‘‘మేం ఆర్యులం.. అసలైన ఆర్యులం...’’

- రచయిత, దీపక్ శర్మ
- హోదా, బీబీసీ ప్రతినిధి
పాతికేళ్ల లామ్హో వాళ్ల ఊరికి వెళ్లే ఈ దారి చాలా మనల్ని చాలా ఆసక్తికరమైన గతంలోకి తీసుకెళ్తుంది.
బ్రోక్పా సముదాయానికి చెందిన ల్హామో. ‘‘మాది బియామా ప్రాంతం. బియామా ఆర్యన్లకు ప్రసిద్ధి. మమ్మల్ని మేం అసలైన ఆర్యులుగా భావిస్తాం’’ అని ఆమె చెప్తున్నారు.
ఈ విషయాన్ని లోతుగా అధ్యయనం చేయడం.. బియామా, దాహ్, హానూ, దార్చిక్ గ్రామాలకు చేరుకోవడం కన్నా కష్టమైన పని.
సింధూ నది ఒడ్డున ఉండే ఈ గ్రామాల్లో నివసిస్తున్న బ్రోక్పా సముదాయానికి చెందిన దాదాపు 5,000 మంది మాత్రం ఇదే నమ్ముతారు.

కార్గిల్ కాలేజీలో బోధించే స్వాంగ్ గేల్సన్ వాస్తవాల ఆధారంగా ఈ విషయాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బ్రోక్పా సంస్కృతి పరిశోధకుడు.
‘‘చరిత్రకారుల విషయానికొస్తే.. ఎ.హెచ్.ఫ్రెంకీ అనే చరిత్రకారుడు హిస్టరీ ఆఫ్ వెస్టర్న్ టిబెట్ అనే పుస్తకంలో కూడా రాశాడు. మేం నివసించే దర్ద్ అనే ఈ ప్రాంతాన్ని ఆర్యన్ స్టాక్ అని ఆయన అభివర్ణించారు. ఇంకా చాలా మంది రచయితలు కూడా మమ్మల్ని అలెగ్జాండర్ ద గ్రేట్ వారసులని పేర్కొన్నారు’’ అని స్వాంగ్ చెప్తున్నారు.

ఆర్యుల విషయంలో చరిత్రకారుల్లో వేర్వేరు అభిప్రాయాలున్నాయి.
ఆర్యులు బహుశా బయటి నుంచే భారత ఉపఖండానికి వచ్చి ఉంటారనే విషయం ఇటీవలి డీఎన్ఏ పరిశోధనల్లో వెల్లడైంది.
వారి ఆచారవ్యవహారాల్లో వైదిక సంస్కృతి ప్రభావం కనిపిస్తుందని చాలా మంది పరిశోధకులు అభిప్రాయపడ్డారు.

లద్దాఖ్ లోని ఇతర ప్రజలకు భిన్నంగా బ్రోక్పాలు తమ సంస్కృతి వైదిక సంస్కృతికి దగ్గరగా ఉంటుందని అంటారు.
‘‘మా సంస్కృతి వైదిక సంస్కృతితో చాలా ముడిపడి ఉంటుంది. మా భాషపై కూడా సంస్కృతం ప్రభావం ఉంటుంది. ఉదాహరణకు సూర్యుడిని సూర్య్ అంటాం. గుర్రాన్ని అశ్వ్ అంటాం. మేం దేవీదేవతల్ని పూజిస్తాం’’ అని చెప్పారు స్వాంగ్.

బ్రోక్పాల ముఖాకృతిని గమనిస్తే అది మంగోలుల్లా కనిపించే లద్దాఖీల ముఖాకృతికి భిన్నంగా ఉంటుంది. మాట్లాడే భాష, చాలా కట్టుబాట్ల విషయంలో కూడా బ్రోక్పాలకూ, లద్దాఖీలకు తేడా ఉంది.
బౌద్ధులే అయినప్పటికీ బ్రోక్పాలు స్థానిక దేవుళ్లను పూజిస్తారు. అయితే బలులు ఇచ్చే విషయంలో ఇప్పుడు వ్యతిరేకత వస్తోంది.

తమ పూర్వికులు గిల్గిత్ ప్రాంతం నుంచి వచ్చారని బ్రోక్పా సముదాయానికి చెందిన వృద్ధులు చెబుతుంటారు.
బహుశా ఆర్యులు గిల్గిత్ సమీపం నుంచే ఈ ఉపఖండానికి వలస వచ్చి ఉండొచ్చు. అయితే, ఆర్యులకు సంబంధించిన చాలా ప్రశ్నలకు ఇంకా జవాబులు వెదకాల్సే ఉందనేది కూడా వాస్తవమే.

‘‘ఆర్యులు తమను తాము నోబుల్, ఎంకరేజింగ్ పర్సనాలిటీలుగా భావిస్తారు. ఇక్కడి యువతరం అంతా తమది ఇదే ఐడెంటిటీ అని విశ్వసిస్తారు. దీనిపై మరింత అధ్యయనం జరగాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం’’ అని స్వాంగ్ పేర్కొన్నారు.
నేటి బ్రోక్పా తరాల ఎదుట భవిష్యత్తు ఏంటనే సవాలు కూడా ఉంది.
భారత్లోని మరే ప్రాంతంలోకన్నా ఈ సముదాయంలో బాలికల చదువు, కెరీర్లకు ఎక్కువ ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగావకాశాలు పరిమితమే. అయితే పెరుగుతున్న పర్యాటక రంగం ఫలితంగా కొంత ఆదాయం లభిస్తోంది.

‘‘ఇప్పుడు టూరిజం కొంత పెరిగింది. దాంతో నేను గైడ్గా పని చేస్తున్నాను. దాని ద్వారా సంపాదించిన దాంతోనే ఖర్చుల్ని వెళ్లదీసుకుంటున్నాను. రోజు కూలీ చెప్పున నాకు పేమెంట్ చేస్తారు’’ అని ల్హామో తెలిపారు.
తమను తాము స్వచ్ఛమైన ఆర్యులమని చెప్పుకోవడానికి గర్వపడుతున్న బ్రోక్పాలు ఇప్పుడు సామ్రాజ్యాల కోసం కాదు, ఉపాధి కోసం పోరాడుతున్నారు. ఈ పోరాటంలో విజయానికి మూల్యంగా తమ గుర్తింపునే కోల్పోవాల్సి వస్తే మాత్రం అది అసంపూర్ణంగానే మిగిలిపోతుంది.
- డి.డి.కోశాంబి: చరిత్రను పక్కదారి పట్టనివ్వలేదు.. కొత్తదారి చూపించారు
- పదహారేళ్లప్పుడు నన్ను రేప్ చేశారు... 32 ఏళ్లుగా బాధను భరిస్తూనే ఉన్నాను
- ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఐదుగురు మహిళా గూఢచారులు
- ఆడవారిని మగవారుగా, మగవారిని ఆడవారుగా ఎలా మార్చుతారు?
- బిగ్ బాస్: ‘ఒక సైకలాజికల్ ప్రెషర్ కుక్కర్’ –బాబు గోగినేని
- ఆసియా కప్: విజేత భారత్, కానీ చాంపియన్ మెరుపులు ఎక్కడ?
- ఇష్టపూర్వక వివాహేతర సంబంధం నేరం కాదు : సుప్రీం కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









