23,000 ఏళ్ల కిందటి టీనేజర్ పాదముద్రలు అమెరికా పుట్టు పూర్వోత్తరాలను బయటపెడతాయా..?
శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు నమ్మినదానికి ఇంకా 7 వేల సంవత్సరాల ముందే అమెరికా ఖండంలో మనుషులు సంచరించారని ఇటీవల నిర్వహించిన పరిశోధనల్లో బైటపడింది.
ఆసియా నుండి ఖండం నుంచి మనుషులు ఇక్కడికి ఎప్పుడు వచ్చి స్థిరపడ్డారనే అంశం అనేక దశాబ్దాలుగా చర్చనీయాంశంగా ఉంది.
16 వేల సంవత్సరాల కంటే ముందే ఉత్తర అమెరికా భూభాగంలో మనుషులు అడుగు పెట్టి ఉంటారన్న వాదనపై చాలామంది పరిశోధకులు సందేహాలు వ్యక్తం చేశారు.
అయితే, తాజాగా న్యూ మెక్సికోలో పనిచేస్తున్న బృందం 23 వేల సంవత్సరాలు లేదా 21వేల సంవత్సరాల నాటివిగా భావిస్తున్న మనిషి పాదముద్రలను కనుగొంది.
కొత్తగా లభించిన ఆధారాలు అమెరికా ఖండంలో మనుషులు కదలికలు ఎప్పటి నుంచి ఉన్నాయన్నదానిపై ఇప్పటి వరకు ఉన్న అభిప్రాయాలను మార్చే అవకాశం ఉంది.
ఇక్కడికి అంతకు ముందే పెద్ద ఎత్తున వలసలు జరిగి ఉండొచ్చని, ఆ జనాభా అంతరించి పోయి ఉండవచ్చని కూడా భావించేందుకు ఆస్కారం ఏర్పడింది.
ఈ పాదముద్రలు ఓ సరస్సుకు చెందిన మెత్తటి మట్టిలో కనిపించాయి. ఈ పరిశోధన వివరాలు సైన్స్ జర్నల్లో ప్రచురించారు.
ఇవి కూడా చదవండి:
- ‘ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో పోలీసుల కుమ్మక్కు.. ఇదో కొత్త ట్రెండ్, దీన్ని ఆపాలి’ అని సీజేఐ జస్టిస్ రమణ ఎందుకు అన్నారు?
- ఆర్యన్ ఖాన్: సముద్రంలో డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమారుడిని ఎలా పట్టుకున్నారంటే..
- హవాలా అంటే ఏంటి? ఈ నెట్వర్క్ ఎప్పుడు, ఎలా ప్రారంభమైంది? ఈ బిజినెస్ ఎంత పెద్దది?
- రెండవ ప్రపంచ యుద్ధం: ఈ చిన్న పడవలో నాజీల నుంచి ఆ సోదరులు ఎలా తప్పించుకున్నారు?
- పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్ విమానాన్ని ఒక బెంగాలీ పైలట్ హైజాక్ చేసినప్పుడు...
- లవ్ కోచింగ్ తీసుకుంటే భర్తలు సులభంగా దొరుకుతారా... ఒంటరి మహిళలు ఎందుకు దీని వెంట పడుతున్నారు?
- అమెరికాలో అబార్షన్ హక్కుల కోసం భారీ నిరసన ప్రదర్శనలు
- తొలి సిపాయిల తిరుగుబాటు విశాఖ కేంద్రంగా జరిగిందా?
- సమంత, అక్కినేని నాగ చైతన్య విడాకులు: విడిపోతున్నామని ప్రకటించిన హీరో, హీరోయిన్
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)