You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈజిప్ట్ తవ్వకాల్లో బయటపడిన పిల్లులు, పేడ పురుగుల మమ్మీలు
సాధారణంగా ఈజిప్టులో మనుషుల మమ్మీలు బయటపడతాయి. కానీ ఈసారి పిల్లులు, పేడపురుగుల మమ్మీలు బయటపడ్డాయి.
ఈజిప్ట్ రాజధాని కైరో సమీపంలో పురాతత్వ శాస్త్రవేత్తలు కొన్ని పురాతన సమాధుల్లో తవ్వకాలు జరిపారు. ఈ తవ్వకాల్లో పిల్లులు, పేడపురుగుల మమ్మీలు బయటపడ్డాయి.
ఈ మమ్మీలు 4 వేల సంవత్సరాలకు పైబడినవని పరిశోధనలో తేలింది. దక్షిణ కైరో వద్ద ఉన్న సకారలోని స్మశానంలో ఈ తవ్వకాలు జరిపారు. ఈ స్మశానవాటిక ఈజిప్ట్ రాజధాని మెమ్ఫిస్ నగరానికి చెందినది.
పిల్లులు, ఇతర జంతువులకు మరణానంతర జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుందని ప్రాచీన ఈజిప్షియన్లు విశ్వసించేవారు.
ఒక సమాధిలో 'పిల్లుల దైవం'కు అంకితమిస్తూ తయారు చేసిన ఒక కంచు పిల్లి విగ్రహాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు.
పేడపురుగులకు కూడా ఒక మతపరమైన గుర్తింపు ఉండేది. ఈ జీవులు సూర్యదేవుని చిహ్నంగా భావించేవారు.
మనుషులు మరణించాక, వారి దేహాలను మమ్మీలలో భద్రపరుస్తారు. కానీ జంతువులను మమ్మీలలో భద్రపరచడం.. నైవేద్యం ఇవ్వడం లాంటిది.
ఈజిప్ట్ రాజు యూసర్ కఫ్ పిరమిడ్ కాంప్లెక్స్ సమీపంలో జరిపిన తవ్వకాల్లో 7 పేటికలు బయటపడ్డాయి. వీటిలో మూడింటిలో పిల్లుల మమ్మీలున్నాయి.
ఈ తవ్వకాల్లో, మరొక సమాధిలోకి వెళ్లే ఒక ద్వారాన్ని అధికారులు కనుగొన్నారు. మరికొన్ని రోజుల్లో ఈ ద్వారాన్ని తెరవాలని అధికారులు భావిస్తున్నారు.
ఈ సమాధిలో పాక్షికంగానే తవ్వకాలు జరిగాయని, ఇంకా ఆ ప్రాంతంలో మరిన్ని తవ్వకాలు జరగాలని అధికారులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- కేరళ వరదలు: ఫేక్న్యూస్ ప్రవాహం
- జాతీయవాదం పేరిట వ్యాప్తి చెందుతున్న ఫేక్ న్యూస్ - బీబీసీ తాజా పరిశోధనలో వెల్లడి
- ‘ఫేక్న్యూస్ మూలాలు మహాభారతంలోనూ ఉన్నాయి’ - మాడభూషి శ్రీధరాచార్యులు
- తెలంగాణ ఎన్నికలు.. బీబీసీ ప్రత్యేక కథనాలు
- తెలంగాణ ఎన్నికలు: సోషల్ మీడియాలో ప్రచారం ఎలా జరుగుతోందంటే..
- మిషెల్ ఒబామా: నా పిల్లలిద్దరూ ఐవీఎఫ్ ద్వారా జన్మించారు
(బీబీసీ తెలుగును ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఫాలో అవ్వండి. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేయండి.)