దిల్లీ అల్లర్లకు అయిదేళ్లు: బాధిత కుటుంబాలు ఏమంటున్నాయి?
- రచయిత, ఉమంగ్ పొద్దార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
న్యూదిల్లీలో మతపరమైన అల్లర్లు జరిగి అయిదేళ్లు గడిచాయి. ఈలోగా ఈ అల్లర్లకు సంబంధించిన 80 శాతానికి పైగా కేసుల్లో పలువురు నిర్దోషులుగా బయటకు వచ్చారు.
2020లో దిల్లీలో జరిగిన మతపరమైన హింస, గత 30 ఏళ్ల కాలంలో దేశ రాజధానిలో సంభవించిన అత్యంత దారుణమైన అల్లర్లుగా నిలిచాయి.
ఆ ఏడాది ఫిబ్రవరిలో నాలుగు రోజుల పాటు సాగిన ఈ అల్లర్లలో 53 మంది చనిపోయారు. అల్లర్లలో వందల మంది గాయపడ్డారు. అనేక ఇళ్లు, దుకాణాలు తగులబడ్డాయి. వీటికి సంబంధించి పోలీసులు 758 కేసులు నమోదు చేసి, రెండు వేల మందికి పైగా అరెస్ట్ చేశారు.
2020 దిల్లీ అల్లర్ల కేసులో పోలీసుల దర్యాప్తుపై కోర్టు పలు ప్రశ్నలు లేవనెత్తింది. ఈ క్రమంలో బీబీసీ ఇన్వెస్టిగేషన్ రిపోర్టులో వెలుగులోకి వచ్చిన వాస్తవాలేంటో ఈ వీడియోలో చూద్దాం..


(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









