You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'జై సింహా'లో బాలకృష్ణ కారెత్తడంపై ఆనంద్ మహీంద్రా ఏమన్నారు?
సంక్రాంతి సందర్భంగా బాలకృష్ణ నటించిన 'జై సింహా' సినిమా విడుదలైంది. అందులో ఓ సన్నివేశంలో బాలకృష్ణ ఒంటిచేత్తో మహీంద్రా సంస్థకు చెందిన బొలెరో వాహనాన్ని ఎత్తుతూ కనిపిస్తారు.
ఆ సన్నివేశాన్ని విష్ణు చైతన్య అనే వ్యక్తి 'మహీంద్రా గ్రూప్' ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా దృష్టికి తీసుకెళ్లారు.
'సర్, దీన్ని చూడండి. ఈ దృశ్యాన్ని మీరు మీ కలెక్షన్లో భద్రపరచుకోవాల్సిందే. తెలుగు రాష్ట్రాల్లో #Bolero ట్రెండింగ్లో ఉంది' అంటూ @Chay_Vishnu అనే వ్యక్తి ట్వీట్ చేశారు.
ఆ ట్వీట్కు ఆనంద్ మహీంద్రా కూడా ఆసక్తికరంగా బదులిచ్చారు.
'హహా..ఇక మా వర్క్ షాపులకు హైడ్రాలిక్ లిఫ్టులతో అవసరం లేదు. వాటి సాయం లేకుండానే బొలెరో వాహనాల్ని పరీక్షించొచ్చు' అంటూ ఓ సరదా ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి)