కరోనావైరస్ సోకిన ఇండియన్ నేవీ సిబ్బంది ఎక్కడున్నారు.. వారికి ఎలా సోకింది

ఫొటో సోర్స్, Google maps
- రచయిత, నితిన్ శ్రీవాస్తవ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ముంబయిలో కోవిడ్-19 పాజిటివ్గా తేలిన భారత నావికా దళానికి చెందిన 21 మంది జవాన్లలో 20 మంది ‘ఐఎన్ఎస్ ఆంగ్రే’ భవనంలో ఉంటున్నారు.
ఈ భవనం ముంబయి ఫోర్ట్ ప్రాంతంలోని నేవల్ బేస్ డాక్యార్డ్ క్యాంపస్లో తీరానికి సమీపంలో ఉంటుంది. ఇక్కడ అవివాహిత జవాన్లు ఉంటారు.
ఈ భవనం గురించి తెలిసిన ఒక అధికారి తన పేరు బయటపెట్టకూడదనే షరతుతో “ఐఎన్ఐస్ ఆంగ్రేలో 650 నుంచి 750 మంది నేవీ జవాన్లు ఉండడానికి ఏర్పాట్లు ఉంటాయి. నేవీ భాషలో దీనిని ‘ఇన్-లివింగ్ బ్లాక్’ అంటారు” అని చెప్పారు.
“ముఖ్యంగా ఇది చాలా వరకూ బ్యాచిలర్స్ ఉండే హాస్టల్లా ఉంటుంది. వీరు ఉండే గదుల్లో వంట చేయడానికి విడిగా వంటగది లేదు. దాంతో నేవీ జవాన్లు అందరూ కామన్ ఏరియాలోకి వచ్చి తింటూ ఉంటారు” అన్నారు.
కొందరి వివరాల ప్రకారం ఈ భవనంలో చాలా గదులకు విడిగా బాత్రూంలు కూడా లేవు. దాంతో చాలామంది ప్రతి ఫ్లోర్లో ఉన్న కామన్ బాత్రూమ్స్ ఉపయోగిస్తూ ఉంటారు.

ఫొటో సోర్స్, Getty Images
కరోనా వచ్చిందని ఎలా తెలిసింది?
భారత నావికాదళం దీనిపై ఒక ప్రకటన జారీ చేసింది. అందులో ముంబయి నేవీ జవాన్ల క్యాంపస్లో మొత్తం 21 మందికి కోవిడ్-19 వచ్చింది. వారిలో ‘ఐఎన్ఎస్ ఆంగ్రే’లోని 20 మంది జవాన్లు ఉన్నారు” అని చెప్పింది.
నిజానికి, భారత నావికాదళంలో తొలి కరోనా పాజిటివ్ కేసు ఏప్రిల్ 5న ఒక నేవీ జవాన్కు కోవిడ్-19 టెస్ట్ చేసినప్పుడు బయటపడింది.
ఏప్రిల్ 7న టెస్ట్ ఫలితాల్లో అతడికి పాజిటివ్ అని వచ్చింది. బాధిత జవానుకు ముంబయిలోని ‘ఐఎన్ఎస్ అశ్విని’ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్ లక్షణాలు ఏంటి? ఎలా సోకుతుంది? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- కరోనావైరస్ మీకు సోకిందని అనుమానంగా ఉందా? ఈ వ్యాధి లక్షణాలను ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?

‘ఐఎన్ఎస్ అశ్విని’ నావీ వెస్టర్న్ కమాండ్కు సంబంధించిన అతిపెద్ద ఆధునిక ఆస్పత్రి. ప్రస్తుతం పాజిటివ్ వచ్చిన జవాన్లు, ఏప్రిల్ 7న కోవిడ్-19 పాజిటివ్గా తేలిన జవాన్ను కాంటాక్ట్ అయ్యారని నావికాదళ అధికారులు చెబుతున్నారు.
కోవిడ్-19 టెస్టులో పాజిటివ్గా తేలిన ఈ 20 మంది జవాన్లలో దాదాపు అందరూ ‘ఐఎన్ఎస్ ఆంగ్రే’లో ఉంటున్నవారే కావడంతో ఈ కేసులు బయటపడగానే, నావికాదళం అప్రమత్త మైంది.

ఫొటో సోర్స్, Indian navy
నావికాదళం అప్రమత్తం
ఈ జవాన్ల వయసు 20-25 ఏళ్ల మధ్యలో ఉంటుంది. ఈ నివాస భవనాన్ని ఇప్పుడు పూర్తిగా క్వారంటైన్ చేసేశారని నిపుణులు చెబుతున్నారు.
అంతేకాదు, దేశంలోని వివిధ డాక్యార్డులు లేదా స్థావరాల దగ్గర ప్రస్తుతం మోహరించిన యుద్ధనౌకలు, జలాంతర్గాముల్లో ఉన్నవారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వైరస్ వ్యాపించకుండా ఇండియన్ నేవీ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది.
భారత పదాతి దళంలో కూడా ఇప్పటివరకూ 8 కరోనా పాజిటివ్ కేసులు వెలుగులోకి వచ్చాయి.
గమనించాల్సిన విషయం ఏంటంటే, అత్యంత బలమైనదిగా భావించే అమెరికా నావికా దళ యుద్ధ విమాన వాహక నౌక ‘థియోడోర్ రూజ్వెల్డ్’ కూడా కోవిడ్-19 గుప్పిట్లో చిక్కుకుంది.
ఆ నౌకలోని వంద మందికి పైగా నేవీ జవాన్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. తర్వాత వెంటనే ఈ నౌకలోని 2 వేల మందికి పైగా జవాన్లను క్వారంటైన్ చేశారు.
కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి.
- కరోనావైరస్: ఈ వ్యాధి చికిత్సకు క్లోరోక్విన్ పనిచేస్తుందా? అందుకు ఆధారాలు ఉన్నాయా?
- జూన్ అల్మీడా: మొదటి కరోనావైరస్ను కనిపెట్టిన మహిళ
- కరోనావైరస్: ‘గరిష్ట స్థాయిని దాటేశాం, అమెరికా త్వరలోనే సాధారణ స్థితికి చేరుకుంటుంది’ - డోనల్డ్ ట్రంప్
- కరోనావైరస్: ఈ మహమ్మారి ప్రపంచ దేశాల మధ్య యుద్ధానికి కారణం అవుతుందా?
- హ్యాండ్ శానిటైజర్లకు ఎందుకింత కొరత?
- కరోనావైరస్: ఇళ్లలో తయారుచేసే మాస్కులు ఎంత భద్రం?
- గర్భిణికి వైరస్ సోకితే ఎలా? : కరోనా కల్లోలంలో ఓ డాక్టర్ అనుభవం
- కరోనావైరస్కు భయపడని ఏకైక యూరప్ దేశం ఇదే
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?
- కరోనావైరస్ నివారణకు గోమూత్రం పని చేస్తుందా
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








