ఏఎన్ 32: భారతీయ వాయుసేన విమాన శకలాలు లభ్యం - ఐఏఎఫ్ ప్రకటన

భారతీయ వాయుసేన విమానం (ఫైల్ ఫొటో)

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, భారతీయ వాయుసేన విమానం (ఫైల్ ఫొటో)

చైనా సరిహద్దుకు సమీపంలో కనిపించకుండా పోయిన భారతీయ వాయుసేన విమానం ఏఎన్-32 ఆచూకీ లభించిందని వాయుసేన ప్రకటించింది.

ఎనిమిది రోజుల కిందట అసోంలోని జోర్‌హాట్ నుంచి పైకెగిరిన తర్వాత ఈ విమానం కనిపించకుండా పోయింది.

‘‘అదృశ్యమైన ఏఎన్-32 శకలాలు లిపోకు ఉత్తరాన 16 కిలోమీటర్ల దూరంలో, టాటోకు ఈశాన్యాన దాదాపు 12 వేల అడుగుల ఎత్తు నుంచి భారతీయ వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలీకాప్టర్‌కు కనిపించాయి’’ అని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ ట్వీట్ చేసింది.

పోస్ట్‌ X స్కిప్ చేయండి, 1
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 1

ఈ విమానంలో పైలట్ల బృందానికి సంబంధించి 8 మందితో పాటు మొత్తం 13 మంది ప్రయాణిస్తున్నారని, వీరంతా వాయుసేనకు సంబంధించినవారేనని గతంలో వాయుసేన ప్రతినిధి రత్నాకర్ సింగ్ తెలిపారు.

జోర్‌హాట్ నుంచి 3వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12 గంటల 25 నిమిషాల సమయంలో బయలుదేరిన ఈ విమానం అరుణాచల్ ప్రదేశ్‌లోని మెచుంగా అడ్వాన్స్ ల్యాండింగ్ గ్రౌండ్‌కు చేరుకోవాల్సి ఉంది.

ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) వద్ద చివరిసారిగా మధ్యాహ్నం ఒంటి గంటకు విమానం ప్రయాణ వివరాలు నమోదయ్యాయి.

అయితే, నిర్ణీత సమయానికి విమానం మెచుంగా చేరుకోకపోవటంతో వాయుసేన విమానం కోసం వెతుకులాట ప్రారంభించింది.

అందుబాటులో ఉన్న అన్ని సాధనాలతో విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టామని రత్నాకర్ సింగ్ తెలిపారు.

గాలింపు చర్యల కోసం సుఖోయ్ 30, సీ 130 హెర్క్యులస్ విమానాలను ఉపయోగిస్తున్నామని, భారతీయ సైన్యం, ఇండో-టిబెటన్ సరిహద్దు రక్షణ దళం సహాయాన్ని కూడా తీసుకుంటున్నామని రత్నాకర్ సింగ్ స్థానిక విలేకరి దిలీప్ కుమార్ శర్మాతో చెప్పారు.

చైనా సరిహద్దులో మాయమైన భారత్ వాయుసేన విమానం
పోస్ట్‌ X స్కిప్ చేయండి, 2
X ఈ సమాచారాన్ని చూడాలనుకుంటున్నారా?

ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.

హెచ్చరిక: థర్డ్ పార్టీ కంటెంట్‌లో ప్రకటనలు ఉండొచ్చు

పోస్ట్ of X ముగిసింది, 2

గాలింపు చర్యలపై రక్షణ మంత్రి ఆరా

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మాయమైన విమానం ఆచూకీ, గాలింపు చర్యల వివరాలపై ఆరా తీశారు.

‘‘ఎయిర్ మార్షల్ రాకేశ్ సింగ్ భదౌరియాతో మాట్లాడాను. అదృశ్యమైన విమానాన్ని వెదికేందుకు భారతీయ వాయుసేన తరపున తీసుకున్న చర్యలను ఆయన వెల్లడించారు. విమానంలోని ప్రయాణీకుల క్షేమం కోసం ప్రార్థిస్తున్నాను’’ అని రాజ్‌నాథ్ ట్వీట్ చేశారు.

భారతీయ వాయుసేన చరిత్రలో అత్యంత భారీ గాలింపు చర్య అదే

2016లో కూడా భారతీయ వాయుసేనకు చెందిన ఏఎన్-32 విమానం ఒకటి అదృశ్యమైంది. చెన్నై నుంచి అండమాన్, నికోబార్ దీవులకు బంగాళాఖాతం మీదుగా వెళుతూ ఆ విమానం కనిపించకుండా పోయింది.

అప్పట్లో విమానం ఆచూకీ కనిపెట్టేందుకు ముమ్మర గాలింపు జరిగింది. భారతీయ వాయుసేన చరిత్రలో అత్యంత భారీ గాలింపు చర్య అదే. అయినప్పటికీ విమానం ఆచూకీ మాత్రం లభ్యం కాలేదు. ఆ విమానంలో 29 మంది ప్రయాణిస్తున్నారు.

ఏఎన్-32 విమానం ప్రత్యేకతలేంటి?

ఏఎన్-32 లేదా ఆంటొనోవ్-32 అని పిలిచే ఈ విమానం సైన్యానికి అవసరమైన సరుకులను రవాణా చేసే విమానం.

భారతీయ వాయుసేన 1984 నుంచి ఈ విమానాలను వినియోగిస్తోంది.

వీటిని ఉక్రెయిన్‌కి చెందిన పంతొనోవ్ స్టేట్ కార్పొరేషన్ డిజైన్ చేసింది.

ఏఎన్-32 విమానాలను సంక్లిష్ట వాతావరణ సమయాల్లో కూడా ఆధారపడదగ్గ విమానం అని భావిస్తుంటారు. భారతీయ వాయుసేన ఎన్నో ఆపరేషన్లలో దీనిని వినియోగించింది.

ఏడున్నర టన్నుల బరువును ఈ ఏఎన్-32 విమానం మోసుకెళ్లగలదు. రెండు ఇంజిన్ల ఈ విమానం గంటకు 530 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)