లండన్ కంటే రెండు రెట్లు పెద్దదైన ఈ ఐస్బర్గ్ మళ్లీ కదులుతోంది...
ప్రపంచంలోనే అతిపెద్ద ఐస్బర్గ్ కదులుతోంది. దీని సైజు గ్రేటర్ లండన్ కంటే రెండు రెట్లు పెద్దది.
ప్రతి రోజూ ఈ ఐస్బర్గ్ కరిగిపోతున్నా ఇప్పటికీ 3,800 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది.
ఇది బహ్రెయిన్, సింగపూర్ లాంటి 29 దేశాల కంటే పెద్దది.
అంటార్కిటికా సరిహద్దు ప్రాంతాలలో కొన్ని వారాల మందగమనం తరువాత, ఇప్పుడీ మంచు కొండ వేగం పెరిగింది.
ఈ ఐస్బర్గ్ను 'ఏ23ఏ'గా వ్యవహరిస్తున్నారు.

ఫొటో సోర్స్, CHRIS WALTON/BAS
1986లో అంటార్కిటికా తీరప్రాంతం నుంచి ఇది విడిపోయింది.
తరువాత వేగంగా కదిలి వెడ్డెల్ సముద్రంలో 350 మీటర్ల లోతుకు చేరుకుని 30 ఏళ్ళపాటు ఒక మంచుద్వీపంలా ఉండిపోయింది.
కాలం గడిచే కొద్దీ క్రమంగా ఈ మంచు కొండ కరగడం మొదలైంది. 2020 నాటికి నీటిపై తేలడం మొదలైంది.
మొదట్లో ఇది మెల్లగా కదిలినా, తరువాత వేడిగాలులు, నీటి అలల కారణంగా ఉత్తర దిశగా సాగుతోంది.
పూర్తి కథనం కోసం పై వీడియో చూడండి.
ఇవి కూడా చదవండి:
- ది రియల్ కేరళ స్టోరీ: రియాద్లో మరణశిక్ష పడిన రహీమ్ ప్రాణాలు కాపాడేందుకు హిందూ, ముస్లింలు ఏకమై రూ. 34 కోట్ల 'బ్లడ్ మనీ'ని ఎలా సేకరించారంటే
- అరబ్- ఇజ్రాయెల్ యుద్ధం 1967: అరబ్ నేలను నాశనం చేసిన ఆ ఆరు రోజుల్లో ఏం జరిగింది?
- బంగారం: ఈ విలువైన లోహం భూమి మీదకు ఎలా వచ్చింది, శాస్త్రవేత్తలు ఏం చెబుతున్నారు?
- పాకిస్తాన్ క్రికెట్లో కొత్త డ్రామా, అమీర్ రీఎంట్రీకి కారణాలేంటి?
- కచ్చతీవుకు బదులుగా భారత్ తీసుకున్న 'వాడ్జ్ బ్యాంక్' ప్రాంతం అంత విలువైనదా?
బీబీసీ తెలుగును ఫేస్బుక్ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









