టోక్యో ఒలింపిక్స్: పోరాడి ఓడిన భారత మహిళల హాకీ జట్టు.. కాంస్యం కైవసం చేసుకున్న బ్రిటన్

भारत ब्रिटेन

ఫొటో సోర్స్, Reuters

భారత మహిళా హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కోసం గ్రేట్ బ్రిటన్‌తో తలపడింది.

ఈ మ్యాచ్‌లో 4-3 తేడాతో భారత్‌పై బ్రిటన్ విజయం సాధించింది.

మ్యాచ్ చివరి సమయంలో భారత ప్లేయర్లు ఉదిత, షర్మిలలు ఆటకు దూరంగా ఉండాల్సి వచ్చింది. ఉదితకు యెల్లో కార్డు, షర్మిలకు గ్రీన్ కార్డులను చూపించారు.

భారత్-బ్రిటన్

ఫొటో సోర్స్, Alexander Hassenstein/Getty Image

తొలి గోల్ బ్రిటన్‌దే

మ్యాచ్‌లో తొలిగోల్ చేసిన బ్రిటన్ 1-0 ఆధిక్యం సంపాదించింది. ఆ గోల్‌ను అడ్డుకోబోయిన భారత్ స్వయంగా బంతిని గోల్‌లోకి పంపింది.

తర్వాత బ్రిటన్ అదే క్వార్టర్‌లో రెండో గోల్ వేసింది. కానీ, కాసేపటికే భారత్ కూడా గోల్ వేసింది. పెనాల్టీ కార్నర్‌ను భారత్ గోల్‌గా మలచగలిగింది.

హరియాణాలోని డిఫెండర్ నిషా వార్సీ ఇంటిలో మ్యాచ్ చూస్తున్న ఆమె కుటుంబ సభ్యులు
ఫొటో క్యాప్షన్, హరియాణాలోని డిఫెండర్ నిషా వార్సీ ఇంటిలో మ్యాచ్ చూస్తున్న ఆమె కుటుంబ సభ్యులు

తర్వాత కాసేపటికే భారత్‌కు మరో పెనాల్టీ అవకాశం వచ్చింది. దానిని కూడా గోల్‌ పోస్టులోకి పంపగలిగారు.

సెకండ్ క్వార్టర్ చివర్లో మరో గోల్ వేసిన భారత్ బ్రిటన్‌పై 3-2 ఆధిక్యం సాధించింది.

అమృత్‌సర్‌లో మ్యాచ్ చూస్తున్న గుర్‌జీత్ కౌర్ కుటుంబ సభ్యులు

ఫొటో సోర్స్, Ravinder Singh Robin

ఫొటో క్యాప్షన్, అమృత్‌సర్‌లో మ్యాచ్ చూస్తున్న గుర్‌జీత్ కౌర్ కుటుంబ సభ్యులు

మూడో క్వార్టర్ మొదలవుతూనే బ్రిటన్ మరో గోల్ కొట్టింది. దీంతో రెండు జట్ల స్కోర్ సమం అయ్యింది.

అయితే, నాలుగో క్వార్టర్‌ చివర్లో బ్రిటన్ కీలకమైన నాలుగో గోల్ కొట్టింది. దీంతో భారత్‌పై 4-3 తేడాతో ఆధిక్యంలోకి వెళ్లింది. ఫలితంగా భారత జట్టు ఓటమిని చవిచూసింది.

చివరి 15 నిమిషాల్లో భారత్‌కు చెందిన ఉదితకు యెల్లో కార్డ్ చూపించారు. ఆ సమయంలో భారత్-బ్రిటన్ 3-3తో సమంగా ఉన్నాయి.ఆ తర్వాత కీలకమైన సమయంలో భారత హాకీ క్రీడాకారిణి షర్మిలకు గ్రీన్ కార్డ్ చూపించారు. దాంతో ఆమె రెండు నిమిషాలపాటు బయటే ఉండిపోయారు.

భారత్-బ్రిటన్

ఫొటో సోర్స్, ANNE-CHRISTINE POUJOULAT/AFP via Getty Images

గెలిస్తే చారిత్రక విజయం

ఈరోజు మ్యాచ్ గెలిస్తే ఇది భారత మహిళా హాకీ జట్టుకు చరిత్రాత్మక విజయం అయ్యుండేది.

భారత మహిళా హాకీ జట్టు ఒలింపిక్స్‌లో ఆడడం 1980 నుంచీ ప్రారంభమైంది.

షాబాద్ హాకీ స్టేడియంలో మ్యాచ్ చూస్తున్న యువ క్రీడాకారులు

ఫొటో సోర్స్, Gulshan Kumar

ఫొటో క్యాప్షన్, షాబాద్ హాకీ స్టేడియంలో మొబైల్‌లో మ్యాచ్ చూస్తున్న యువ క్రీడాకారులు

భారత మహిళా హాకీ జట్టు ప్రస్తుతం మూడోసారి ఒలింపిక్స్‌లో ఆడుతోంది.

భారత హాకీ జట్టు

ఫొటో సోర్స్, Getty Images

అయితే, 2016లో టీమ్ అంత మెరుగైన ప్రదర్శన ఇవ్వలేకపోయింది.

గురువారం భారత పురుషుల హాకీ జట్టు జర్మనీని 5-4తో ఓడించి కాంస్య పతకం గెలుచుకుంది. 1980 తర్వాత ఒలింపిక్స్ హాకీలో భారత్‌‌కు ఇది మొదటి పతకం.

Please wait...

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)