4600 ఏళ్ల పురాతన పడవ, బంగారంతో చేసిన సమాధి ఇంకా ఎన్నో...
ఈజిప్ట్లోని గీజా గ్రేట్ పిరమిడ్ దగ్గర నిర్మించిన గ్రాండ్ ఈజిప్షియన్ మ్యూజియం ఇది. ఇప్పుడు దీనిని ప్రజల సందర్శనార్థం తెరిచారు.
ఈ మ్యూజియం 120 ఎకరాల్లో ఉంది. ఇందులో 70 వేల నుంచి లక్ష వరకూ పురాతన అవశేషాలను ప్రదర్శిస్తారు. వాటిలో ఫారో టుటెన్ఖమెన్ సమాధిలో లభించినదీ, ఇప్పటివరకూ ఎవరూ చూడని సంపదా ఇందులో ఉన్నాయి.
ఈ మ్యూజియం గురించి 2002లో ప్రకటించారు. దీనిని 2012లో ప్రారంభించాలని అనుకున్నారు. కానీ వ్యయం పెరగడం, రాజకీయ అస్థిరత, కోవిడ్ 19, ప్రాంతీయ ఘర్షణ వల్ల దీనిని పదే పదే వాయిదా వేస్తూ వచ్చారు.
దాదాపు 1.2 బిలియన్ డాలర్ల వ్యయంతో నిర్మించిన ఈ భారీ ప్రాజెక్టులో ఎక్కువ భాగం జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ రుణాలతో పూర్తయ్యింది.

ఫొటో సోర్స్, Reuters
(బీబీసీ కోసం కలెక్టివ్ న్యూస్రూమ్ ప్రచురణ)
(బీబీసీ తెలుగును వాట్సాప్,ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)









