భారత్ దాడులతో మూసేసిన గగనతలాన్ని మళ్ళీ తెరిచిన పాకిస్తాన్

ఫొటో సోర్స్, Getty Images
బాలాకోట్ దాడుల తర్వాత మూసివేసిన తమ ఎయిర్ స్పేస్ను మళ్లీ తెరుస్తున్నట్లు పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీ(సీఏఏ) ప్రకటించింది.
పాక్ గగనతలాన్ని తక్షణం తెరుస్తున్నట్లు మంగళవారం ఉదయం అథారిటీ తమ అధికారిక వెబ్సైట్లో చెప్పింది.
ఫిబ్రవరి 14న పుల్వామా దాడికి సమాధానంగా ఫిబ్రవరి 28న భారత్ బాలాకోట్లో వైమానిక దాడులు జరిపింది. తర్వాత పాకిస్తాన్ తమ గగనతలం మూసేసింది.
పాకిస్తాన్ నిర్ణయంతో నష్టాలు ఎదుర్కున్న భారత ప్రభుత్వ విమాన సంస్థ ఎయిర్ ఇండియాకు ఇది ఉపశమనం కలిగించింది.
పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేయడంతో ఎయిర్ ఇండియా అంతర్జాతీయ విమానాలు వేరే మార్గంలో వెళ్లాల్సొచ్చింది. చాలాదూరం చుట్టు తిరిగి వెళ్లడం వల్ల కోట్ల రూపాయల నష్టాలు ఎదుర్కుంది.
పాకిస్తాన్ సివిల్ ఏవియేషన్ అథారిటీలోని ఎయిర్మెన్(NOTAM) భారత కాలమానం ప్రకారం సుమారు 12.41కు ఒక నోటీస్ జారీ చేసింది.

ఫొటో సోర్స్, Pcca
అందులో పాకిస్తాన్ గగనతలాన్ని అన్నిరకాల పౌర విమానాల కోసం తక్షణం తెరుస్తున్నట్లు చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
ఎవరికి ఎంత నష్టం
పాకిస్తాన్ ఎయిర్ స్పేస్ మూసేసిన తర్వాత భారత విమాన సంస్థలు, ముఖ్యంగా ఎయిర్ ఇండియా రోజూ కోట్ల రూపాయల నష్టాలు ఎదుర్కుంది.
భారత పౌర విమానయాన మంత్రి హర్దీప్ సింగ్ పురీ జులై 3న దీనికి సంబంధించి రాజ్యసభలో కొన్ని గణాంకాలు ప్రవేశపెట్టారు.
అందులో ఎయిర్ ఇండియాకు జులై 2 వరకూ 491 కోట్ల రూపాయల నష్టం వచ్చినట్లు చెప్పారు.
పాక్ నిర్ణయం వల్ల ప్రైవేటు ఎయిర్ లైన్స్ కంపెనీ స్పైస్ జెట్కు 30.73 కోట్లు, ఇండిగోకు 25.1 కోట్లు, గో ఎయిర్కు 2.1 కోట్ల రూపాయల నష్టం వచ్చింది.
పాక్ తమ ఎయిర్ స్పేస్ మూసేసిన తర్వాత యూరప్, అమెరికా వెళ్లే ఎయిర్ ఇండియా విమానాలు సుదీర్ఘ మార్గంలో వెళ్లాల్సి వచ్చింది. చాలా అంతర్జాతీయ విమానాలను రద్దు చేయాల్సివచ్చింది.
ఇండిగో దిల్లీ- ఇస్తాంబుల్ డైరెక్ట్ విమాన సేవలను రద్దు చేసింది. పాక్ ఎయిర్స్పేస్ మూసేయడంతో అక్కడికి వెళ్లేదారిలో ఈ విమానం కతార్లోని దోహాలో ఆగాల్సివచ్చేది.
పాక్ ప్రకటన తర్వాత భారత్ కూడా రెండు దేశాల గగనతలంపై ఎలాంటి ఆంక్షలూ లేవని ప్రకటించింది.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
అమెరికా నుంచి దిల్లీ, ముంబైలకు విమాన సేవలను రద్దు చేసిన యునైటెడ్ ఎయిర్ లైన్స్ దానిని పొడిగిస్తున్నట్లు ప్రకటించిన కొన్ని గంటల్లోనే పాకిస్తాన్ తమ నిర్ణయాన్ని ప్రకటించింది.
ఇవి కూడా చదవండి:
- చంద్రునిపై కాలుమోపి 50 ఏళ్లు... మానవ జీవితంలో వచ్చిన 8 మార్పులు
- ప్రపంచవ్యాప్తంగా 7 కోట్ల మంది వలస.. 70 ఏళ్లలో ఇదే అత్యధికం - యుఎన్హెచ్సీఆర్
- తొలి భారతీయులు ఎవరు.. ఆఫ్రికా నుంచి వలసొచ్చినవారి వారసులా?
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- దుబాయ్ యువరాణి.. భర్తను వదిలి లండన్ ఎందుకు పారిపోయారు?
- అరబ్ దేశాల్లో మతాన్ని వదిలేసేవారు పెరుగుతున్నారు :బీబీసీ సమగ్ర సర్వే
- ఉదారవాదానికి కాలం చెల్లిందా? పుతిన్ మాట నిజమేనా?
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- మగాళ్ళ గర్భనిరోధక జెల్ ఎలా పని చేస్తుంది...
- క్రికెట్ ప్రపంచకప్ 2019: మీరు తెలుసుకోవాల్సిన 12 విషయాలు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)








