లోక్‌సభ ఎన్నికలు 2019: నరేంద్ర మోదీ హామీలు ఎంతమేర అమలుచేశారు? - BBC Reality Check

సెల్పీ తీసుకుంటున్న మోదీ

ఫొటో సోర్స్, Reuters

    • రచయిత, సమీహ నెట్టిక్కర
    • హోదా, బీబీసీ రియాలిటీ చెక్

దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం పెద్దయెత్తున సాగుతోంది. తొలి దశ పోలింగ్ ఈ నెల 11న గురువారం జరుగనుంది. ఓటర్ల సంఖ్య పరంగా చూస్తే భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. దేశంలో సుమారు 90 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు.

ఐదేళ్ల క్రితం ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ, మరోసారి బీజేపీ నేతృత్వంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి(ఎన్‌డీఏ)ను గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు. మరోవైపు ప్రధాన విపక్షం- అన్ని కీలక అంశాల్లో మోదీ విఫలమయ్యారని విమర్శిస్తోంది.

ఇంతకూ మోదీ ప్రభుత్వం బీజేపీ హామీలను ఎంత మేర నిలబెట్టుకుంది? అందుబాటులో ఉన్న సమాచారం, గణాంకాలతో బీబీసీ రియాలిటీ చెక్ బృందం వివిధ అంశాలపై ఈ కోణంలో విశ్లేషణ జరుపుతోంది.

భారత్ భద్రత

ఫిబ్రవరిలో పాకిస్తాన్‌ కేపీకే రాష్ట్రంలోని బాలాకోట్‌లో భారత వైమానిక దళం దాడులు జరిపిన తర్వాత, భారత దేశానికి సిసలైన రక్షణ కవచం తామేనని మోదీ ప్రభుత్వం చెప్పుకొంది.

సైనికులు

ఫొటో సోర్స్, Getty Images

యూపీఏ హయాంతో పోలిస్తే మోదీ హయాంలో కశ్మీర్‌లో భద్రతా పరిస్థితులు దిగజారాయని కాంగ్రెస్ విమర్శించింది.

కశ్మీర్‌లో ఎన్ని ఉగ్రదాడి ఘటనలు జరిగాయి?. . .

2018 చివరి వరకున్న సమాచారాన్ని బట్టి చూస్తే, రెండు ప్రభుత్వాల హయాంలోనూ మిలిటెంట్ కార్యకలాపాలు ఇంచుమించు ఒకే విధంగా ఉన్నాయి. 2009-13 మధ్య కాలంలో మొత్తం 1717 ఘటనలు నమోదయ్యాయి. 2014-18 మధ్యలో ఇంతకన్నా కొద్దిగా తక్కువగా 1708 ఘటనలు జరిగాయి.

కశ్మీర్‍‌లో హింసాత్మక ఘటనల్లో ఎంతమంది మరణించారు?. . .

అయితే 2016 నుంచి భారత పాలిత కశ్మీర్‌లోకి చొరబాటు యత్నాలు పెరుగుతున్నాయి.

తయారీ రంగం: భారత్ సూపర్ పవర్ అయ్యిందా?

2025 నాటికి స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో తయారీ రంగం వాటాను 25 శాతానికి పెంచుతామని 'మేక్ ఇన్ ఇండియా' విధానం కింద మోదీ ప్రభుత్వం ప్రకటించింది.

దిల్లీలోని ఓ ఏసీ తయారీ ఫ్యాక్టరీ

ఫొటో సోర్స్, Getty Images

ఇటీవలి సంవత్సరాల్లో ఇది కేవలం 15 శాతంపైనే ఉంది. 2025లోగా లక్ష్యాన్ని అందుకోగలమా అనే సందేహాన్ని నిపుణులు వ్యక్తంచేస్తున్నారు.

ఆర్థిక వ్యవస్థ పురోగతి మాత్రం కొనసాగుతోంది.

భారత్‌లో సేవల రంగం, తయారీ రంగం మధ్య పోలిక

మహిళలకు భద్రత పెరిగిందా?

మహిళల భద్రత ముఖ్యమైన అంశమని కాంగ్రెస్ మేనిఫెస్టో చెబుతోంది.

మహిళలపై హింసను అడ్డుకొనేందుకు కఠినమైన చట్టాలు తెచ్చామని మోదీ ప్రభుత్వం పేర్కొంటోంది.

మహిళలపై వేధింపులు

ఫొటో సోర్స్, Getty Images

అత్యాచార కేసుల నమోదు పెరిగిందని, ముఖ్యంగా 2012 నిర్భయ అత్యాచారం తర్వాత పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.

భారత్‌లో నమోదైన రేప్ కేసులు. . Bar chart showing number of rape cases reported in India each year. .

గత కొన్నేళ్లలో నేర నిర్ధరణ కేసుల రేటు మెరుగుపడలేదు.

మహిళలపై హింసను నివారించేందుకు, వారిపై హింసకు పాల్పడేవారిని శిక్షించేందుకు చేపట్టిన చర్యలను బీబీసీ పరిశీలించింది.

భారత్‌లో రేప్ కేసుల విచారణ. నేర నిరూపణ శాతం. .
పంట

ఫొటో సోర్స్, Getty Images

గ్రామీణ భారతం పరిస్థితి?

2022లోగా దేశంలోని రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మూడేళ్ల క్రితం ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. ఈ హామీని నిలబెట్టుకొనే దిశగా ప్రభుత్వం సాగుతున్నట్లు కనిపించడం లేదు.

రైతులను ఆదుకొనేందుకు గతంలో వ్యవసాయ రుణాలను మాఫీ రూపంలో ఒక ప్రయత్నం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో అప్పులు పెరుగుతున్నాయని ప్రతి ఐదేళ్లకోసారి నిర్వహించే జాతీయ కుటుంబ సర్వేలు చెబుతున్నాయి. 2017-18 సంవత్సరం నివేదిక ఇంకా విడుదల కాలేదు.

రైతుల రుణాలు

రుణమాఫీ పథకాల విషయంలో కాంగ్రెస్‌ను మోదీ విమర్శించారు. వ్యవసాయ రంగ కష్టాలకు ఈ పథకాలు సరైన పరిష్కారాలు కాదని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు నిజమే కావొచ్చని బీబీసీ పరిశీలన చెబుతోంది. రుణమాఫీ పథకాలు ఎన్నడూ ప్రభావవంతంగా అమలు చేయలేదు. ఈ పథకాల వల్ల మరిన్ని సమస్యలు ఉత్పన్నం కావొచ్చని కూడా బీబీసీ పరిశీలనలో వెల్లడైంది.

వంట వండుతున్న మహిళ

ఫొటో సోర్స్, Getty Images

వంటగ్యాస్ పథకం విజయవంతమైందా?

గ్రామాల్లోని కోట్ల కొద్దీ కుటుంబాలకు వంటగ్యాస్ సదుపాయం కల్పించేందుకు 2016లో 'ప్రధానమంత్రి ఉజ్వల యోజన' పేరుతో ప్రభుత్వం ఒక పథకాన్ని ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించింది.

భారత్‌లో వంటకు వివిధ ఇంధనాల వినియోగం తీరు

ప్రజలు కిరోసిన్, వంటచెరకు, పిడకల వాడకాన్ని తగ్గించి స్వచ్ఛమైన వంట ఇంధనం వైపు మళ్లేలా చేసేందుకు ప్రభుత్వం దీనిని తీసుకొచ్చింది. చాలా కుటుంబాలు ఎల్‌పీజీ గ్యాస్ వైపు మళ్లాయి. ఈ పథకం విజయవంతమైంది. అయితే గ్యాస్ సిలిండర్ల ధర ఎక్కువగా ఉండటం వల్ల చాలా కుటుంబాలు సిలిండర్లను రీఫిల్ చేయించుకోలేకపోతున్నాయని, ఈ గ్యాస్ వాడకాన్ని కొనసాగించలేకపోతున్నాయని బీబీసీ పరిశీలనలో స్పష్టమైంది.

మరుగుదొడ్ల నిర్మాణం

ఇప్పుడు 90 శాతం మంది భారతీయులకు మరుగుదొడ్ల సదుపాయం ఉందని ప్రధాని మోదీ చెప్పారు.

మరుగుదొడ్డి

ఫొటో సోర్స్, Getty Images

2014లో మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పుడు ఈ సంఖ్య 40 శాతంగా ఉంది.

మోదీ ప్రభుత్వం పెద్దసంఖ్యలో మరుగుదొడ్లు నిర్మించింది.

భారత్‌‌లో మరుగుదొడ్ల సౌకర్యం

అయితే అనేక మరుగుదొడ్లు సరిగా పనిచేయడం లేదు.

వివిధ కారణాల వల్ల వీటిని వాడటం లేదు.

గంగా నది ప్రక్షాళన

2020లోగా గంగానది ప్రక్షాళనకు రూ.20 వేల కోట్లు వెచ్చిస్తామని మోదీ ప్రభుత్వం 2014లో ప్రకటించింది. భారీగా నిధులు కేటాయించినప్పటికీ, అందులో అతి కొద్ది భాగమే ఖర్చుచేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

గంగానదిలో కలుస్తున్న తోళ్ల పరిశ్రమ వ్యర్థాలు, కాలుష్యం
ఫొటో క్యాప్షన్, గంగానదిలో కలుస్తున్న తోళ్ల పరిశ్రమ వ్యర్థాలు, కాలుష్యం

గంగా నది ప్రక్షాళనలో కొంత పురోగతి ఉన్నా, వచ్చే ఏడాదిలోగా ఈ కార్యక్రమం పూర్తయ్యే పరిస్థితైతే లేదు.

పోస్ట్‌ Facebook స్కిప్ చేయండి

కంటెంట్ అందుబాటులో లేదు

మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.

పోస్ట్ of Facebook ముగిసింది

రియాలిటీ చెక్ బ్రాండింగ్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)