పాకిస్తాన్‌తో చర్చలంటూ జరిగితే అది 'పీవోకే'పైనే: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్

రాజ్ నాథ్ సింగ్

ఫొటో సోర్స్, EPA

పాకిస్తాన్‌తో కనుక చర్చలంటూ జరిగితే ఇకపై అది 'పాక్ ఆక్రమిత కశ్మీర్'పై మాత్రమేనని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.

హరియాణాలోని పంచకులాలో ఓ ఎన్నికల సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

''పాకిస్తాన్‌తో చర్చలు జరగాలని కొందరు అంటున్నారు. కానీ, పాకిస్తాన్ ఉగ్రవాదానికి ఊతమివ్వడం ఆపేవరకు అలాంటి ప్రసక్తే ఉండదు' అంటూ ఆయన ట్వీట్ కూడా చేశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

హరియాణాలో ఎన్నికల సందర్భంగా 'జన్ ఆశీర్వాద్ యాత్ర'లు నిర్వహిస్తున్నారు. సెప్టెంబరు 8తో ఇవి ముగుస్తాయి.

ఈ యాత్రల ప్రారంభం నుంచి రాజ్‌నాథ్ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు.

అందులో భాగంగా ఆయన ఇటీవల ''బీజేపీ రాజకీయాలు కేవలం ప్రభుత్వ ఏర్పాటుకే కాదు దేశ నిర్మాణం కోసమూ ఉంటాయ''ని ఆయన పేర్కొన్నారు.

ఆర్టికల్ 370, 35ఏ రద్దుతో జమ్మూకశ్మీర్ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఆ అభివృద్ధిలో అక్కడి యువతను భాగస్వాములను చేయాలనీ ఆయన తన ట్వీట్లలో రాశారు.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

బాలాకోట్ కంటే పెద్ద దాడికి భారత్ ప్రయత్నిస్తోందని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారని.. అంటే బాలా‌కోట్‌లో దాడి జరగలేదంటూ ఇంతకాలం ఖండిస్తూ వచ్చిన పాకిస్తాన్ ఇప్పుడు అంగీకరించినట్లేనని ఆయన ఎన్నికల సభలో అన్నారు.

మోదీ, రాజ్‌నాథ్

ఫొటో సోర్స్, EPA

''మన పొరుగుదేశం అంతర్జాతీయ సమాజం తలుపు తడుతోంది. భారత్ పెద్ద తప్పు చేసిందని చెబుతోంది'' అంటూ పాకిస్తాన్ పేరెత్తకుండా అన్నారు.

ఇటీవలే ఆయన అణ్వస్త్రాలను వాడే విషయంలోనూ సంచలన ప్రకటన చేశారు. అణ్వాయుధాలను తొలుత తాము ప్రయోగించకూడదన్న విధానాన్నే భారత్ ఇప్పటికీ పాటిస్తోందని.. భవిష్యత్తులో ఈ విధానం ఎలా ఉంటుందన్నది అప్పటి పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని రాజ్‌నాథ్ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)