ఏనుగులు తగలబడుతున్నప్పుడు తీసిన ఫొటోకు అంతర్జాతీయ అవార్డు

తారు బాల్స్‌ను తగులబెట్టి ఏనుగులపై విసరడంతో అవి ఇలా పరుగెడుతున్నాయి

ఫొటో సోర్స్, Biplab Hazra/Sanctuary Wildlife Photography Awards

ఫొటో క్యాప్షన్, తారు బాల్స్‌ను తగులబెట్టి ఏనుగులపై విసరడంతో అవి ఇలా పరుగెడుతున్నాయి

కొందరు రెండు ఏనుగులను తగులబెట్టిన చిత్రాలు వైల్డ్ లైఫ్ ఫొటోగ్రఫీ పోటీల్లో టాప్‌లో నిలిచాయి. పైన మీరు చూస్తోంది అందులో ఒకటి.

(హెచ్చరిక: ఈ ఘటనకు సంబంధించిన మరో చిత్రం కింద ఉంది. అది మిమ్మల్ని బాధపెట్టొచ్చు.)

తూర్పు భారత్‌లో ఓ గున్న ఏనుగు, పెద్ద ఏనుగును కొందరు గుంపు తగులబెట్టగా బిప్లాబ్ హజ్రా అనే ఫొటో గ్రాఫర్ ఆ చిత్రాలను తన కెమెరాలో బంధించారు.

ఈ చిత్రాలను శాంక్చురీ మేగజీన్ ఉత్తమ చిత్రాలుగా ఎంపిక చేసింది. ఏనుగులపై ఇక్కడ ఇలాంటి దాడులు సర్వసాధారణమేనని పేర్కొంది.

మనుషులు.. మదగజాల మధ్య నిత్యం పోరు జరిగే పశ్చిమ బెంగాల్లోని బంకురా జిల్లాలో ఈ ఫొటోలు తీశారు.

అయితే అక్కడ అసలు ఏం జరిగిందో మాత్రం ఇప్పటికీ స్పష్టత లేదు.

ఈ జిల్లాలో ఏనుగుల దాడిలో మనుషులు చనిపోయారంటూ నిత్యం వార్తలు వస్తుంంటాయి.

రెండు ఏనుగులను తగులబెట్టిన దృశ్యం

ఫొటో సోర్స్, Biplab Hazra/Sanctuary Wildlife Photography Awards

ఫొటో క్యాప్షన్, అవార్డు పొందిన చిత్రాల్లో ఇదొకటి

ఈ ఫొటో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

బంకురాలో ఉండే మాణిక్ మజుందార్ మట్లాడుతూ.. ఈ జీవ విధ్వంసానికి స్థానికులదే బాధ్యతని వ్యాఖ్యానించారు.

అయితే ఏనుగులు కూడా ఇక్కడ నిత్యం పంటలు నాశనం చేస్తూ.. విధ్వంసం సృష్టిస్తూ ప్రజలను భయ భ్రాంతులకు గురి చేస్తుంటాయని తెలిపారు.

వీడియో క్యాప్షన్, మనుగడకై మనుషులతో గజరాజుల పోరు

మా ఇతర కథనాలు:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)