ఎన్టీ రామారావు గురించి ఈ విషయాలు మీకు తెలుసా

వీడియో క్యాప్షన్, ఎన్టీ రామారావు గురించి ఈ విషయాలు మీకు తెలుసా

1923 మే 28వ తేదీన కృష్ణా జిల్లాలోని గుడివాడ దగ్గర ఒక కుగ్రామమైన నిమ్మకూరులో వెంకటేశ్వరమ్మ, లక్ష్మయ్యలకు ఎన్‌టీఆర్‌ జన్మించారు. అయితే.. లక్ష్మయ్య సోదరుడు రామయ్య, చంద్రమ్మ దంపతులకు పిల్లలు లేకపోవటంతో వారికి ఎన్‌టీఆర్‌ని దత్తత ఇచ్చారు.

ఎన్‌టీఆర్ ఐదో తరగతి వరకూ ఆ ఊర్లోనే చదువుకున్నారు. అక్కడ హైస్కూల్ లేకపోవటంతో రామయ్య దంపతులు తమ దత్తపుత్రుడితో కలిసి విజయవాడకు నివాసం వచ్చారు. అక్కడ మునిసిపల్ స్కూల్‌లో చేరిన ఎన్‌టీఆర్ మెట్రిక్యులేషన్ పూర్తిచేశారు.

అనంతరం 1940లో విజయవాడలోని ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో ఇంటర్మీడియట్ కోర్సులో చేరారు. ఇంటర్ చదివేటప్పుడు కుటుంబానికి చేదోడుగా సైకిల్ మీద తిరుగుతూ హోటళ్లకు పాలు పోశారనీ చెబుతారు.

ఆ కాలేజీలో తెలుగు శాఖాధిపతి ప్రఖ్యాత కవి విశ్వనాథ సత్యనారాయణ. 'కవి సామ్రాట్' బిరుదున్న విశ్వనాథ రాసిన 'రాచమల్లుని దౌత్యం' నాటకాన్ని కాలేజీలో ప్రదర్శించారు. ఆ రోజుల్లో ఆడపిల్లలు నాటకాలకు దూరంగా ఉండటంతో.. అందులో కథానాయిక పాత్ర ఎన్‌టీఆర్ పోషించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)