బిందెడు నీటి కోసం 70 ఏళ్లుగా యుద్ధం

వీడియో క్యాప్షన్, బకెట్ నీళ్ల కోసం ప్రాణాలు పణంగా పెడుతున్న గ్రామస్తులు వీళ్లు

ఇక్కడ నీటి కొరత ఎంత భయంకరంగా ఉందో ఈ దృశ్యాలు చూస్తే తెలిసిపోతోంది. బకెట్ నీళ్ల కోసం తమ ప్రాణాలనే ప్రమాదంలో పడేస్తున్నారు ఖడిమాల్‌లోని మహిళలు.

ఇది మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మేల్ఘాట్‌ ప్రాంతంలోని మారుమూల గ్రామం. ఇక్కడ రోజుకు రెండు మూడుసార్లు నీటి ట్యాంకర్లు తెప్పిస్తుంటారు.

దగ్గర్లో ఉన్న బావిలో ఆ నీళ్లను నింపుతారు. ట్యాంకర్ రాగానే నీళ్ల కోసం గ్రామస్థులు పరిగెడతారు. బావిలో పోసిన ట్యాంకర్ నీళ్లు గంటలోనే అయిపోతాయి.

గ్రామస్థులు తాగుతున్న ఈ కలుషిత నీళ్లు వారి ప్రాణాలను ప్రమాదంలో పడేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)