కరోనావైరస్: హైదరాబాద్లో ఒకే కుటుంబంలో 17 మందికి కోవిడ్ వ్యాధి

ఫొటో సోర్స్, Getty Images
హైదరాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన 17 మందికి కరోనావైరస్ పాజిటివ్ ఉన్నట్లు నిర్ధరణ అయిందని అధికారులు ధ్రువీకరించారు. వారిలో పది నెలల శిశువు కూడా ఉన్నట్లు చెబుతున్నారు.
హైదరాబాద్లోని తలాబ్కట్టకు చెందిన ఒక మహిళ ఏప్రిల్ 10న ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందారు. ఆమెకు కరోనావైరస్ లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో వైరస్ పరీక్షలు నిర్వహించారు. ఏప్రిల్ 13న ఆమెకు కరోనా పాజిటివ్ అని నిర్ధరణ అయింది.
దాంతో, వైద్య అధికారులు అప్రమత్తమై ఆ మహిళ కుటుంబ సభ్యులకు, వారితో కాంటాక్ట్లోకి వచ్చిన వారికి కలిపి మొత్తం 41 మందికి పరీక్షలు నిర్వహించారు. వారిలో 17 మందికి కోవిడ్ వ్యాధి ఉన్నట్లు నిర్ధరణ అయిందని అధికారులు తెలిపారు. వారందరినీ గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన 24 మందిని కూడా ప్రభుత్వ నిజామియా హాస్పిటల్లో క్వారెంటైన్కు తరలించారు.

మరణించిన మహిళా వయసు దాదాపు 60 ఏళ్ళు. గుండెకు సంబధించిన సమస్యతో ఆమెను ఏప్రిల్ 9న నాంపల్లి లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చేర్పించారు. అక్కడి నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకువెళ్ళారు. గాంధీ ఆస్పత్రి ప్రస్తుతం కరోనావైరస్ చికిత్సకు కేంద్రంగా మారడంతో, అక్కడి నుంచి ఆ మహిళను కింగ్ కోఠి హాస్పిటల్కు తరలించారు. అక్కడి వైద్యులు ఆమెకు దాదాపు నాలుగు గంటల పాటు చికిత్స అందించారు. పరిస్థితి క్రిటికల్గా మారటంతో, అక్కడి నుంచి ఉస్మానియా హాస్పిటల్కు పంపారు.
ఉస్మానియాలో కూడా కొన్ని గంటల సేపు చికిత్స చేశారు. అయితే, ఆ సమయంలో అక్కడ వెంటిలేటర్ అందుబాటులో లేనందున ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకువెళ్ళాలని డాక్టర్లు ఆ కుటుంబానికి సూచించారని అధికారులు తెలిపారు.
దాంతో, అక్కడి నుంచి ఒక ప్రైవేట్ హాస్పిటల్కు ఆమెను తరలించారు. అక్కడ ఆమె పరిస్తితి విషమించడంతో వైద్యులు కరోనావైరస్ పరీక్షలు నిర్వహించారు. ఇంతలోనే ఆ మహిళ మరణించారు. మరుసటి రోజు టెస్ట్ ఫలితాలు వచ్చాయి. ఆమెకు కోవిడ్ సోకిందని వైద్యులు ధ్రువీకరించడంతో అధికారులు మిగతా కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించారు.

- కరోనావైరస్ గురించి ఇంకా మనకెవరికీ తెలియని 9 విషయాలు..
- కరోనావైరస్- మీరు తప్పక తెలుసుకోవాల్సిన విషయాలు
- కరోనావైరస్ ఇన్ఫెక్షన్ సోకకుండా ఉండడానికి పాటించాల్సిన జాగ్రత్తలు... ఆరు మ్యాపుల్లో
- కరోనావైరస్ సోకితే చనిపోయే ఆస్కారం ఎంత?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
- కరోనావైరస్; ఎండ వేడి ఎక్కువగా ఉంటే వైరస్ నశిస్తుందా?

అంతేకాకుండా, ఆమెకు చివరగా చికిత్స అందించిన ప్రైవేట్ హాస్పిటల్ వైద్యులు, సిబ్బందికి కూడా కోవిడ్ పరీక్షలు నిర్వహించారు. వాటి వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు.
అయితే, ఆ మహిళకు వైరస్ ఎలా సోకిందన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తెలంగాణలో ఒకే కుటుంబంలో ఇంత మందికి వైరస్ సోకడం ఇదే మొదటిసారి. వీరిలో ఒక 10 నెలల శిశువు నుంచి 12 ఏళ్ళ లోపు పిల్లలు ఆరుగురు ఉన్నట్లు సమాచారం.
తెలంగాణ లో సోమవారం, ఏప్రిల్ 13 న ఒక్క రోజే 61 కేసులు, ఏప్రిల్ 14 52 కేసులు నమోదయ్యాయి. హైదరాబాద్ నగరంలో అత్యధికంగా 249 కేసులు ఉన్నాయి. హైదరాబాద్ పరిధిని 17 కంటైన్మెంట్ జోన్లగా విభజించి ప్రతి జోన్ను ప్రత్యేక అధికారుల నిఘాలో పెట్టాలని ముఖ్యమంత్రి అదేశించారు.

కరోనావైరస్ హెల్ప్లైన్ నంబర్లు: కేంద్ర ప్రభుత్వం - 01123978046, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ - 104


ఇవి కూడా చదవండి:
- కరోనావైరస్:నిరుపేద ముస్లింల పాలిట ఫేక్ న్యూస్ ఎలా శాపమవుతోంది
- కరోనావైరస్: లాక్డౌన్ సమయంలో మద్యం ప్రియులు ఏం చేయాలి?
- కరోనావైరస్-నిరుద్యోగం: ఉద్యోగం పోతే ఎలా? ఈ ఆందోళనను ఎలా ఎదుర్కోవాలి?
- కరోనావైరస్ 2005లో వస్తే ఏం జరిగి ఉండేది?
- వేడి నీళ్లు, పానీయాలు కోవిడ్-19 బారి నుంచి రక్షిస్తాయా?
- కరోనావైరస్కు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుంది... దాన్ని ఎలా తయారు చేస్తారు?
- కరోనా వైరస్: ఈ ప్రపంచాన్ని నాశనం చేసే మహమ్మారి ఇదేనా
- కరోనావైరస్: సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని ఎలా గుర్తించాలి?
- కరోనావైరస్: ఒకసారి వైరస్ నుంచి కోలుకున్న తర్వాత మళ్లీ వస్తుందా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








