అమెరికా మళ్లీ ఆగిపోయింది

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాలో మరోసారి ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి. నిర్ణీత గడువులోగా ద్రవ్య వినిమయ బిల్లు కాంగ్రెస్లో ఆమోదం పొందకపోవడంతో ఈ పరిస్థితులు తలెత్తాయి.
ఇలా ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోవడం మూడు వారాల్లో ఇది రెండోసారి.
రెండేళ్ల వరకు నిధుల వినియోగానికి ప్రభుత్వానికి వీలు కల్పించే ఈ బిల్లు గురువారం అర్ధరాత్రిలోగా ఉభయసభల్లో ఆమోదం పొందాల్సి ఉంది.
అయితే, ఖర్చులపై పరిమితి విధించేందుకు తాను ప్రవేశపెట్టిన సవరణపై చర్చించాలంటూ రిపబ్లికన్ సెనేటర్ రాండ్ పాల్ పట్టుబట్టారు. దాంతో సెనేట్లో బిల్లుపై ఓటింగ్ ఆగిపోయింది.
సెనేట్ ఆమోదించిన తర్వాత మాత్రమే ఆ బిల్లుపై హౌజ్ ఆఫ్ రిప్రెజెంటేటివ్స్లో ఓటింగ్ జరిగే వీలుంటుంది.
శుక్రవారం ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఇలాంటి పరిస్థితే జనవరిలోనూ తలెత్తింది. అప్పుడు మూడు రోజుల పాటు ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోయాయి.
ఇవి కూడా చూడండి:
- అమెరికాలో నిలిచిపోయిన ట్రంప్ ప్రభుత్వ సేవలు
- ప్రపంచాన్ని ట్రంప్ మరింత ప్రమాదంలోకి నెట్టేశారా?
- 'నాకు ‘ఖత్నా’ చేశారు.. నా కూతురికి అలా జరగనివ్వను!'
- గూగుల్ రహస్యాలను ‘దొంగిలించిన’ ఉబర్.. కోర్టుకెక్కిన గొడవ
- బెంగళూరు సహా ఈ 11 నగరాల్లో నీటికి కటకటే!
- 1988లో భారత సైన్యం మాల్దీవులలో అడుగు పెట్టినపుడు ఏం జరిగింది?
- (బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








