పవన్ కల్యాణ్: ప్రధాని నరేంద్ర మోదీ సభలో జనసేన అధ్యక్షుడు ఏం మాట్లాడారంటే....

తెలుగురాష్ట్రాల పరిస్థితిని చూస్తే ఐదేళ్ళకోసారి ఎన్నికలన్నట్టుగా కాకుండా, ఐదు సంవత్సరాలూ ఎన్నికలే అన్నట్టుగా ఉందని జనసేనాని పవన్ కల్యాణ్ అన్నారు.

ఇలాంటి వాతావరణంలో ఘర్షణే తప్ప నిజమైన అభివృద్ధి కనిపించదన్నారు. తెలంగాణ భాగవతం పుట్టిన నేల అని, ఇక్కడ బతుకు భారం కాకూడదని, మోదీ నేతృత్వంలో బీసీల తెలంగాణ రావాలి, సామాజిక తెలంగాణ నిలదొక్కుకోవాలన్నారు.

తెలంగాణలో బీసీలు ముఖ్యమంత్రి కావాలన్న పవన్ కల్యాణ్, ఇందుకోసం బీజేపీకి, మోదీకి జనసేన సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్‌ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)