తెలంగాణ: పసిబిడ్డను సజీవ సమాధి చేసే ప్రయత్నం... అడ్డుకున్న పోలీసులు

- రచయిత, దీప్తి బత్తిని
- హోదా, బీబీసీ ప్రతినిధి
పోలీసుల జోక్యంతో ఓ పసిగుడ్డు ప్రాణం నిలిచింది. అయిదురోజుల పసికందును సమాధి చేయడానికి కొందరు ప్రయత్నించగా ఓ ఆటో డ్రైవర్ గమనించి పోలీసులకు సమాచారం అందించాడు.
అప్రమత్తమైన పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లి శిశువును సజీవ సమాధి కాకుండా కాపాడారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సికింద్రాబాద్ జూబ్లీ బస్స్టేషన్(జేబీఎస్)కు కూతవేటు దూరంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది.

ఫొటో సోర్స్, ugc
వీడియోలో ఏముంది?
ఆ వీడియోలో ఇద్దరు వ్యక్తులు ఓ శిశువును పాతిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇద్దరిలో మధ్య వయస్కుడైన వ్యక్తి దుప్పట్లో శిశువును పట్టుకున్నారు. మరొక వ్యక్తి గొయ్యి తీస్తుంటే పోలీసులు వారిని అడ్డుకొని ప్రశ్నిస్తున్నారు.
మధ్య వయస్కుడైన వ్యక్తి ఏడుస్తూ, "ఇది నా కొడుకు బిడ్డ. చనిపోయింది. ఆసుపత్రి నుంచి తీసుకొచ్చాం. ఆపరేషన్ విఫలమై మరణించింది. అందుకే శిశువును సమాధి చేస్తున్నాం" అని పోలీసులకు చెబుతున్నారు.
బిడ్డ మరణించిందని చెబుతున్నప్పటికీ ఆ వీడియోలో శిశువు కదలికలు కనిపిస్తున్నాయి.

పోలీసుల విచారణలో..
శిశువును సజీవ సమాధికి యత్నించిన వారిని వెస్ట్ మారేడ్పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా, వారంతా శిశువు బాబాయి, తాత, నానమ్మ అని, కరీంనగర్ జిల్లా సంకెపల్లి గ్రామం నుంచి వచ్చారని తెలిసింది.
ఆ శిశువు శరీరం వెలుపల మూత్రమార్గంతో, లింగనిర్ధారణ సాధ్యంకాని రీతిలో పుట్టడంతో వారు హైదరాబాద్లోని ఓ ఆస్పత్రికి తీసుకొచ్చారు. శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుందని, కొద్ది రోజుల తర్వాత రావాలని ఆస్పత్రి యాజమాన్యం సూచించింది.
ఇంటికి వెళుతున్న సమయంలో శిశువులో ఎటువంటి కదలికా లేకపోవటంతో చనిపోయినట్లు వారంతా భావించారు. దీంతో జేబీఎస్ సమీపంలో పాతిపెట్టాలని అనుకున్నారు.

ఫొటో సోర్స్, ugc
'కేసు నమోదు చేయలేదు... విచారణ చేస్తున్నాం'
ప్రాణాలతో బయటపడ్డ శిశువును పోలీసులు గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.
దీనిపై వెస్ట్ మారేడ్పల్లి ఎస్సై శ్రీనివాసులు బీబీసీతో మాట్లాడారు.
''వారు ఎందుకు సజీవ సమాధి చేయాలనుకున్నారో విచారిస్తున్నాం. ఇంకా కేసు నమోదు చేయలేదు. ఆ బిడ్డ తల్లి కరీంగనగర్ ఆస్పత్రిలో ఉంది. సిజేరియన్ ద్వారా ప్రసవం జరిగింది. తండ్రి నాలుగు రోజుల కిందట నీలోఫర్ ఆసుపత్రిలో శిశువును చేర్పించారు. శిశువు చనిపోయిందని వారు సమాధి చేయాలనుకున్నారా లేక వేరే ఏదైనా కారణముందా? అనే కోణంలో విచారిస్తున్నాం'' అని చెప్పారు.
ఇవి కూడా చదవండి
- ప్రసవంలో బిడ్డ చనిపోతే మళ్లీ గర్భధారణకు ఎన్నాళ్ళు ఆగాలి?
- వెనెజ్వేలా: పోషించే శక్తి లేక పిల్లల్ని అమ్మేస్తున్నారు
- చైనాలోని గాజు వంతెనలను ఎందుకు మూసేస్తున్నారు
- RCEP అంటే ఏమిటి? మోదీ ఈ ఆర్థిక బృందంలో చేరితే భారత్పై ఎలాంటి ప్రభావం ఉంటుంది?
- కశ్మీర్లో అక్టోబర్ 31 నుంచి ఎలాంటి మార్పులు రానున్నాయి..
- రేప్, డిప్రెషన్ నుంచి కోలుకునేందుకు ఈమెకు యోగా ఎలా ఉపయోగపడింది
- ఆల్కహాల్తో చేతులు కడుక్కునే నిరంకుశ నియంత.. నికొలస్ చాచెస్కూ
- హిందుత్వ రాజకీయాలకు రామాయణం టీవీ సీరియల్ ఊపిరి పోసిందా?
- భారత్లో వ్యాపారం ఎంత ఈజీగా మారిపోయిందంటే..
- గద్దలపై డేటా రోమింగ్ చార్జీలు.. క్రౌడ్ ఫండింగ్లో రూ. 1,11,000 సేకరించిన రష్యన్లు
- జింకని చంపుదామనుకుంటే అదే వేటగాడిని చంపేసింది
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








