అమెజాన్ అడవిలో కూలిన విమానంలోని నలుగురు పిల్లల జాడ ఎలా తెలిసిందంటే...

ఫొటో సోర్స్, Reuters
అమెజాన్ అడవిలో విమానం కూలిపోయిన తర్వాత అందులోని నలుగురు పిల్లలు 40 రోజుల తరువాత ప్రాణాలతో దొరికారు.
అమెజోనాస్ ప్రావిన్స్లోని అరరాకురా నుంచి శాన్ జోస్ డెల్ గువావియారేకు ప్రయాణిస్తున్న సెస్నా 206 విమానంలో మే 1వ తేదీన ఈ పిల్లలు, వారి తల్లి ఎక్కారు.

ఫొటో సోర్స్, Reuters
విమానంలో ఇంజిన్ సమస్య తలెత్తడంతో, అలర్ట్ జారీ చేశారు. ఆ తర్వాత విమానం కూలిపోయింది.
ఈ విమాన ప్రమాదంలో వారి తల్లితో పాటు, ఫైలట్, కో ఫైలట్ కూడా మరణించారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
విమాన ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్న సహాయక బృందానికి పిల్లలు మాత్రం కనిపించలేదు. దీంతో పిల్లల కోసం గాలింపు చర్యలు మొదలుపెట్టారు. పిల్లల మంచినీళ్ల బాటిల్, కత్తెర, హెయిర్ టై వంటి వస్తువులను సహాయక సిబ్బంది గుర్తించారు.

ఫొటో సోర్స్, Reuters
అడవిలో పిల్లల పాద ముద్రలను కూడా సహాయక సిబ్బంది కనుగొన్నారు. దీంతో ఈ పిల్లలు బతికే ఉంటారని వారు భావించారు.

ఫొటో సోర్స్, Reuters
స్థానిక ప్రజలు కూడా ఈ పిల్లల్ని వెతికేందుకు సహకరించారు. హుయిటోటో భాషలో రికార్డు చేసిన పిల్లల అమ్మమ్మ మెసేజ్ను హెలికాప్టర్ల ద్వారా బ్రాడ్కాస్ట్ చేశారు. ఎక్కడున్న వారు అక్కడే ఉండాలని, అప్పుడే తాము తేలికగా కనుగొనగలమని చెప్పారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
అడవిలో అక్కడక్కడ కొన్ని పండ్లు కొరికి ఉండటంతో పిల్లలు తిన్నారని, వారు బతికే ఉన్నారని సెర్చ్ టీం నిర్ధరించుకుంది.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
ఈ పిల్లలు హయిటోటో స్థానిక గ్రూప్కు చెందిన వారు. పిల్లలకు పండ్లపై ఉండే అవగాహన, అటవీ ప్రాంతంలో మనుగడ సాధించే నైపుణ్యాలు వీరిని బతికించేందుకు సహకరించాయని ఈ కమ్యూనిటీకి చెందిన సభ్యులు భావించారు.

ఫొటో సోర్స్, Reuters
తరువాత అడవిలోని మరొక ప్రదేశంలో మొబైల్ ఫోన్లో భాగమైన లోహపు ముక్క గుర్తించింది సహాయక బృందం.

ఫొటో సోర్స్, EPA
40 రోజుల గాలింపు చర్యల అనంతరం అమెజాన్ అడవిలో పిల్లల జాడ గుర్తించింది సహాయక బృందం. ఈ విషయాన్ని కొలంబియా దేశాధ్యక్షుడు వెల్లడించారు.

ఫొటో సోర్స్, EPA-EFE/REX/SHUTTERSTOCK
పిల్లలను కొలంబియా రాజధాని బొగోటాకు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో వారికి చికిత్స అందిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- అమెజాన్ అడవుల్లో కూలిన విమానంలోని నలుగురు పిల్లలు 40 రోజుల తర్వాత ప్రాణాలతో దొరికారు
- పాంబన్-ధనుష్కోడి: 130 మంది ప్రయాణిస్తున్న రైలు సముద్రంలో మునిగిపోయిన క్షణాలు
- గేదెలను చంపుతున్నారు, గోవులను వధిస్తే ఇబ్బంది ఏమిటన్న మంత్రి.. ఇరకాటంలో పడ్డ కాంగ్రెస్
- కరీంనగర్ - ఆశ: ఒకప్పుడు భిక్షాటనతో బతికిన హిజ్రా.. ఇప్పుడు ఫొటోగ్రాఫర్ ఎలా అయ్యారు?
- నాసిక్: త్రయంబకేశ్వర ఆలయంలో ముస్లింలు ధూపం సమర్పించారా... వైరల్ వీడియోలో ఏముంది, అసలేం జరిగింది?
( బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)














