‘పోలీసులు బలవంతంగా నాతో మూత్రం తాగించారు’

వీడియో క్యాప్షన్, ‘పోలీసులు బలవంతంగా నాతో మూత్రం తాగించారు’

తెలంగాణలోని సూర్యాపేట జిల్లా ఆత్మకూరు(ఎస్) మండలంలోని రామోజీ తండా ఒక సాధారణ లంబాడ గిరిజన పల్లె.

ఈ తండాకు చెదిన గుగులోత్ వీరశేఖర్(23) అనే గిరిజన యువకుడిని దొంగతనం ఆరోపణల పై ఆత్మకూరు(ఎస్) పోలీసులు చితకబాదారు.

ఆ తర్వాత గిరిజన సంఘాలు, వివిధ రాజకీయ పక్షాలు, హక్కుల సంఘాల ఆందోళనలకు దిగాయి.

పోలీసుల తీరు పై తీవ్ర విమర్శలు వచ్చాయి.

నవంబర్ 4న తన దుకాణంలో చోరీ జరిగిందని.. 40 క్వార్టర్ సీసాల మద్యం, 10 వేల నగదు ఎత్తుకెళ్లారని ఏపూర్ గ్రామానికి చెందిన షేక్ సైదులు ఆత్మకూర్(ఎస్) పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.

విచారణలో భాగంగా సీసీ ఫుటేజ్ ఆధారంగా రామోజీ తండాకు చెందిన 'బానోత్ నవీన్'ను అదుపులోకి తీసుకుని విచారించారు పోలీసులు.

ఆయన ఇచ్చిన సమాచారం ఆధారంగా బుధవారం (నవంబర్ 10)న బానోత్ బుచ్యా, బానోత్ లాల్ సింగ్, గుగులోత్ వీరశేఖర్‌లను గ్రామం నుండి తీసుకెళ్లారు. అదే రోజు రాత్రి వీరశేఖర్‌ను వదిలేశారు.

మళ్లీ ఉదయాన్న మరోసారి విచారించాలని, స్టేషన్ కు రావాలని అడిగారు.

అయితే అప్పటికే తీవ్రంగా అస్వస్థతకు గురైన వీరశేఖర్‌ను ఏమైందంటూ కుటుంబ సభ్యులు ఆరా తీయగా... విచారణ పేరిట పోలీసులు తనను చిత్రహింసలకు గురిచేసినట్టు వెల్లడించాడు.

ఆగ్రహంతో గ్రామస్తులు, కుటుంబసభ్యులు కదల్లేని స్థితిలో ఉన్న వీరశేఖర్‌ను ట్రాక్టర్ లో తీసుకుని వెళ్లి ఆత్మకూరు(ఎస్) పోలీస్ స్టేషన్ ముట్టిడించి, అక్కడి పోలీస్ సిబ్బందిని నిలదీశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)