పాకిస్తాన్ దివాలా తీస్తుందా

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ దివాలా తీస్తుందా

పాకిస్తాన్‌పై ప్రస్తుతం 50.5 లక్షల కోట్ల పాకిస్తాన్ రూపాయల రుణ భారం ఉంది. అందులో ప్రభుత్వ రుణాలు 20.7 లక్షల కోట్ల రూపాయలు.

ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పాలనలో పాకిస్తాన్ రుణాలు బాగా పెరిగాయని ఇదే నివేదిక పేర్కొంది.

2021 సెప్టెంబర్‌లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్తాన్ రుణ గణాంకాలను విడుదల చేసిందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక తెలిపింది.

దానికి ఒకరోజు ముందు "పెరుగుతున్న రుణం జాతీయ భద్రతకు సంబంధించిన సమస్యగా" పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పేర్కొన్నారు.

గత 39 నెలల్లో పాకిస్తాన్ అప్పు 20.7 లక్షల కోట్ల పాకిస్తానీ రూపాయలు పెరిగిందని, దేశం మొత్తం అప్పులో ఇది 70 శాతం పెరుగుదల అని ఆ నివేదిక వెల్లడించింది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ పాకిస్థాన్ నిబంధనలు, షరతులు అంగీకారం కాకపోవడంతో అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్) పాకిస్తాన్‌కు రుణం ఇచ్చేందుకు నిరాకరించిందని ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్ పేర్కొంది.

పాకిస్తాన్ ఇటీవలి కరెంట్ అకౌంట్, ద్రవ్య లోటును పరిశీలిస్తే దేశం దివాలా తీయడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తుందని పాకిస్తాన్ ఆర్థిక వ్యవహారాల దర్యాప్తు సంస్థ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ (ఎఫ్‌బీఆర్) మాజీ చైర్మన్ సయ్యద్ షబ్బర్ జైదీ అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)