టీఆర్ఎస్ మేనిఫెస్టో: ఏ వర్గాలకు ఏం ప్రకటించారు?

తెలంగాణ ఎన్నికలు

ఫొటో సోర్స్, kcr/fb

ఈ నెల ఏడున తెలంగాణ ఎన్నికల పోలింగ్ జరుగనున్న నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఆదివారం 24 అంశాలతో మేనిఫెస్టోను విడుదల చేసింది. అందులోని ముఖ్యమైన హామీలు..

  • అన్నిరకాల ఆసరా పెన్షన్లు 1000-2,016 రూపాయల వరకు పెంపు. వికలాంగుల పెన్షన్లు 1500 నుంచి 3,016 రూపాయాల వరకు పెంపు. బీడీ కార్మికుల పీఎఫ్ కటాఫ్ డేట్‌ను 2018వరకు పొడిగింపు.
  • వృద్దాప్య పెన్షన్ అర్హత వయసును 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు.
  • నిరుద్యోగ సోదరులకు నెలకు 3,016 రూపాయల భృతి.
  • ప్రస్తుత పద్దతిలో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం కొనసాగిస్తూనే, సొంతస్థలం ఉన్న అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూం ఇంటి నిర్మాణం కోసం 5లక్షల నుంచి 6లక్షల రూపాయల వరకు అందించడం జరుగుతుంది.
  • రైతుబంధు కింద ఏడాదికి ఎకరాకు అందిస్తున్న సాయం 8వేల నుంచి 10 వేల రూపాయలకు పెంపు.
  • రైతులకు 1లక్ష వరకున్న పంట రుణాల మాఫీ.
  • రైతు సమన్వయ సమితి సభ్యులకు గౌరవ భృతి.
  • ఎస్సీ, ఎస్టీ వర్గాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రత్యేక పథకాలు రూపొందించేందుకు నియమించిన కమిటీ ఇచ్చే నివేదిక అమలు.
  • చట్టసభల్లో బీసీలకు 33%, మహిళలకు 33% రిజర్వేషన్ అమలుకు పోరాటం.
  • ఎస్టీలకు 12%, మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ తీర్మనం చేసింది. ఈ రిజర్వేషన్లు అమలుకు కేంద్రంతో రాజీలేని పోరాటం.
  • ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీ తీర్మానం చేసి, కేంద్రానికి పంపడం జరిగింది. కేంద్రం నుంచి ఆమోదం రావడం కోసం టీఆర్ఎస్ పోరాటం చేస్తుంది.
  • వివిధ కులాల కేటగిరీ మార్పు కోసం వచ్చిన విజ్ఞాపనలను సానుభూతితో పరిశీలిస్తుంది.
  • రెడ్డి కార్పొరేషన్, వైశ్య కార్పొరేషన్‌తోపాటు ఆర్థికంగా వెనుకబడిన ఇతర వర్గాల సంక్షేమం కోసం కార్పొరేషన్ల ఏర్పాటు.
  • వివిధ సామాజిక వర్గాల నుంచి కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలని వచ్చిన డిమాండ్లను రాబోయే టీఆర్ఎస్ ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తుంది.
  • అగ్రకులాల్లోని పేదల అభ్యున్నతి కోసం ప్రత్యేక పథకాలు ప్రవేశ పెట్టడం జరుగుతుంది.
  • రాష్ట్రవ్యాప్తంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు. ఐకేపీ ఉద్యోగులను పర్మినెంటు చేసి, ఈ యూనిట్ల నిర్వహణ బాధ్యతను మహిళా సంఘాలతో కలిపి ఐకేపీ ఉద్యోగులకు అప్పగింత. ఈ యూనిట్ల ఆహార పదార్థాలు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రజలకు అందుబాటులోకి.
  • కంటివెలుగు పథకం తరహాలోనే ప్రజలందరికీ ఇతర ఆరోగ్య పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా వైద్య శిబిరాలను ఏర్పాటు. ప్రతీ వ్యక్తి హెల్త్ ప్రొఫైల్.
  • ప్రభుత్వ ఉద్యోగులకు సబబైన, సముచితమైన రీతిలో వేతన సవరణ.
  • ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయసును 58 నుంచి 61 సంవత్సరాలకు పెంపు. దీనికి సమాంతరంగా నిరుద్యోగులకు ఎక్కువ అవకాశాలు కల్పించడం కోసం ఉద్యోగాల నియామక వయో పరిమితిని మూడేళ్లు పెంపు.
  • పెన్షనర్ల కోసం ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు.
  • అటవీ ప్రాంతాల్లోని గిరిజన, గిరిజనేతర రైతుల భూ వివాదాలను పరిష్కరించి, యాజమాన్య హక్కులు కల్పన. పోడు భూముల విషయంలో నెలకొన్న వివాదాలను త్వరితగతిన పరిష్కారం. వారికి ఇతర రైతులకు అందిస్తున్న ప్రయోజనాల వర్తింపు.
  • బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ స్థాపించడానికి చర్యలు.
  • సింగరేణి భూముల్లో ఇండ్లు కట్టుకున్నవారికి పట్టాలు.
  • హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే ప్రయత్నాలు మరింత ముమ్మరం.
పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)