గల్వాన్ ఘర్షణలో చైనా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారా

వీడియో క్యాప్షన్, గల్వాన్ ఘర్షణలో చైనా సైనికులు పెద్ద సంఖ్యలో చనిపోయారా

2020లో లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనాల మధ్య ఘర్షణల్లో తమకు కలిగిన నష్టాన్ని చైనా తక్కువ చేసి చూపించిందని ఒక నివేదిక పేర్కొంది.

వార్తాపత్రిక ది క్లాక్సన్.. ఈ ఘర్షణలపై పరిశోధనాత్మక నివేదిక ప్రచురించింది.

దీనిలో చైనాకు చెందిన పరిశోధకులు, బ్లాగర్ల వ్యాఖ్యలను ప్రస్తావించింది.

భద్రతా కారణాల రీత్యా వారి పేర్లను వెల్లడించలేదు. ఈ నివేదికలో అనేకమంది "వీబో యూజర్ల"ను ఉదహరించారు.

ఆరోజు రాత్రి ఒక జూనియర్ సార్జెంట్‌ సహా కనీసం 38 మంది పీఎల్ఏ సైనికులు మునిగిపోయారు. కానీ అధికారిక గణాంకాల్లో నలుగురు చనిపోయినట్లు, ఒక సార్జంట్ మునిగిపోయినట్లు చూపించారని తెలిపారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)