రాజధాని నిర్మాణానికి 2.3 లక్షల కోట్లు... కొత్త ప్రాంతాన్ని ప్రకటించిన ఇండోనేషియా దేశాధ్యక్షుడు

ఫొటో సోర్స్, EPA
ఇండోనేషియా రాజధానిని బోర్నియో ద్వీపంలోని తూర్పు కాళీమంటన్ ప్రావిన్స్కు మార్చనున్నట్లు దేశాధ్యక్షుడు జోకో విడోడో తెలిపారు.
ప్రస్తుతం రాజధానిగా ఉన్న జకర్తా జనాభా కోటికి పైగా ఉంది. ఈ నగరం లోతట్టు ప్రాంతంలో ఉండటంతో నీట మునుగుతోంది.
నగరంలోని చాలా ప్రాంతాలు ఏటా 25 సెం.మీ. వరకు మునిగిపోతున్నాయి. దాదాపు సగం నగరం ఇప్పుడు సముద్ర మట్టానికి దిగువన ఉంది.
ప్రస్తుతం రాజధానిగా ప్రకటించిన బోర్నియా ద్వీపంలోని రెండు ప్రాంతాలు కుటాయ్ కెర్తనేగర, పెనాజమ్ పేసర్ ఉతారా ఇంకా అభివృద్ధి చెందలేదు.
''రాజధానిగా ఎంచుకున్న ప్రాంతం చాలా వ్యూహాత్మకమైంది. ఇండోనేషియాకు ఇది మధ్యభాగంలో ఉంటుంది. అలాగే, నగర ప్రాంతానికి దగ్గర'' అని అధ్యక్షుడు విడోడో తన టెలివిజన్ ప్రసంగంలో చెప్పారు.
''పాలన, వ్యాపార లావాదేవీలు, ఆర్థికం, వాణిజ్యం, ఇతర సేవలకు కేంద్రంగా జకర్తా తీవ్రమైన భారాన్ని ఎదుర్కొంటుంది. కొత్తగా ఎంచుకున్న రాజధాని ప్రాంతంలో ప్రకృతి వైపరిత్యాలు వచ్చే అవకాశం తక్కువ'' అని పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
రాజధాని మార్పునకు సంబంధింన ఈ ప్రతిష్టాత్మక పథకానికి దాదాపు 2.3 లక్షల కోట్లు ఖర్చు అవుతుందని అంచనా. జకర్తాలో ట్రాఫిక్ సమస్య వల్ల ఆర్థికరంగంపై ఏడాదికి 1.47 వేల కోట్ల భారం పడుతోందని ప్రణాళిక మంత్రి గతంలో చెప్పారు.
ఒరంగుటాన్ల సహజ ఆవాసాలకు సంబంధించిన అతికొద్ది ప్రదేశాలలో రాజధానిగా ఎంచుకున్న కాళీమంటన్ ప్రాంతం ఒకటి కావడంతో పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
రాజధానిగా మార్చడం వల్ల అక్కడున్న అరుదైన జాతులు అంతరించే ప్రమాదం ఉందని అంటున్నారు.
''కొత్త రాజధాని ప్రాంతం సహజ రక్షిత ఆవాసంలో నిర్మించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి'' అని ఇండోనేషియా గ్రీన్పీస్ ప్రచారకుడు జాస్మిన్ పుత్రి అన్నారు.
కాళీమంటన్ ప్రాంతం కార్చిచ్చుకు కేంద్రంగా ఉంది. 2015 నుంచి దేశంలో కార్చిచ్చు ప్రమాదాలు ఆందోళన కలిగించే స్థాయికి పెరిగాయి.
ప్రభుత్వం గత రెండు దశాబ్దాలుగా వికేంద్రీకరణ చర్యలు చేపడుతూనే ఉంది. మున్సిపాలటీలకు ఆర్థిక, రాజకీయ అధికారాలను కలిగించేందుకు భారీ కార్యక్రమాలు చేపట్టింది.
ఇండోనేషియానే కాదు గతంలో చాలా దేశాలు వివిధ కారణాలతో తమ రాజధాని నగరాలను మార్చాయి. బ్రెజిల్, పాకిస్తాన్, నైజీరియాలు రాజధాని ప్రాంతాలను మార్చాయి.
ఇవి కూడా చదవండి:
- మనసు కశ్మీర్లో.. మనుగడ లేహ్లో
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- ప్రభుత్వ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణతో నిరుద్యోగం మరింత పెరుగుతుందా
- "ఇంటి నుంచి ఆస్పత్రికి రాలేం.. ఆస్పత్రి నుంచి ఇంటికి వెళ్లలేం"
- "కశ్మీర్ పరిస్థితి ఏ రాష్ట్రానికైనా రావొచ్చు.. కేంద్రం చర్యకు ప్రతిఘటన కొరవడటం ఆందోళనకరం"
- పాకిస్తాన్తో చర్చలంటూ జరిగితే 'పీవోకే'పైనే: రాజ్నాథ్ సింగ్
- కేరళ వరదలు: ‘హత్తుకొని పడుకునే వారు.. హత్తుకొనే ప్రాణాలొదిలారు’
- ప్రపంచంలోనే అత్యంత అందమైన ఈ నగరం 70 ఏళ్లకే అంతరించింది
- ఉత్తర, దక్షిణ కొరియాల్లాగా భారత్-పాకిస్తాన్ దగ్గరవడం సాధ్యమేనా?
- 1971లో భారత్పై పాకిస్తాన్ దాడి చేయబోతోందన్న విషయం RAW కి ముందే ఎలా తెలిసింది?
- గుండెజబ్బు నివారణకు నాలుగు ఔషధాలున్న ఒకే మాత్ర
- అంబేడ్కర్ హౌస్: ఇద్దరు వ్యక్తుల ఫిర్యాదుతో లండన్లోని అంబేడ్కర్ ‘మ్యూజియం’... భవిష్యత్ ప్రశ్నార్థకం
- ఆసియాలోనూ సైనిక సూపర్ పవర్ అమెరికానేనా?
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








