జైష్-ఎ-మొహమ్మద్ ఎలా ఏర్పాటైంది?

ఫొటో సోర్స్, Getty Images
మౌలానా మసూద్ అజర్ 1968లో తూర్పు పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్లో పుట్టారు.
కరాచీలోని బినోరీ పట్టణంలోని మతపరమైన జామియా ఉలూమ్-ఇ-ఇస్లామీ యూనివర్సిటీలో చదివారు. తర్వాత అక్కడే టీచర్ అయ్యారు.
కరాచీలో ఉన్నప్పుడు అప్ఘానిస్తాన్లో జీహాద్ ట్రైనింగ్ కోర్స్ తీసుకోమని తనకు సూచించారని ఆయన పుస్తకం 'ది విర్చూస్ ఆఫ్ జీహాద్' అనే పుస్తకంలో చెప్పినట్లు కొన్ని పత్రికల్లో కథనాలు వచ్చాయి.
1994లో అప్పట్లో లీడింగ్ మిలిటెంట్ గ్రూప్ అయిన హర్కతుల్ ముజాహిదీన్ కోసం శ్రీనగర్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో భారత అధికారులు మసూద్ అజర్ను అరెస్ట్ చేశారు.
కానీ 1999లో ఐసీ-184 విమానాన్ని హైజాక్ చేశాక దానిని అప్ఘానిస్తాన్లోని కాందహార్ తీసుకెళ్లిన సమయంలో బంధీలను విడిపించడానికి బదులు మసూద్, మరో ఇద్దరిని జైలు నుంచి విడుదల చేసినపుడు అతడి పేరు పతాక శీర్షికల్లో వచ్చింది.
1999లో తిరిగి పాకిస్తాన్ చేరుకోగానే మసూద్ అజర్ జైష్-ఎ-మొహమ్మద్ సంస్థను స్థాపించారు.
ఐక్యరాజ్యసమితి 2002లో 'జైష్-ఎ-మొహమ్మద్'ను టెర్రరిస్ట్ సంస్థల జాబితాలో చేర్చడంతో పాకిస్తాన్ దానిని నిషేదించింది.
కానీ జైష్-ఎ-మొహమ్మద్పై నిషేదం విధించినా మసూద్ అజర్ను మాత్రం అరెస్ట్ చేయలేదు. అతడిని జేఈఎంకు బలమైన పట్టు ఉన్న దక్షిణ పంజాబ్లోని స్వేచ్ఛగా జీవించేలా వదిలేశారని పాకిస్తాన్ వార్తాపత్రిక డాన్ 2014 ఫిబ్రవరి 2న కథనం ప్రచురించింది.
మోస్ట్ వాంటెడ్ టాప్ 20 లిస్టులో ఉన్న మసూద్ అజర్ను తమకు అప్పగించాలని పాకిస్తాన్ను భారత్ కోరింది.
2008లో ముంబయి దాడులకు లష్కరే తోయిబా కారణమని ఆరోపించిన భారత్ మసూద్ అజర్తోపాటు తమ జాబితాలో ఉన్న అందరినీ అప్పగించాలని పాకిస్తాన్ను కోరింది. కానీ పాక్ వారిని ఇప్పటికీ అప్పగించలేదు.
2016లో పఠాన్కోట్ ఎయిర్ బేస్పై దాడి తర్వాత పాక్ అధికారులు మసూద్ అజర్ను 'ప్రొటెక్టివ్ కస్టడీ'లోకి తీసుకున్నారు. కానీ అతడిపై ఈ దాడి అభియోగాలు మోపలేదు.
మసూద్ అజర్ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించాలని 2016లో భారత్ ఐక్యరాజ్యసమితికి ప్రతిపాదనలు పంపింది.
అయితే, పాకిస్తాన్ మిత్రదేశం చైనా భారత ప్రయత్నాలను 'సాంకేతిక కారణాల' సాకుతో అడ్డుకుంది. 2016లో భారత్ ప్రతిపాదనను వీటో అధికారం ఉపయోగించి బ్లాక్ చేసింది,
2017లో అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ మసూద్ అజర్కు వ్యతిరేకంగా పెట్టిన అదే ప్రతిపాదనను కూడా చైనా మరోసారి అడ్డుకుంది.
మసూద్ అజర్ ప్రాణాపాయ పరిస్థితిలో మంచానికే పరిమితమైనట్టు భారత నిఘా వర్గాల ద్వారా తెలిసిందని 2018లో హిందుస్తాన్ టైమ్స్ ఒక కథనం ప్రచురించింది.

ఫొటో సోర్స్, Getty Images
ఐక్యరాజ్యసమితి దృష్టిలో మసూద్ అజర్
పాకిస్తాన్కు చెందిన మిలిటెంట్ గ్రూప్ జైష్-ఎ-మొహమ్మద్(జేఈఎం)కు మసూద్ అజర్ చీఫ్.
ఒసామా బిన్ లాడెన్, తాలిబన్, ఇతర తీవ్రవాద సంస్థల సాయంతో మసూద్ అజర్ జైష్-ఎ-మొహమ్మద్ సంస్థను స్థాపించాడు.
1999లో ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి కాందహార్ తీసుకెళ్లినపుడు వారి చేతిలో బంధీలుగా ఉన్న 155 మంది ప్రయాణికులను విడిపించేందుకు భారత్ అతడిని జైలు నుంచి విడుదల చేసింది.
అంతకు ముందు అతడిని విడిపించడానికి రెండుసార్లు ప్రయత్నాలు జరిగాయి. 1994లో న్యూదిల్లీలో హర్కతుల్ ముజాహిదీన్ అమెరికా, బ్రిటిష్ దేశస్థులను కిడ్నాప్ చేసింది.
జులై 1995లో కశ్మీర్లో ఇద్దరు పర్యాటకులను కిడ్నాప్ చేసి అజర్ను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
2001 అక్టోబర్ 1న జేఈఎం శ్రీనగర్లో ఉన్న జమ్ము-కశ్మీర్ అసెంబ్లీపై జరిగిన ఆత్మాహుతి దాడికి తామే బాధ్యులమని ప్రకటించింది. ఆ దాడిలో 31 మంది మృతి చెందారు.
కానీ కొంతకాలం తర్వాత అది తమ పని కాదని చెప్పింది.
జేఈఎం, లష్కరే తోయిబా మిలిటెంట్లు 2001 డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై దాడి చేశారు. ఈ దాడిలో 9 మంది మృతి చెందగా, 18 గాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- మన్యంలో సంక్రాంతి... పప్పుల పండుగ
- ఇండోనేషియాలో ఇస్లామిక్ స్టేట్ ఎలా బలపడుతోంది?
- ఐఎస్ తీవ్రవాదులు ఇప్పుడేం చేస్తున్నారు?
- పాఠశాలలు, ఆటస్థలాల్లో ముస్లిం పిల్లలకు వేధింపులు
- పాకిస్తాన్ 'దుర్మార్గమైన అజెండా': చర్చల రద్దుకు దారి తీసిన ఈ స్టాంపులపై ఏముంది?
- ప్రేమంటే ఏమిటి? మీరిప్పుడు ప్రేమలో ఉన్నారా?
- ఇది కొత్త ప్రేమ ఫార్ములా
- ప్రేమికులు ప్రేమలో పడటానికి, వారిలో రొమాన్స్కు కారణం ఇదే
- సరిగ్గా ఎనిమిదేళ్ల కిందట.. వేలంటైన్స్డే ముందు రోజు..
- తెలుగు సంస్కృతి దారిలో బ్రిటన్: నెలసరి మొదలైందా... చలో పార్టీ చేసుకుందాం
- చంద్రబాబు నాయుడు: ‘12 గంటల దీక్షకు 11 కోట్లు ఖర్చు’ నిజానిజాలేంటి?
- 26/11 ముంబయి దాడులు: ‘ఆ రోజు ఓ సైన్యమే యుద్ధానికి దిగినట్టు అనిపించింది’
- ‘అంతర్జాతీయ ఉగ్రవాది’గా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఎలా ప్రకటిస్తుంది?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








