You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అనుమానాస్పద ఉత్తరం తెరిచి ఆసుపత్రి పాలైన ట్రంప్ కోడలు
అమెరికా అధ్యక్షుడి కోడలు వెనెసా ట్రంప్ను ఆసుపత్రిలో చేర్చారు. ఆమె ఒక అనుమానాస్పద ఉత్తరాన్ని (లిఫాఫా) తెరిచిన వెంటనే ముందు జాగ్రత్త కోసం ఇలా చేశారు.
ఆ అనుమానాస్పద ఉత్తరంపై తెల్లని పౌడర్ పూసి ఉందని పోలీసులు చెబుతున్నారు.
ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్ మ్యాన్హటన్ చిరునామాకు ఈ ఉత్తరం చేరింది.
ఆ సమయంలో అక్కడున్న వెనెసా ట్రంప్ సహా మరో ఇద్దరిని అగ్నిమాపక దళం ఆసపత్రికి చేర్చింది.
అయితే ఈ పౌడర్ ప్రమాదకరమైందేమీ కాదని పరీక్షలో తేలినట్టు న్యూయార్క్ పోలీసు విభాగం తెలిపింది.
ఆ పౌడర్ వల్ల వెనెసా ట్రంప్పై శారీరకంగా ఏ రకమైన ప్రభావం పడలేదని కూడా పోలీసులు అన్నారు.
ఉత్తరంపై సాగుతున్న దర్యాప్తు
ఈ ఘటన తర్వాత ముగ్గురు వ్యక్తులను వీల్ కార్నెల్ మెడికల్ కాలేజిలో చేర్చినట్టు అగ్నిమాపక దళం తెలిపింది.
సీబీఎస్ న్యూయార్క్ కథనం ప్రకారం, ఈ ఉత్తరాన్ని వెనెసా ట్రంప్ తల్లి స్వీకరించారు. ఆ తర్వాత వెనెసా దాన్ని తెరిచారు.
వెనెసా ట్రంప్, ట్రంప్ జూనియర్ల వివాహం 2005లో జరిగింది. ఈ దంపతులకు ఐదుగురు పిల్లలున్నారు. పెళ్లికి ముందు వెనెసా న్యూయార్క్లో మోడలింగ్ చేసేవారు.
ట్రంప్ జూనియర్ కుటుంబానికి అమెరికన్ సీక్రెట్ సర్వీస్ భద్రత కల్పిస్తుంది. ఘటన తర్వాత సీక్రెట్ సర్వీస్ ఉత్తరంపై దర్యాప్తు జరుపుతోంది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)