కేసీఆర్: తెలంగాణ ప్రజలందరికీ ఉచితంగా కోవిడ్ టీకా - Newsreel

kcr

ఫొటో సోర్స్, Telangana CMO

తెలంగాణ ప్రజలందరికీ కరోనావైరస్ వ్యాక్సీన్ ఉచితంగా అందించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.

కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులను సమీక్షించిన ఆయన 18 ఏళ్లు దాటిని అందరికీ ఉచితంగా వ్యాక్సీన్ వేయనున్నట్లు చెప్పారు.

రాష్ట్ర ప్రజలు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు అందరూ కలిపి సుమారు 4 కోట్ల మంది ఉంటారని, వీరందరికీ టీకా వేయడానికి రూ. 2,500 కోట్ల వరకు ఖర్చవుతుందని అన్నారు.

ఇప్పటికే 35 లక్షల మందికి టీకాలు వేసినట్లు చెప్పారు.

రాష్ట్రంలో ఆక్సిజన్, రెమ్‌డెసివర్ కొరత రాకుండా చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు.

మోదీ

ఫొటో సోర్స్, Ani

ఆక్సిజన్ సంబంధిత పరికరాల దిగుమతులపై 3 నెలల పాటు పన్ను మినహాయింపు: మోదీ

దేశంలోని ఆసుపత్రులలో ఆక్సిజన్ లభ్యత పెంచేందుకు చేపడుతున్న చర్యలను సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించినట్లు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరత కారణంగా గత రెండు రోజులుగా కోవిడ్ రోగులు మరణిస్తుండడంతో దేశవ్యాప్తంగా ఆందోళన నెలకొంది.

మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తి, సరఫరా వేగవంతం చేయాలని.. ఆసుపత్రులు, ఇళ్లలో రోగులు ఆక్సిజన్ పెట్టుకునేందుకు అవసరమైన పరికరాల లభ్యత పెంచాల్సిన తక్షణ అవసరం ఉందని మోదీ అన్నారు.

ఆక్సిజన్, ఆక్సిజన్ అవసరాల సంబంధిత పరికరాల దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీ, హెల్త్ సెస్ మూడు నెలల పాటు రద్దు చేస్తున్నట్లు ప్రధాని ప్రకటించారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఆక్సిజన్ అవసరాలకు సంబంధించిన పరికరాలకు కస్టమ్స్ క్లియరెన్స్ వేగవతంగా జరగాలని రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌ను ఆయన ఆదేశించారు.

ఆక్సిజన్

ఫొటో సోర్స్, Reuters

‘ఆక్సిజన్ సరఫరాకు ఆటంకం కలిగిస్తే క్రిమినల్ చర్యలు’

ఆసుపత్రులలో ఆక్సిజన్ కొరతపై దిల్లీ హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

ఆక్సిజన్ సరఫరాకు ఎవరైనా ఆటంకాలు కలిగిస్తే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించింది.

''దేశంలో కరోనావైరస్ పాజిటివ్ కేసులు ఇంకా పీక్ స్టేజికి చేరలేదు. మే నెలలో పీక్ రావొచ్చు. ఆ పరిస్థితికి ఎలా సిద్ధమవుతున్నాం?'' అని కోర్టు ప్రశ్నించింది.

ఆక్సిజన్ కొరతపై దిల్లీలోని వివిధ ఆసుపత్రులు తమను ఆశ్రయించడంతో కోర్టు విచారణ చేపట్టింది.

దిల్లీ నగరంలోని ఆసుపత్రులకు 480 టన్నుల ఆక్సిజన్ లభించకపోతే వ్యవస్థ కుప్పకూలుతుందని దిల్లీ ప్రభుత్వం ఈ సందర్భంగా కోర్టుకు తెలిపింది.

కేంద్రం నుంచి శుక్రవారం 297 టన్నుల ఆక్సిజన్ మాత్రమే అందిందని చెప్పింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

దీంతో.. దిల్లీకి 480 టన్నుల ఆక్సిజన్‌ను కేంద్రం సమకూర్చితే సమస్యలు పరిష్కారమవుతాయని కోర్టు చెప్పంది.

సరఫరాకు ఆటంకం కలిగిస్తున్న వారి వివరాలు కోర్టుకు సమర్పించాలని.. దిల్లీ రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా క్రయోజనిక్ ట్యాంకర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)