వాడి పడేసిన 3 లక్షల కండోమ్లు రీసైకిల్ చేసి విక్రయించే ప్రయత్నం... స్వాధీనం చేసుకున్న పోలీసులు

ఫొటో సోర్స్, Reuters
అక్రమంగా విక్రయించేందుకు సిద్ధంచేసిన 3,20,000కుపైగా వాడిన కండోమ్లను వియత్నాం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
బిన్ డువాంగ్ ప్రావిన్స్లోని ఓ గోదాంలో 360 కేజీలకు పైగా బరువున్న డజన్లకొద్దీ బ్యాగుల్లో లక్షల కండోమ్లను పోలీసులు సీజ్ చేస్తున్న దృశ్యాలు మీడియాలో కనిపించాయి.
ఈ గోదాం యజమాని అయిన ఓ మహిళను పోలీసులు అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, Getty Images
చెక్క డిల్డోల సాయంతో ఈ కండోమ్లను శుభ్రపరిచి, కొత్తగా కనిపించేలా మార్పులుచేసి.. విక్రయించేందుకు మళ్లీ ప్యాక్ చేస్తున్నారు.
కేజీ కండోమ్లకు తనకు 0.17 డాలర్లు ఇస్తారని అరెస్టయిన మహిళ చెప్పినట్లు వియత్నాం ప్రభుత్వ మీడియా వీటీవీ పేర్కొంది.
ఇలాంటి ఎన్ని కండోమ్లను మార్కెట్లో విక్రయించారో తెలియడం లేదు.
ఇవి కూడా చదవండి:
- బంగారం వ్యాపారానికి ప్రొద్దుటూరు ఎలా కేంద్రంగా మారింది? ఈ ఊరిని రెండో ముంబై అని ఎందుకు అంటారు?
- మీ పాత టీవీ, రేడియో అమ్మితే రూ. 10 లక్షలు.. ఏమిటీ బేరం
- భారత్-పాక్ 1965 యుద్ధం: జనరల్ అయూబ్ ఖాన్ రహస్య బీజింగ్ పర్యటన, యుద్ధం చేయాలని చైనా సలహా
- కరోనావైరస్ వంటి ప్రాణాంతక మహమ్మారులు సహజంగానే అంతరించిపోతాయా? అదెలా సాధ్యం?
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. రైతులకు లాభమా, నష్టమా?
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- అరుణ్ శౌరి: వాజపేయి కేబినెట్లో మంత్రి.. మోదీ ప్రభుత్వం వచ్చాక సీబీఐ కేసులో నిందితుడు ఎలా అయ్యారు?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)




