భారత్-చైనా సరిహద్దు ఘర్షణ: 'భారత సైనికులను ఎవరినీ నిర్బంధంలోకి తీసుకోలేదు' - చైనా విదేశాంగ ప్రతినిధి

ఫొటో సోర్స్, AFP
భారత సైనికులెవరినీ తాము నిర్బంధంలోకి తీసుకోలేదని చైనా ప్రకటించింది. పది మంది భారతీయ సైనికులను చైనా విడుదల చేసినట్లు గురువారం వచ్చిన వార్తలకు స్పందిస్తూ చైనా విదేశాంగ ప్రతినిధి చావో లిజియన్ మీడియా సమావేశంలో మాట్లాడారు.
"భారతీయ సైనికులెవరినీ చైనా నిర్బంధంలోకి తీసుకోలేదు" అని లిజియన్ అన్నారు.
అయితే, చైనా బందీలుగా పట్టుకున్న వారిలో ఒక లెఫ్టినెంట్ కల్నల్, ముగ్గురు మేజర్లు ఉన్నారని భారతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. భారత ప్రభుత్వం మాత్రం తమ సైనికులెవరూ కనిపించకుండా పోలేదని ప్రకటించింది.భారత సైనికులను ఎవరినీ నిర్బంధంలోకి తీసుకులేదని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి చావో లిజియన్ అన్నారు.
చైనా - భారత్ సరిహద్దు పరిస్థితులపై సమచారాన్ని అందించేందుకు శుక్రవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ లిజియన్ తాము ఎవరినీ నిర్బంధంలోకి తీసుకోలేదని చెప్పారని ఏఎన్ఐ వార్తా సంస్థ తెలిపింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
ఇదిలా ఉంటే, ఇండియా టుడే సీనియర్ ఎడిటర్ శివ్ అరూర్ గురువారం ఒక ట్వీట్ చేస్తూ, చైనా విడుదల చేసిన భారత సైనికుల వివరాలు అంటూ ట్వీట్ చేశారు. బుధవారం నాడు ఇరుపక్షాలు జరిపిన చర్చల్లో వారి విడుదల కీలకాంశంగా నిలిచిందని ఆయన చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
లేహ్ సందర్శించిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చీఫ్
చైనాతో ఘర్షణలు కొనసాగుతున్న నేపథ్యంలో భారత వాయు సేన తన యుద్ధ విమానం సహా సైనిక బలగాలను మరింత ముందుకు మోహరించిందని ఏఎన్ఐ వార్తా సంస్థ రిపోర్ట్ చేసింది. భారత వాయు సేన ప్రధానాధికారి ఆర్కెఎస్ భాదౌరియా లేహ్, శ్రీనగర్ వైమానిక స్థావరాలను సందర్శించారు. తూర్పు లద్దాఖ్ ప్రాంతంలో ఎలాంటి కార్యకలాపాలు చేపట్టాలన్నా ఈ రెండు స్థావరాలు కీలక పాత్ర పోషిస్తాయి.
గల్వాన్ లోయలో చైనా సైన్యం 20 మంది భారత సైనికులను హత మార్చిన ఘటనపై ఉన్నత స్థాయి అధికార సమీక్ష జరిగిన తరువాత భాదౌరియా ఈ పర్యటన చేయడం కీలక ప్రాధాన్యం సంతరించుకుంది.
"ఎల్ఏసీ వెంబడి చైనా 10 వేల మంది బలగాలతో దూకుడుగా వ్యవహరిస్తుండడంతో ఈ ప్రాంతంలో భారత సేన అన్ని రకాలుగా ఎలా సిద్ధంగా ఉందన్నది ఆయన సమీక్షించారు" అని ప్రభుత్వ వర్గాలు ఏఎన్ఐకి తెలిపాయి.

ఫొటో సోర్స్, NICOLAS ASFOURI
చైనా సైనికులు ఇనుపరాడ్లతో భారత సైనికులపై దాడి చేశారా?
అంతకుముందుకూడా ఆయన వివిధ మీడియా సంస్థలు, ఏజెన్సీలతో మాట్లాడారు. ఇనుపరాడ్లతో భారత సైనికులపై దాడి చేశారా అన్న రాయిటర్స్ ప్రశ్నకు '' ఇక్కడ ఏది కరెక్టు, ఏది తప్పు అన్న విషయంలో ఎటువంటి గందరగోళం లేదు'' అన్నారు.
భారత చావో లిజియన్ ఎల్ఏసిని దాటినందుకే ఘర్షణ మొదలైందా అని అడగ్గా ''ఇందులో చైనా బాధ్యత ఏమీ లేదు. వివాదం ఎలా ప్రారంభమైందో మేము స్పష్టంగా వివరించాము. గతంలో కమాండర్ స్థాయిలో చర్చల తరువాత కుదిరిన ఒప్పందాన్ని సోమవారం రాత్రి సరిహద్దులో మోహరించిన భారత భద్రతా దళాలు ఉల్లంఘించాయి. భారత దళాలు వాస్తవ నియంత్రణ రేఖను దాటి, ఉద్దేశపూర్వకంగా చైనా దళాలను రెచ్చగొట్టడం ప్రారంభించాయి, దాడి చేశాయి. దీని తరువాత ముఖాముఖి ఘర్షణ, ఆపై ప్రాణనష్టం జరిగింది. మొత్తం ఘటనపై భారత్ దర్యాప్తు చేసి, బాధ్యులను శిక్షించాలి'' అని చావో అన్నారు. ఇలాంటివి మళ్లీ జరగకుండా భారత్ జాగ్రత్తపడాలన్నారు.
"చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి, భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మధ్య జరిగిన సంభాషణ గురించి మేము ఇప్పటికే సమాచారాన్ని చెప్పాము" అని చావో చెప్పారు.
భారతదేశం తన సరిహద్దుల్లో సైనికుల సంఖ్యను పెంచుతోంది. మీరు కూడా అలాగే సైన్యాన్ని పెంచుతారా అన్న ఎఎఫ్పి వార్తా సంస్థ ప్రశ్నకు "భారత్-చైనా సరిహద్దులో చైనా వైఖరి గురించి నేను ఇప్పటికే ప్రతిదీ చెప్పాను. వివాదాన్ని పరిష్కరించడానికి ఇరువర్గాలు కృషి చేస్తున్నాయి. ఇరుదేశాల మధ్య సైనిక మరియు దౌత్య స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఇంతకన్నా ఎక్కువ నేను చెప్పలేను'' అన్నారు చావో.
మీ తరువాతి చర్య ఎలా ఉండబోతోందన్న పీటీఐ ప్రశ్నకు "రెండు దేశాలు అభివృద్ధి చెందుతున్న శక్తులని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి భారత విదేశాంగ మంత్రి ఎస్.జైశంకర్తో అన్నారు. రెండింటి జనాభా ఒక బిలియన్ కంటే ఎక్కువ. మేము పరస్పర గౌరవం, మద్దతుతో ముందుకు వెళితే, ఇరు దేశాల ఉమ్మడి ప్రయోజనాలు నెరవేరతాయి. అపనమ్మకాన్ని, అసమానతలను పెంచుకుంటే, అది రెండు దేశాల పౌరుల ఆశయానికి అది విరుద్ధంగా ఉంటుంది. ఇరు దేశాలు కీలకమైన ఒప్పందాన్ని కుదుర్చుకుంటాయి, దానిని అనుసరిస్తాయి'' అని అన్నారు చావో లిజియన్.

ఫొటో సోర్స్, Hindustan Times
రాహుల్ గాంధీ ప్రశ్నలకు విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ సమాధానం
విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.
విదేశాంగ మంత్రి గల్వాన్ లోయలో భారత్-చైనా సరిహద్దులో మోహరించిన భారత జవాన్ల దగ్గర ఆయుధాలు ఉన్నాయని, కానీ గత ఒప్పందం ప్రకారం వారు ఆయుధాలను ఉపయోగించలేదు” అని చెప్పారు.
భారత సైన్యాన్ని ఆయుధాలు లేకుండా చైనా సైన్యం దగ్గరకు ఎవరు పంపించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
దీనికి సమాధానంగా విదేశాంగ మంత్రి ట్వీట్ చేస్తూ, “సరిహద్దుల్లో మోహరించిన జవాన్లు అందరూ ఆయుధాలతో నడిచేవారు. ముఖ్యంగా పోస్ట్ వదిలే సమయంలో కూడా వారి దగ్గర ఆయుధాలు ఉంటాయి. జూన్ 15న గల్వాన్లో మోహరించిన జవాన్ల దగ్గర కూడా ఆయుధాలు ఉన్నాయి. కానీ 1996, 2005 భారత్-చైనా సంధి వల్ల సుదీర్ఘ కాలంగా ఫేస్-ఆఫ్ సమయంలో జవాన్లు ఫైర్ ఆర్మ్స్(తుపాకులు) ఉపయోగించకపోవడం జరుగుతోంది” అన్నారు.
జూన్ 15, 16 రాత్రి గల్వాన్ లోయలో ఎల్ఏసీ దగ్గర మోహరించిన భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణ జరిగింది. అందులో 20 మంది భారత సైనికులు చనిపోయారు.
ఆ తర్వాత నుంచి రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 4
రాహుల్ గాంధీ గురువారం ట్వీట్ ద్వారా “మన నిరాయుధ జవాన్లను చంపడానికి చైనాకు ఎంత ధైర్యం. మన జవాన్లను ఆయుధాలు లేకుండానే అమరులయ్యేలా ఎందుకు పంపించారు” అన్నారు.
కానీ విదేశాంగ మంత్రి ఇచ్చిన ఈ సమాధానానికి చాలా మంది సంతృప్తి చెందినట్లు కనిపించడం లేదు.
సోషల్ మీడియాలో జనం విదేశాంగ మంత్రి ప్రకటనకు స్పందనలు వస్తున్నాయి.
ప్రముఖ జర్నలిస్ట్ రాహుల్ పండితా ట్వీట్లో మన కమాండింగ్ ఆఫీసర్ చనిపోతున్నప్పుడు, మన దగ్గర ఆయుధాలు ఉండి కూడా ఏం లాభం అని పెట్టారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 5
“ఓకే, జవాన్ల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. నాకు ఒప్పందాల గురించి కూడా తెలుసు. కానీ మన కమాండింగ్ ఆఫీసర్ శరీరాన్ని మేకులతో, ముళ్ల కంచెతో గాయపరుస్తున్నప్పుడు, ఆయుధాలు ఉపయోగించకపోతే, అవి మన దగ్గర ఉండడంలో అర్థమేముంది” అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 6
ప్రముఖ జర్నలిస్ట్ అశుతోష్ కూడా విదేశాంగ మంత్రి సమాధానంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ “విదేశాంగ మంత్రి మీ ట్వీట్ ఎంత చెబుతోందో, అంత దాస్తోంది. మీరన్నట్టు భారత సైనికుల దగ్గర ఆయుధాలు ఉన్నాయి. అయితే వారు ఆత్మరక్షణకు వాటిని ఎందుకు ఉపయోగించలేదు దయచేసి దీనికి సమాధానం ఇవ్వండి. ఇది జాతీయ భద్రతకు సంబంధించిన విషయం. ఏదీ దాచద్దు, నిజమేంటో అది చెప్పండి” అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 7
భారత-చైనా మధ్య ఆరు గంటలపాటు జరిగిన మేజర్ జనరల్ స్థాయి చర్చలు ముగిసినట్లు ఏఎన్ఐ తెలిపింది. జూన్ 15, 16 తేదీల్లో గల్వాన్ లోయ దగ్గర ఆపరేషన్లలో పాల్గొన్న సైనికులందరూ దీనికి కారణమని, ఆ చర్యల్లో ఎవరూ గల్లంతు కాలేదని ఏఎన్ఐ చెప్పింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 8
మరోవైపు జూన్ 23న ఆర్ఐసీ( రష్యా-భారత్-చైనా) విదేశాంగ మంత్రుల సమావేశంలో భారత్ పాల్గొంటుందని భారత విదేశాంగ శాఖ ధ్రువీకరించింది.
సరిహద్దుల్లో శాంతిని కాపాడాలని, చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని మేం నిశ్చయించుకున్నాం. అదే సమయంలో ప్రధాని నిన్న చెప్పినట్లు భారత సౌర్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రత విషయంలో మేం బలంగా కట్టుబడి ఉన్నాం అని విదేశాంగ శాఖ కార్యదర్శి వికాస్ స్వరూప్ చెప్పారని ఏఎన్ఐ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- 'గాల్వాన్లో సైనికులు రాళ్ళు, కర్రలతో కొట్టుకుని చనిపోయారు' - జనరల్ మాలిక్
- గల్వాన్ లోయ ఘర్షణలో చైనా సైనికులు మరణించారా.. ఆ దేశం ఏమంటోంది
- భారత్-చైనా ఉద్రిక్తతలపై నేపాల్ ఎందుకు ఆందోళన చెందుతోంది?
- భారత్-చైనా సరిహద్దు వివాదంలో దూకుడు ప్రదర్శిస్తోంది ఎవరు? - మాజీ సైన్యాధికారి వీపీ మాలిక్ ఇంటర్వ్యూ
- 20 మంది భారత సైనికులు మరణించారు.. భారత సైన్యం అధికారిక ప్రకటన
- భయమేమీ లేదని అమ్మకు భరోసా ఇచ్చాడు.. మరుసటి రోజే చైనా సైనికుల చేతిలో చనిపోయాడు
- భారత్-చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా మీడియా ఆరోపణలు ఏంటి?
- "కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం పైచేయి సాధించడానికి ఏకైక కారణం ఇదే"
- నేపాల్తో చైనా స్నేహం భారత్కు ప్రమాదమా
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- 1990ల్లో 13 నెలలపాటు నేపాల్ను భారత్ ఎందుకు దిగ్బంధించింది?
- ఒక్క సంవత్సరంలోనే 600 సార్లు అతిక్రమణలకు పాల్పడిన చైనా.. ఈ చర్చలతో ఉద్రిక్తతలకు తెర పడుతుందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








