జగన్‌పై కోడికత్తితో దాడి కేసు ఎన్‌ఐఏకు

జగన్

ఫొటో సోర్స్, Facebook/YS Jagan Mohan Reddy

విశాఖపట్నం విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లో 2018 అక్టోబరు 25న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డిపై జరిగిన దాడి కేసును జాతీయ దర్యాప్తు సంస్థ(‌ఎన్‌ఐ‌ఏ)కు అప్పగించారు.

ఈ మేరకు కేంద్ర హోంశాఖ డిసెంబరు 31న ఉత్తర్వులిచ్చిందని కేంద్ర ప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) కె.లక్ష్మణ్‌ ఏపీ హైకోర్టుకు తెలిపారు.

దీంతో హైదరాబాద్‌లోని ఎన్‌ఐఏ స్టేషన్‌లో జనవరి 1న ఎఫ్‌ఐఆర్‌ నమోదైందని లక్షణ్ వివరించారు.

జగన్

ఫొటో సోర్స్, Chandrakanth

నిందితుడు జనిపల్లి శ్రీనివాసరావు కోడికత్తితో దాడి చేయడంతో జగన్‌ ఎడమ చేతికి గాయమైంది.

శ్రీనివాస్‌ను విమానాశ్రయంలోని ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్న వెయిటర్‌గా పోలీసులు గుర్తించారు.

నిందితుడు తూర్పుగోదావరి జిల్లా ముమ్మడివరం మండలం ధనియాలపాలెం వాసి అని చెప్పారు.

దాడి తర్వాత జగన్ హైదరాబాద్‌లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందారు.

వీడియో క్యాప్షన్, వీడియో: జగన్‌పై దాడి కేసులో నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)