‘అక్కడ స్పీడ్ లిమిట్ 40kmph.. సాయి ధరమ్ తేజ్ బండి వేగంగా వెళ్తోంది.. అందుకే కేసు పెట్టాం’ - మాదాపూర్ డీసీపీ
హైదరాబాద్లోని కేబుల్ వంతెనపై స్పీడ్ లిమిట్ ఎంత? సాయి ధరమ్ తేజ్ ఎంత వేగంగా వెళ్లారు?
ఈ ప్రశ్నలకు మాదాపూర్ జోన్ డీసీపీ ఎం.వెంకటేశ్వర్లు సమాధానం ఇస్తూ.. హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జిపైన, ఐకియా ఫ్లై ఓవర్ పైన స్పీడ్ లిమిట్ గంటకు 40 కిలోమీటర్లు మాత్రమేనని చెప్పారు.
సాయి ధరమ్ తేజ్ ఐకియా ఫ్లై ఓవర్పైన ప్రయాణిస్తున్నప్పుడు రెండు కార్లను ఓవర్ టేక్ చేసినట్లు కనిపించింది.
అయితే, ప్రమాదం జరిగినప్పుడు.. ఒక ఆటోను ఓవర్ టేక్ చేయడానికి మూడు లైన్ల రోడ్డులో ఎడమవైపు చివరగా ఉన్న లైనులోకి సాయి ధరమ్ తేజ్ వచ్చాడు.
కానీ, పక్కనే కన్స్ట్రక్షన్ జరుగుతుండటం వల్ల రోడ్డుపైన కొంత ఇసుక చేరింది. స్పోర్ట్స్ బైక్ అదుపుతప్పి సాయి ధరమ్ తేజ్ కింద పడిపోయాడు.
స్పీడ్ లిమిట్ పట్టించుకోకుండా, దానికంటే వేగంగా నడిపినందుకు గాను సాయి ధరమ్ తేజ్పైన కేసు పెట్టామని, ఆయన కోలుకున్న తర్వాత విచారణ జరుపుతామని పోలీసులు చెప్పారు.
బీబీసీతో మాట్లాడుతూ మాదాపూర్ డీసీపీ ఇంకా ఏమన్నారో పై వీడియోలో చూడొచ్చు.
ఇవి కూడా చదవండి:
- INDvsENG: 21 మంది ఆటగాళ్లతో ఇంగ్లండ్ వెళ్లిన భారత్ 11 మందిని మైదానంలోకి దించలేకపోవడానికి కారణం ఏంటి?
- గుజరాత్ సీఎం విజయ్ రూపానీ రాజీనామాకు కారణమేంటి? మోదీ, షా ప్లాన్ ఏంటి?
- సెప్టెంబర్ 11 దాడులు: అమెరికాలో ఆ రోజు ఏం జరిగింది?
- ఫిరోజ్ గాంధీ అంత్యక్రియలు ఎలా జరిగాయి, "ఐ డిడింట్ లైక్ ఫిరోజ్" అని ఇందిర ఎందుకన్నారు?
- అఫ్గానిస్తాన్: పంజ్షీర్ లోయపై పాకిస్తాన్ డ్రోన్లు దాడి చేశాయా?
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- రిటైర్మెంట్ కోసం రూ.కోటి సరిపోతాయా.. భవిష్యత్తులో నిజంగా ఎంత డబ్బు అవసరం?
- హైదరాబాద్ మెట్రోను అమ్మేస్తారా, నష్టాలకు కారణాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)




