టార్డిగ్రేడ్స్: చందమామపై చిక్కుకుపోయిన వేల 'మొండి' జీవులు.. 30 ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా బతికేస్తాయి

ఫొటో సోర్స్, Getty Images
చంద్రుడు ఇప్పుడు వేల 'మొండి' జీవులకు ఆవాసంగా మారే అవకాశం ఉంది.
ఎలుగుబంటి ఆకారంలో మిల్లీమీటర్ కంటే తక్కువ పొడవుండే మొండి జీవులు చంద్రుడిపై సజీవంగా ఉన్నాయని అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన ఆర్చ్ మిషన్ ఫౌండేషన్ తెలిపింది.
ఆ జీవులను టార్డిగ్రేడ్లు అంటారు. వాటర్ బేర్స్ అని కూడా పిలుస్తారు. అవి సున్నా డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నుంచి 150 డిగ్రీల సెంటీగ్రేడ్ వేడి వరకు అన్ని రకాల వాతావరణ పరిస్థితులనూ తట్టుకోగలవు.
అంతేకాదు, దశాబ్దాల పాటు ఆహారం లేకున్నా బతికే ఉంటాయి. అందుకే, వీటిని మహా మొండి జీవులంటారు.
ఇజ్రాయెల్ పంపిన అంతరిక్ష వాహనం 2019 ఏప్రిల్లో చంద్రుని మీద కూలిపోయింది (క్రాష్ ల్యాండ్ అయ్యింది). ఆ వాహనంలో టార్డిగ్రేడ్స్ను కూడా పంపించారు.
అయితే, వాహనం కూలిపోయినా అందులోని ఆ జీవులు తప్పకుండా సజీవంగానే ఉంటాయని వాటిని పంపిన ఆర్చ్ మిషన్ ఫౌండేషన్ అధినేత నోవా స్పివాక్ చెప్పారు.

ఫొటో సోర్స్, Science Photo Library
ఈ సంస్థ మానవ మేధోసంపత్తిని, భూమి మీద ఉండే అరుదైన జీవుల అవశేషాలను సౌరవ్యవస్థలోని వివిధ ప్రదేశాలకు పంపుతుంటుంది.
ఈ ఏడాది టార్డిగ్రేడ్స్ను చంద్రమండలానికి పంపింది. వాటితో పాటు మానవ చరిత్రకు సంబంధించి మూడు కోట్ల పేజీల సమాచారం నిక్షిప్తమై ఉన్న ఒక డీవీడీని కూడా రోబోటిక్ ల్యాండర్ చంద్రుని మీదికి మోసుకెళ్లింది.
టార్డిగ్రేడ్స్లో నీరు లేకుండా బాగా ఎండబెట్టి (నిర్జలీకరణం చేసి) పంపించారు.
శరీరంలో నీరు లేకుండా ఏ జీవులూ ఎక్కువకాలం బతకలేవు. కానీ, టార్డిగ్రేడ్స్ చాలా మొండి జీవులు. వీటిని ఎంతగా ఎండబెట్టినా, నీటి తడి తాకగానే మళ్లీ మామూలు స్థితికి వచ్చేస్తాయి.
ఎండబెట్టాక ఇరవై ముప్పై ఏళ్ల తర్వాత నీటి తడి తాకినా... వెంటనే మళ్లీ సాధారణ స్థితికి వచ్చేయగలవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఎండిపోయినప్పుడు అవి తలలు, ఎనిమిది కాళ్ళను తొలగించుకుని చిన్న బంతిలాగా మారతాయి. దాదాపు మరణం అంచుల దాకా వెళ్తాయి.
శరీరంలోని నీటినంతా త్యజిస్తాయి. జీర్ణక్రియ రేటు మామూలు స్థితితో పోల్చితే 0.01 శాతానికి పడిపోతుంది.
ఆ పరిస్థితుల్లోనూ కొన్ని దశాబ్దాలపాటు ప్రాణంతో ఉండగలవు.

ఫొటో సోర్స్, Getty Images
ఆర్చ్ మిషన్ సంస్థ 2007లోనూ ఈ జీవులను అంతరిక్షంలోకి పంపింది.
భూగోళం మీద అత్యంత మొండివిగా పేరున్న టార్డిగ్రేడ్స్ను అంతరిక్షంలోకి పంపడం ఉత్తమమని నోవా స్పివాక్ అన్నారు.
అయితే, ఇప్పుడు చంద్రుడి మీద ఇవి ప్రాణంతో ఉండగలిగినా, ఆ గ్రహం మీది వాతావరణం కారణంగా వాటి పరిస్థితి గొప్పగా ఏమీ ఉండకపోవచ్చునని ప్లానెటరీ అండ్ స్పేస్ సైన్సెస్ ఓపెన్ యూనివర్సిటీ ప్రొఫెసర్ మోనికా గ్రాడీ అన్నారు.
"అంతరిక్ష ప్రయోగాలు చేసేవారు వాతావరణ కాలుష్య నియంత్రణకు సంబంధించిన అంతర్జాతీయ నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. కానీ, ఈ టార్డిగ్రేడ్స్ను చంద్రుని మీదకు పంపేందుకు ఆ సంస్థకు అనుమతులు ఉన్నాయని నేను అనుకోవడంలేదు. ఇది మంచి పని కాదు" అని మోనికా చెప్పారు.
టార్డిగ్రేడ్లు చంద్రునిపై ఎండిన దశలో సురక్షితంగా దిగినా, నీటి తడి తగిలేంత వరకూ అవి మామూలు స్థితిలోకి అవకాశం లేదు.
అయితే, కొన్నాళ్లకు ఆ జీవులను తిరిగి భూమి మీదకు తీసుకొచ్చి పరీక్షిస్తే, చంద్రమండలంలోని వాతావరణ ప్రభావం వాటి మీద ఎలా ఉందో అధ్యయనం చేసేందుకు వీలుంటుంది.
ఇవి కూడా చదవండి:
- మనుషుల కంటే ముందు అంతరిక్షంలోకి రోబోలను పంపనున్న ఇస్రో
- జమ్మూ కశ్మీర్ విభజన: ఏదో ఒక రోజు మళ్లీ రాష్ట్రం హోదా ఇస్తాం: అమిత్ షా
- వీకెండ్లో పబ్ కెళ్లడానికి బదులు ఇక్కడికొచ్చి నగ్నంగా కూర్చుంటారు
- 'ఆర్టికల్ 370 సవరణ': 'ఇలాంటి పరిస్థితులను ఎన్నడూ చూడలేదు'
- 'ఆర్టికల్ 370 సవరణ'తో జమ్మూ, కశ్మీర్లో ఏమేం మారతాయి
- రాళ్లు అమ్మి కోటీశ్వరుడైన ఓ 'మేధావి' కథ
- కశ్మీర్కు ప్రత్యేక జెండా ఎందుకు ఉంది? ఆ జెండా ప్రత్యేకత ఏమిటి?
- ‘నపుంసకుడని చెప్పకుండా నాకు పెళ్లి చేశారు!’
- ‘కశ్మీర్ ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం రద్దు’
- 1971 యుద్ధంలో పాకిస్తాన్ నుంచి భారత్ స్వాధీనం చేసుకున్న అందమైన ఊరు కథ
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- 'ఒక మహిళతో కలసి జీవించాలని నేనెందుకు నిర్ణయించుకున్నానంటే..'
- సెక్స్ విప్లవానికి తెర లేచిందా...
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటో బ్లాక్ అండ్ వైటా.. కలరా?
- ఆర్టోస్: ఇది మా కూల్ డ్రింకండీ
- నా భర్త నన్ను ప్రేమించాడు, కానీ పడగ్గదిలో హింసించాడు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








