వాతావరణ మార్పులు: అస్సాం టీ రంగు, రుచి మారిపోతోంది..

వీడియో క్యాప్షన్, అస్సాం టీ రంగు, రుచి మారిపోతోంది.. ఎందుకంటే..

‘‘పోషకాలు, రంగు, రుచి, చిక్కదనం, వాసన వంటివి టీలో సరైన మోతాదులో ఉండాలి. కానీ నేడు తేయాకులో ఇవన్నీ ఉండాల్సిన స్థాయిలో ఉండటం లేదు. ఇదే ప్రధానమైన తేడా. గతంలో ఉండే పరిమళం, సువాసన ఇప్పుడు బాగా తగ్గిపోయాయి’’ అంటున్నారు జోర్హాట్‌లోని టాక్లాయ్ టీ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ టీ టేస్టర్ ఆర్‌సీ గొగొయ్.

కానీ కొన్నేళ్లుగా అస్సాంలో ఎండలు పెరగడంతోపాటు వానలు తగ్గిపోతున్నాయి.

ఈ ఏడాది ఒక్క నెలలో కూడా సాధారణ వర్షపాతం లేదా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదు కాలేదు.

సాధారణంగా అస్సాంలో జనవరి నుంచి సెప్టెంబరు మధ్య సుమారు 1,857 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. కానీ ఇప్పుడు 1,188 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదవుతోంది. ఇది 36శాతం తక్కువ.

అలాగే 28.9 డిగ్రీలుగా ఉండాల్సిన సగటు ఉష్ణోగ్రత 1.4 డిగ్రీలు పెరిగి 30.3 డిగ్రీలుగా నమోదవుతోంది.

అస్సాంలో పర్యావరణమార్పుల ప్రభావం టీ తోటల మీద బాగా కనిపిస్తోంది. తేయాకు ఉత్పత్తి మూడింట ఒకవంతు తగ్గొచ్చన్నది అంచనా.

సాగు నీటిని అందించడం ద్వారా సమస్యను కొంతమేరకు ఎదుర్కొవచ్చని కొందరు భావిస్తున్నారు. కానీ ఇది మాత్రమే సరిపోదని ఇంకొందరు అంటున్నారు.

ఇక్కడ వందల మంది మహిళలు అస్సాం టీ తోటల్లో పని చేస్తుంటారు. పర్యావరణ మార్పులు వీరిని తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. పెరుగుతున్న వేడి, తగ్గుతున్న వానల వల్ల తేయాకు ఉత్పత్తి తగ్గి తమ బతుకులు దెబ్బతింటాయేమోనని భయపడుతున్నారు. రేపు ఏమవుతుందో తెలియని అనిశ్చితి మధ్యే వీళ్లు నిత్యం జీవితాలను గడపాల్సి ఉంటుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)