హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు

వీడియో క్యాప్షన్, హైదరాబాద్ నిజాం భారత సైన్యానికి ఎందుకు లొంగిపోయారు

సెప్టెంబర్ 17: ఒకరి దృష్టిలో విలీనం.. మరొకరి అభిప్రాయం విమోచనం.. ఇంకొకరి మాట విద్రోహం.. ఇంతకీ ఆ చరిత్రేంటి?

స్వాతంత్ర్యానంతరం సంస్థానాలను దేశంలో విలీనం చేయడంలో సర్దార్ వల్లభ్ భాయి పటేల్ పోషించిన పాత్ర అత్యంత కీలకం. అందుకే అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆయనను అంతగా ప్రశంసించారు.

బ్రిటిష్ పాలకులు భారతదేశానికి స్వాతంత్ర్యం ఇచ్చినప్పటికీ సంస్థానాల విషయంలో మెలిక పెట్టి వెళ్లడం సమస్యగా మారింది. అప్పటికి దేశంలో ఉన్న 565 సంస్థానాలకు స్వయం నిర్ణయాధికారాన్ని కట్టబెట్టారు బ్రిటిష్ పాలకులు. అందులో 562 సంస్థానాలు స్వచ్ఛందంగా భారత్‌లో చేరిపోగా కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలు మాత్రం స్వతంత్ర రాజ్యాలుగా ఉంటామని భీష్మించాయి.

562 సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యాక తెలంగాణ ప్రజలు నిజాం నిరంకుశ పాలనపై పోరాటం ప్రారంభించారు. దేశ్‌ముఖ్‌లు, దొరలు, భూస్వాములకు వ్యతిరేకంగా ఉద్యమాలు మొదలయ్యాయి. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జోరందుకుంది.

పూర్తి వివరాలు ఈ వీడియోలో..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)