కుంభమేళాలో సాధువులు, తెలుగు అమ్మాయిలు, రుద్రాక్షలు.. బీబీసీ కెమెరా కంటితో మీరూ చూసేయండి

- రచయిత, నవీన్ కందేరి
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు వస్తున్నారు.
వసంతి పంచమి నాడు త్రివేణి సంగమం వద్ద ఆచరించిన స్నాన వేడుకలు సహా ఇప్పటివరకు మూడు తేదీలలో భక్తులు ‘పుణ్య స్నానాలు’ చేశారు.
ఈ నెల 12న మాఘ పౌర్ణమి సందర్భంగా మరోమారు ‘పుణ్య స్నానాలు’ చేయనున్నారు.
అనంతరం ఫిబ్రవరి 26న మహా శివరాత్రి రోజున జరిగే స్నానాలతో మహా కుంభమేళా ముగుస్తుంది.
ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం... వసంతి పంచమి రోజు మొత్తం 2.33 కోట్ల మంది భక్తులు త్రివేణి సంగమంలో స్నానాలు ఆచరించారు.
వసంతి పంచమి నాడు సాధువులు భారీ ర్యాలీతో త్రివేణి సంగమానికి చేరుకుని, పవిత్ర స్నానాలు చేశారు. సంగమ ప్రదేశ వీధులన్నీ కూడా భక్తులతో కిటకిటలాడాయి.
మహా కుంభమేళా వద్ద సందడిని బీబీసీ తన కెమెరాల్లో బంధించింది. సంగమ ప్రదేశంలో సందడి ఎలా ఉందో ఈ చిత్రాల్లో చూసేయండి..












(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














