయం నిర్ణయం తీసుకుంది.
వైరస్ను ఎదుర్కొనేందుకు తమ ముందున్న ఏకైక మార్గం సామాజిక దూరం పాటించడమేనని స్పెయిన్ ప్రధాని పెట్రో సాంచెజ్ అన్నారు.
మరోవైపు రష్యా శుక్రవారం నుంచి అంతర్జాతీయ విమానాల రాకపోకలను నిలిపివేస్తామని ప్రకటించింది. శనివారం నుంచి మాస్కోలో ఔషధ, నిత్యావసరాల దుకాణాలు మాత్రమే తెరిచి ఉంటాయని తెలిపింది.
ఫ్రాన్స్లో కరోనావైరస్ మరణాల సంఖ్య 1300 దాటింది. దేశంలో విధించిన 15 రోజుల లాక్డౌన్ను ఇంకా పొడిగించవచ్చని ప్రభుత్వ ప్రతినిధి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్ అనుమానిత రోగులు ఆసుపత్రుల నుంచి ఎందుకు పారిపోతున్నారు?
- కరోనావైరస్: కమల్ హాసన్ ఇంటికి ఐసొలేషన్ స్టిక్కర్.. తప్పుగా అతికించామని తొలగించిన అధికారులు
- కరోనా వైరస్ విజృంభిస్తున్నా... రష్యా అధ్యక్షుడు పుతిన్ ఎందుకంత నిశ్చింతగా ఉన్నారు?
- కరోనావైరస్: ఆర్బీఐ నిర్ణయాలతో మీ ఈఎమ్ఐపై పడే ప్రభావం ఏంటో తెలుసా?
- పెళ్లికి ముందు అమ్మాయిని మళ్లీ కన్యగా మార్చే సర్జరీలు ఎందుకు?
- వాస్ప్-76బి: ఇనుము వర్షంలా కురిసే ఈ గ్రహం ఓ నిప్పుకణిక.. పగటి ఉష్ణోగ్రత 2,400 సెంటీగ్రేడ్లు
- ఆంధ్రప్రదేశ్: మాన్సాస్ ట్రస్ట్ వివాదం ఏంటి? సంచయిత నియామకంపై అశోక్ గజపతిరాజు న్యాయపోరాటానికి నేపథ్యం ఏంటి?
- నిర్భయ ఘటన: విషాదం, ఆగ్రహం కమ్మేసిన భారత్ను ఒక్కతాటి పైకి తెచ్చిన కేసు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)