ప్రధాని నరేంద్ర మోదీని ఓ కార్టూన్తో పోల్చిన అర్జెంటీనా న్యూస్ చానెల్: ‘ఇది జాత్యహంకారమే’

ఫొటో సోర్స్, TCFFC
భారత ప్రధాని మోదీని ఓ కార్టూన్తో పోలుస్తూ అర్జెంటీనా న్యూస్ చానెల్ 'క్రానికా టీవీ' చేసిన ప్రసారాలు వివాదాస్పదమయ్యాయి.
అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ నగరంలో జీ20 సమావేశాలు జరుగుతున్నాయి. అందులో పాల్గొనడానికి భారత ప్రధాని మోదీ అర్జెంటీనా వెళ్లారు.
ఈ సందర్భంగా మోదీ విమానం 'బ్యూనస్ ఎయిర్స్' నగరంలో ల్యాండ్ అవ్వగానే, క్రానికా టీవీలో.. 'అపు వచ్చేశాడు' అన్న హెడ్లైన్తో ఓ కార్టూన్ ప్రత్యక్షమైంది.
మోదీని ఆవిధంగా చూపెట్టడం జాత్యాహంకార చర్య అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ ఘటనపై సోషల్ మీడియాలో యూజర్లు విరుచుకుపడుతున్నారు.
'అపు నాహాసపీమపెటలన్' పేరుతో క్రానికా టీవీలో ఓ కార్టూన్ సిరీస్ 1990 నుంచి ప్రసారమవుతోంది. ఈ కార్టూన్కు హ్యాంక్ ఆజారియా అనే శ్వేతజాతి నటుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. అపు కార్టూన్ భారతీయ యాసలో మాట్లాడుతుంది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
‘అపు’ వివాదం ఇప్పటిది కాదు
ఇండియన్-అమెరికన్ స్టాండప్ కమెడియన్ హరి కొండబోలు 2017లోనే అపు కార్టూన్పై ఓ డాక్యుమెంటరీ చిత్రించారు. అపు కార్టూన్ జాత్యాహంకారానికి ప్రతీక అని ఆ డాక్యుమెంటరీలో అభిప్రాయపడ్డారు.
ఈ డాక్యుమెంటరీ గురించి హరి కొండబోలు బీబీసీతో మాట్లాడుతూ..
''ఈ సిరీస్లో అపు పాత్రను లోకువగా చూపిస్తున్నారు. పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్న అపు పాత్రకు ఎంతమంది పిల్లలని చూపెడుతున్నారు? ఈ సిరీస్లో అన్ని పాత్రలు మూస ధోరణిలో ఉన్నాయి'' అన్నారు.
క్రానికా టీవీ తాజా ప్రసారాలపై హరి కొండబోలు స్పందిస్తూ.. ‘ఇది నిజం కాదు కదా..’ ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
ఈ ఘటనపై చాలా మంది స్పందించారు. ‘దీన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించలేం. ఆయన మా ప్రధాని. అంతర్జాతీయ వేదికపై ఇతర దేశాల నేతల్లాగే మోదీని కూడా గౌరవించాలి’ అని జయన్ టి.భూషణ్ అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
జీ20 సదస్సులో పాల్గొనడానికి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మ్యాక్రాన్ కూడా బ్యూనస్ ఎయిర్స్ విమానాశ్రయం చేరుకున్నారు. కానీ ఆయనకు స్వాగతం పలకడానికి అర్జెంటీనా ప్రతినిధులు ఎవ్వరూ సమయానికి రాలేదు.
ఈ సంఘటనపై కూడా సోషల్ మీడియాలో పెద్దఎత్తున విమర్శలు, ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి.
ఇవి కూడా చదవండి
- BBC Special: తాజ్మహల్: ‘జాగ్రత్తపడకపోతే... జ్ఞాపకమే మిగిలుతుంది’
- మీ పిల్లల స్కూలు బ్యాగ్ బరువు ఎంతుండాలో తెలుసా
- రాహుల్ గాంధీకి 'కౌల్' గోత్రం ఎలా వచ్చింది
- డిజైనర్ బేబీస్: జన్యు సవరణ శిశువుల సృష్టి ఆమోదయోగ్యమేనా
- క్రీ.శ.536: చరిత్రలో అత్యంత ఘోరమైన సంవత్సరం అదే
- పాక్ జైల్లో 22 మంది ఉత్తరాంధ్ర మత్స్యకారులు : వీరు విడుదలయ్యేది ఎప్పుడు?
- ‘న్యాయం జరగకపోతే ఈ ప్రభుత్వంతో మాకు ఎలాంటి ఉపయోగం లేదు’
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








