సీబీఐ కస్డడీకి చిదంబరం.. ఆగస్టు 26 వరకు అదుపులోనే.. కుటుంబసభ్యులు, లాయర్లను కలిసేందుకు రోజుకు 30 నిమిషాలే సమయం

ఫొటో సోర్స్, Getty Images
కేంద్ర ఆర్థికశాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరాన్ని సీబీఐ కోర్టు ఎదుట హాజరుపరిచారు.
చిదంబరంను 5 రోజుల రిమాండ్కు అప్పగించాలన్న సీబీఐ అభ్యర్థించగా అందుకు అంగీకరిస్తూ కోర్టు ఆయన్ను ఆగస్టు 26 వరకు సీబీఐ కస్టడీకి అప్పగించింది.
కస్టడీలో ఉన్నప్పుడు చిదంబరం రోజులో అరగంట పాటు కుటుంబసభ్యులు, న్యాయవాదులను కలిసేందుకు అనుమతిస్తారు.
కేసులోని వాస్తవాలన్నీ పరిశీలించిన తరువాత కస్టడీ సముచితమేనని స్పెషల్ సీబీఐ జడ్జి ఏకే కుహర్ తన ఆదేశాల్లో పేర్కొన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 1
చిదంబరాన్ని కోర్టులో ప్రవేశపెట్టేందుకు తీసుకురాగా.. ఆయన భార్య నళిని చిదంబరం, కుమారుడు కార్తీ చిదంబరం కూడా అక్కడికి చేరుకున్నారు. కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ మను సింఘ్వి సైతం సీబీఐ కోర్టుకు వచ్చారు. వీరిద్దరూ ఈ కేసులో చిదంబరం తరఫున వాదనలు వినిపించారు.
చిదంబరాన్ని కోర్టుకు తీసుకెళ్లే సమయంలో సీబీఐ ప్రధాన కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు.
ఐఎన్ఎక్స్ మీడియాలో సీబీఐ తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ చిదరంబరం విచారణకు సహకరించడం లేదని, ఆయన్ను 5 రోజులు సీబీఐ కస్టడీకి అప్పగించాలని కోర్టును కోరారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 2
చిదంబరం తరఫు న్యాయవాది కపిల్ సిబల్ ‘‘ఈ కేసులో నిందితులు కార్తీ చిదంబరం, పీటర్, ఇంద్రాణీ ముఖర్జీలు ఇప్పటికే బెయిలుపై ఉన్నారు’’ అన్నారు.
ఆయన్ను అరెస్టు చేసిన రోజు రాత్రే విచారించాలని సీబీఐ చెప్పిందని.. కానీ, రాత్రి 12 వరకు విచారణ ప్రారంభించలేదని, కేవలం 12 ప్రశ్నలు అడిగారని కోర్టుకు చెప్పారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది, 3
ఐఎన్ఎక్స్ మీడియా కేసులో సీబీఐ బుధవారం రాత్రి ఆయన్ను అరెస్టు చేసింది.
అయితే, తన అరెస్టు రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమని చిదంబరం ఆరోపించారు.
అరెస్టవ్వడానికి ముందు బుధవారం రాత్రి ఆయన దిల్లీలోని కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో విలేఖరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు.
ఈ కేసులో తనపైగానీ, తన కుటుంబ సభ్యులపైగానీ ఎలాంటి నేరాభియోగమూ లేదని అన్నారు. ఈడీ, సీబీఐగాని కోర్టులో అభియోగపత్రం దాఖలు చేయలేదని చెప్పారు.
కాగా సీబీఐ, ఈడీ చిదంబరంపై ఇప్పటికే లుక్ ఔట్ నోటీసు జారీచేశాయని ఏఎన్ఐ తెలిపింది.
అంతకుముందు బుధవారం ఉదయం ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టు నుంచి తప్పించుకోవడానికి సుప్రీంకోర్టును ఆశ్రయించిన చిదంబరానికి చుక్కెదురైంది. ఆయన పిటిషన్ను అత్యవసరంగా విచారించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు చెప్పింది.
అంతకుముందు రోజు దిల్లీ హైకోర్టు ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను తోసిపుచ్చడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ఫొటో సోర్స్, Ani
ఇప్పుడేం జరుగుతుంది...
గురువారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో చిదంబరాన్ని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టనుంది.
శుక్రవారం సుప్రీం కోర్టు చిదంబరం ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ జరపాల్సి ఉంది. అయితే, ఇప్పడు ఆయన అధికారికంగా అరెస్టైనందున ఇప్పుడు ఆ పిటిషన్కు విలువ లేదు.
చిదంబరాన్ని విచారించాల్సి ఉన్నందున, ఆయన్ను తమ కస్టడీకి ఇవ్వాలని ప్రత్యేక కోర్టు ముందు సీబీఐ విన్నవిస్తుంది.
మరోవైపు చిదంబరం అదే న్యాయస్థానాన్ని బెయిల్ కోసం అభ్యర్థిస్తారు. ఒకవేళ కోర్టు బెయిల్ మంజూరు చేస్తే ఆయన వెంటనే విడుదల అవుతారు.
బెయిల్ రాకపోతే చిదంబరం తరఫు న్యాయవాదులు దిల్లీ హైకోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. ఇదివరకు ముందస్తు బెయిల్ కోసం చిదంబరం చేసుకున్న అభ్యర్థనను ఆ కోర్టు తోసిపుచ్చింది.

ఫొటో సోర్స్, Getty Images
అసలు కేసు ఏంటి..
ఐఎన్ఎక్స్ మీడియా సంస్థపై 2017 మే 15న సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఐఎన్ఎక్స్ మీడియా, ఐఎన్ఎక్స్ ప్రెస్, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం, ఆయన ఆధ్వర్యంలో పనిచేసే చెస్ మేనేజ్మెంట్ సర్వీసెస్, కేంద్ర ఆర్థిక శాఖ అధికారులు, మరికొందరు గుర్తు తెలియని వ్యక్తులను ఇందులో నిందితులుగా సీబీఐ పేర్కొంది. అయితే, ఈ ఎఫ్ఐఆర్లో చిదంబరం పేరు లేదు.
సీబీఐ ఎఫ్ఐఆర్లో పొందుపరిచిన వివరాల ప్రకారం ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ తన వ్యాపారాన్ని మరింత విస్తరించేందుకు విదేశీ పెట్టుబడులు తీసుకోవాలని భావించింది. ఇందుకోసం ఫారెన్ ఇన్వెస్టిమెంట్ ప్రమోషన్ బోర్డ్ (ఎఫ్ఐపీబీ) అనుమతి కోరింది.
ఒక్కో షేర్ను 10 రూపాయల ముఖ విలువతో జారీ చేస్తామని పేర్కొంది. దీంతో ఐఎన్ఎక్స్ మీడియాలోకి రూ.4 కోట్ల 62 లక్షల విదేశీ పెట్టుబడులకు ఎఫ్ఐపీబీ అనుమతి ఇచ్చింది.

ఫొటో సోర్స్, Reuters
అదే సమయంలో ఐఎన్ఎక్స్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలోకి డౌన్స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్కి విడిగా అనుమతి తీసుకోవాలని ఎఫ్ఐపీబీ స్పష్టంగా చెప్పింది. ఎఫ్ఐపీబీ సిఫార్సుతో ఐఎన్ఎక్స్ మీడియా సంస్థ దరఖాస్తుకు ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.
అయితే, ఐఎన్ఎక్స్ మీడియా ఉద్దేశపూర్వకంగానే నిబంధనలు ఉల్లంఘించి, ఐఎన్ఎక్స్ న్యూస్ సంస్థలో 26శాతం డౌన్స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్ చేసిందని సీబీఐ తన ఎఫ్ఐఆర్లో పేర్కొంది.
డౌన్స్ట్రీమ్ ఇన్వెస్ట్మెంట్ కోసం ఎఫ్ఐపీబీ నుంచి ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉన్నా.. ఐఎన్ఎక్స్ మీడియా ఆ పని చేయలేదు. రూ.4 కోట్ల 62 లక్షలకు విదేశీ పెట్టుబడులకు ఎఫ్ఐపీబీ అనుమతివ్వగా.. రూ.305 కోట్లకుపైగా ఎఫ్బీఐలను సేకరించింది.
విదేశీ పెట్టుబడిదారులకు ఒక్కో షేర్ను 10 రూపాయలకు కేటాయించాల్సి ఉండగా.. 800 రూపాయలకు ఒక షేర్ జారీ చేసింది.

ఫొటో సోర్స్, KARTI P CHIDAMBARAM FACEBOOK
కార్తీ చిదంబరంపై ఆరోపణలు
ఐఎన్ఎక్స్ మీడియాపై జరగబోయే దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నించారని కార్తీ చిదంబరంపై ఆరోపణలు వచ్చాయి. కార్తీ డబ్బులు డిమాండ్ చేశారని ఐఎన్ఎక్స్ మీడియా మాజీ డైరెక్టర్ ఇంద్రాణీ ముఖర్జీ తమకు చెప్పారని సీబీఐ చెబుతోంది.
ఈ ఒప్పందం దిల్లీలోని ఒక ఫైవ్ స్టార్ హోటల్లో జరిగిందని దర్యాప్తు ఏజెన్సీ చెబుతోంది. ఇంద్రాణీ ముఖర్జీని ఈడీ విచారించినప్పుడు చిదంబరం పేరు బయటకు వచ్చింది.
2018లో ఈడీ మనీ లాండరింగ్ కేసు కూడా నమోదు చేసింది. అప్పడు ఆర్థికమంత్రిగా ఉన్న చిదంబరం ఇంద్రాణీ ముఖర్జీకి సాయం చేయమని కార్తీ చిదంబరానికి చెప్పారని ఈడీ తన చార్జీషీట్లో పేర్కొందని టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం రాసింది.
ఇవి కూడా చదవండి:
- చిదంబరం అరెస్ట్: విచారణ కోసం సీబీఐ ప్రధాన కార్యాలయానికి తరలింపు
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- శాండ్విచ్ ఆలస్యంగా తీసుకొచ్చాడని హత్య చేసేశాడు
- చిదంబరం: కాంగ్రెస్ ఆర్థికవేత్త రాజకీయ జీవితంలో ఉత్థాన పతనాలు
- భారతదేశంలో ‘సాక్షి’గా ఉండడం ఎందుకంత ప్రమాదకరం?
- అనంతపురం వైరల్ వీడియో: గ్రామ పెద్ద బాలికను కొట్టిన ఘటనలో ఏం జరిగింది
- చిదంబరంపై వచ్చిన ఆరోపణలేంటి.. ఐఎన్ఎక్స్ మీడియా కేసు పూర్తి కథేమిటి
- ఏపీ రాజధాని అమరావతిపై బీబీసీతో బొత్స ఏమన్నారంటే...
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









