మసీదు ప్రారంభోత్సవంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు

వీడియో క్యాప్షన్, మసీదు ప్రారంభం వేడుకకు హిందువులు తాంబూలం, పువ్వులు, పండ్లు తీసుకురాగా, క్రైస్తవులు కొవ్వొత్తులు, పండ్లు కానుకలుగా తీసుకొచ్చారు.
మసీదు ప్రారంభోత్సవంలో ముస్లింలు, హిందువులు, క్రైస్తవులు

తమిళనాడులోని శివగంగై జిల్లా ఇలయాంకుడి సమీపంలోని సాలై గ్రామంలో జనవరి 21న జరిగిన మసీదు ప్రారంభోత్సవంలో అరుదైన దృశ్యం కనిపించింది.

ఇందులో ముస్లింలతోపాటు హిందువులు, క్రైస్తవులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

స్థానికుల మత సామరస్యానికి సాక్ష్యంగా నిలిచిన ఈ వేడుకకు అందరినీ ఆహ్వానిస్తూ మూడు మత చిహ్నాలతో గ్రామంలో వివిధ చోట్ల బ్యానర్లు కూడా ఏర్పాటు చేశారు.

ఈ వేడుకకు హిందువులు తాంబూలం, పువ్వులు, పండ్లు లాంటివి తీసుకు రాగా, క్రైస్తవులు కొవ్వొత్తులు, పండ్లు కానుకలుగా తీసుకొచ్చారు. ముస్లింలు వారికి ఎదురెళ్లి ఆహ్వానించి మసీదులోకి తీసుకెళ్లారు.

తమిళనాడు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)