ఆరని చితి మంటలు: దేశంలోని పరిస్థితికి నిదర్శనం ఈ చిత్రాలు..

శ్మశానాల్లో స్థలం లేకపోవడంతో దిల్లీలో సామూహిక అంత్యక్రియలు మొదలుపెట్టారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, శ్మశానాల్లో స్థలం లేకపోవడంతో దిల్లీలో సామూహిక అంత్యక్రియలు మొదలుపెట్టారు.

భారత్‌తో కోవిడ్ మృతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.

ఐసీయూ బెడ్లు, మందులు, ఆక్సిజన్ లేక ఎంతో మంది రోగులు చనిపోతున్నారు.

భారత్‌లో ఇప్పటికే లక్షా 86వేల మంది కోవిడ్‌తో చనిపోయారు.

గడిచిన రెండు వారాల్లోనే దాదాపు 30 లక్షల మందికి కరోనా సోకింది.

రోజువారీ కేసులు మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి.

భారత్‌లో మొదటి వేవ్ కంటే సెకండ్ వేవ్ తీవ్రత చాలా ఎక్కువగా ఉంది.

ఫలితంగా శ్మశానవాటికల్లో చితి మంటలు ఆరడం లేదు.

దేశవ్యాప్తంగా అనేక నగరాల్లో కాష్టం కాలుతూనే ఉంది.

అంత్యక్రియల కోసం రోగుల బంధువులు శ్మశానవాటికల దగ్గర గంటల కొద్ది ఎదురుచూస్తున్నారు.

కొన్ని నగరాల్లో స్థలం లేకపోవడంతో సామూహిక అంత్యక్రియలు చేపడుతున్నారు.

పలు రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేస్తున్న కోవిడ్ మృతుల సంఖ్యపై అనేక మంది జర్నలిస్టులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని నగరాల్లో కోవిడ్ మృతుల సంఖ్య అధికారిక లెక్కల కంటే పదిరెట్లు అధికంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు.

ముంబయిలో పీపీఈ డ్రెస్ వేసుకుని అలిసిపోయి బల్లపై పడుకున్న ఒక మృతుడి బంధువు. అంత్యక్రియలు చేయడానికి కొన్నిచోట్ల చాలా గంటలు వెయిట్ చేయాల్సి వస్తోంది.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ముంబయిలో పీపీఈ డ్రెస్ వేసుకుని, అలిసిపోయి శ్మశానంలోని బల్లపై పడుకున్న ఒక మృతుడి బంధువు. అంత్యక్రియలు చేయడానికి కొన్నిచోట్ల చాలా గంటలు వెయిట్ చేయాల్సి వస్తోంది.
લાઇન
కోవిడ్‌తో చనిపోయిన తమ ఆత్మీయులకు దిల్లీలోని ఒక శ్మశాన వాటికలో తుదివీడ్కోలు పలుకుతూ కన్నీరుమున్నీరవుతున్న వ్యక్తి.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, కోవిడ్‌తో చనిపోయిన తమ ఆత్మీయులకు దిల్లీలోని ఒక శ్మశాన వాటికలో తుదివీడ్కోలు పలుకుతూ కన్నీరుమున్నీరవుతున్న వ్యక్తి.
લાઇન
కోవిడ్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహం పక్కనే నిల్చున్న వైద్య సిబ్బంది.. అంత్యక్రియల కోసం ఈ శవాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, దిల్లీలో కోవిడ్‌తో చనిపోయిన వ్యక్తి మృతదేహం పక్కనే నిల్చున్న వైద్య సిబ్బంది.. అంత్యక్రియల కోసం ఈ శవాన్ని తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
લાઇન
లఖ్‌నవూలోని ఒక శ్మశానవాటికలో ఆరని చితి మంటల దృశ్యం.

ఫొటో సోర్స్, Sumit Kumar

ఫొటో క్యాప్షన్, లఖ్‌నవూలోని ఒక శ్మశానవాటికలో ఆరని చితి మంటల దృశ్యం.
લાઇન
ముంబయిలోని ఒక శ్మశానవాటికలో కోవిడ్-19 మృతులకు బంధువులు, మున్సిపల్ సిబ్బంది అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న దృశ్యం.

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, ముంబయిలోని ఒక శ్మశానవాటికలో కోవిడ్-19 మృతులకు బంధువులు, మున్సిపల్ సిబ్బంది అంతిమ సంస్కారాలు నిర్వహిస్తున్న దృశ్యం.

సూరత్‌లోని ఒక శ్మశానవాటిక నిరంతరం మండుతూనే ఉండటంతో అక్కడున్న చిమ్మీ కొద్దిగా కరిగిపోయింది.