తిరుపతికి సమీపంలో పురుషాంగం ఆకారంలో శివుడి విగ్రహం, ఆలయం ప్రత్యేకతలు ఇవే
పురుషుడి అంగాన్ని పోలి, ఏడు అడుగుడుల ఎత్తున ఉండే శిల్పంపై హిందువుల ఆరాధ్య దైవం శివుడు.. మానవ రూపంలో ఉన్నాడు. ఈ ఆలయం చాలా పురాతనమైంది.
ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో, తిరుపతికి 20కి.మీ. దూరంలో ఉన్న గుడిమల్లం గ్రామం ఉంది. ఈ గ్రామంలోని దేవాలయంలో శివుడు మానవాకారంలో కనిపిస్తాడు.
ఈ శివలింగం క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్ద కాలం నాటిదని పురావస్తు శాఖ గుర్తించినట్లు ఆలయ చైర్మన్ బచ్చల గిరిబాబు నాయుడు బీబీసీకి వివరించారు.
2009 వరకు ఆలయంలో పూజలు జరిగేవి కావని, గ్రామస్తులు, తిరుపతిలో ఉండే రాస్ అనే స్వచ్ఛంద సంస్థ చేసిన పోరాట ఫలితంగా కేంద్ర ప్రభుత్వం పూజలకు అవకాశం కల్పించిందని అన్నారు.
1911లోనే గోపీనాథరావు అనే పురావస్తు శాస్త్రవేత్త ఈ ఆలయాన్ని వెలికి తీసినప్పటికీ, గత దశాబ్ద కాలంగానే మూలవిరాట్ పూజలు అందుకుంటున్నారని ఆలయ చైర్మన్ తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- ఆక్వా ఉత్పత్తుల్లో మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్, రికార్డు ధరలతో రొయ్యలు, చేపల సాగుదారులకు లాభాలు
- క్లబ్హౌస్: ఈ యాప్లో యువతీ యువకులు సెక్స్ చాట్లు ఎందుకు చేస్తున్నారు? ఆ తర్వాత పరిణామాలేంటి?
- eSanjeevani OPD: ఆన్లైన్లో అన్ని స్పెషాలిటీల డాక్టర్లు.. పైసా ఫీజు లేదు, ఎవరైనా వాడుకోవచ్చు
- యుక్రెయిన్లో భారతీయ విద్యార్థులు: కొందరు రాత్రంతా నడిచి బోర్డర్ చేరుకున్నారు, మిగతావారు ఏమయ్యారు
- పుతిన్ న్యూక్లియర్ బటన్ నొక్కుతారా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)



